Gujarat Accident: ఘోర ప్రమాదం.. ఇసుక డంపర్ బోల్తా పడి నలుగురు మృతి!

గుజరాత్‌ బనస్కాంతలోని థరాడ్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లోడ్ తో వెళ్తున్న డంపర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోడ్డు పాక్కనే పనిచేస్తున్న నలుగురు కార్మికులు పై డంపర్ పడి అక్కడిక్కడే మరణించారు.

New Update
 Gujarat Accident

karimnagar crime

 Gujarat Accident:  గుజరాత్‌లోని బనస్కాంతలోని థరాడ్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఖేంగార్పుర గ్రామం సమీపంలో ఇసుకతో లోడ్ తో వెళ్తున్న డంపర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే పనిచేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. బోల్తా పడిన డంపర్ వారిపైకి దూసుకురావడంతో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరణించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. జేసీబీ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. డంపర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Naga Chaitanya: బ్రేకప్ బాధేంటో నాకు తెలుసు.. సమంతతో విడాకులపై కన్నీరు పెట్టించే చైతూ వీడియో!

 దాహోద్ జిల్లాకు చెందినవారు

పోలీసుల వివరాల ప్రకారం.. మృతులందరూ దాహోద్ జిల్లాకు చెందినవారు. పని కోసం వారు అక్కడికి వచ్చారు. అయితే  రోడ్డు పనులు జరుగుతున్న క్రమంలో మలుపు వద్ద బయటకు వెళ్లడానికి స్థలం లేదు. అయినప్పటికీ డ్రైవర్ డంపర్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించగా బోల్తా పడినట్లు తెలిపారు.  

Also Read: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

Also Read: Priyanka Chopra: తమ్ముడి పెళ్లి ఊరేగింపులో ప్రియాంక చోప్రా డాన్స్.. అంబానీ కుటుంబం కూడా.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BREAKING : సుప్రీం కోర్టు నూతన CJIగా BR గవాయ్ పేరు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.

New Update
new CJI

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు. మే 14న తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  2019లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. సుప్రీంకోర్టకు రాకముందు ముంబై హైకోర్టు జడ్జిగా చాలాకాలం పని చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో గవాయ్ జన్మించారు. 64 ఏళ్ల జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 2025 లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సిజెఐ పదవీకాలం 2025 మే 14 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది.

ఈయన తండ్రి ఏఆర్ గవాయ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. లోక్ సభ, రాజ్యసభలో ఎంపీగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే, బీహార్, కేరళా,సిక్కిం రాష్ట్రాల గవర్నర్ గా కూడా పని చేశారు. 

 

Advertisment
Advertisment
Advertisment