భాష ఆగిపోతే.. శ్వాస ఆగిపోయినట్లే : వెంకయ్య నాయుడు

హైదరాబాద్‌లో జరుగుతున్న తెలుగు మహాసభల్లో మజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు భాషకు మనమందరం వారసులమని.. దీన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. భాష ఆగితే శ్వాస ఆగిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.

New Update
Venkaiah Naidu

Venkaiah Naidu

హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు సమాఖ్య మహాసభల్లో మజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషకు మనమందరం వారసులమని.. దీన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. మాతృభాషను మనం కాకుంటే ఇంకెవరు ప్రేమిస్తారని ప్రశ్నించారు. అందరికీ మన మాతృభాష తెలుగులో మాట్లాడటం అలవాటు కావాలన్నారు. దేశంలో ప్రస్తుతం గొప్ప పదవుల్లో ఉన్నవాళ్లందరూ కూడా మాతృభాషలో చదువుకున్నవారేనని తెలిపారు. అలాగే తన ఉన్నతికి కూడా తెలుగే కారణమని పేర్కొన్నారు.  

Also Read: మల్లారెడ్డి తమ్ముడిపై కేసు.. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!

'' అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సభలను అమెరికాలో మొదలుపెట్టారు. అప్పుడు కూడా నేను ఆ సభలో పాల్గొన్నాను. వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారందరినీ ఒకే వేదికపై తీసుకురావడం గొప్ప విషయం. తెలుగు భాషను మన ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ప్రతీభాషకు కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. తెలుగు ఎంతో విలక్షణమైన భాష. మన భాషకు అలంకారాలు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.  

Also Read: ఏపీకి మరో 52 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే!

జీవిత అర్థాలను తెలిపే సామెతలు తెలుగులో చాలా ఉన్నాయి. మన సంస్కృతిని మాతృభాష తనలో ఇముడ్చుకుంది. 2012లో ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా తెలుగు రికార్డు సృష్టించింది. భారత్‌లో 450 వరకు భాషలు ఉన్నాయి. ఇంగ్లీష్ భాష వ్యామోహం వల్ల కొన్ని భాషలు అంతరించిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి. భాష ఆగితే శ్వాస ఆగిపోయినట్లే. మాతృభాష మర్చిపోతే.. మాతృబంధం కూడా విడిపోయినట్లే. ప్రాథమిక విద్యను తెలుగు భాషలోనే అందించాలని'' వెంకయ్య నాయుడు తెలిపారు. 

Also Read: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత సంచలన కామెంట్స్

Also Read: ఈవీఎంలపై అనుమానంతో ఆ గ్రామంలో చట్టవిరుద్ధంగా ఎన్నికలు.. చివరికి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

విషాదం.. సరదాగా పొలానికి వెళ్లిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే?

కరీంనగర్‌లో సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అత్తమ్మ వాళ్లు పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లి ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. ట్రాక్టర్‌తో పాటు చిన్నారి బావిలోకి దూసుకెళ్లడంతో మృతి చెందింది.

New Update
suryapet crime

Crime

సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మూడేళ్ల చిన్నారి అత్తమ్మ ఇంటికి సరదాగా వెళ్లింది. అత్తమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ఎక్కిస్తే నవ్వుతూ కూర్చొంది.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

ఒక్కసారిగా తాళం తిప్పడంతో..

ఆమెను ట్రాక్టర్ ఎక్కించిన తర్వాత అత్తమ్మ కొడుకును ఎక్కించడానికి పక్కకి వెళ్లారు. ఇంతలో ఆ మూడేళ్ల పాప ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. దీంతో ఆ చిన్నారితో పాటు ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి  కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.

ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.  అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు.  

Advertisment
Advertisment
Advertisment