Farmers: కనీస మద్దతు ధరకు రూ.30వేల కోట్లు కేటాయించండి.. రైతుల డిమాండ్

పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాల నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆరో విడత చర్చలు శనివారం జరిగాయి. MSP అమలుకు ఏడాదికి రూ.30 వేల కోట్లు కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు.

New Update
Farmers

Farmers

పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘాల నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆరో విడత చర్చలు శనివారం జరిగాయి. చండీగఢ్‌లో మహాత్మగాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సమావేశం కొనసాగింది. ఇందులో కేంద్ర మంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, పియూష్‌ గోయల్, ప్రహ్లాద్‌ జోషితో పాటు 28 మంది రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.  

Also Read: మన్ కీ బాత్.. తెలంగాణ బిడ్డపై ప్రధాని మోదీ ప్రశంసలు..

మార్చి 19న మరోసారి చండీగఢ్‌లో సమావేశం కావాలని నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ తెలిపారు. కేంద్రం కనీస మద్దతు ధరలను అమలు చేసేందుకు కట్టుబడి ఉంటే ఏడాదికి రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల నిధులు కేటాయించడం పెద్ద సమస్య కాదని రైతు నేతలు అన్నారు. ఎమ్‌ఎస్పీ అమలుకు ఏడాదికి రూ.30 వేల కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Also Read: మైనర్‌ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

కనీస మద్దతు ధర వల్ల కలిగే ప్రయోజనాలు వివరించగా.. సాధికార గణాంకాలను కేంద్ర బృందం కోరిందని రైతు నేతలు తెలిపారు. వీటిని వారం రోజుల్లో అందిస్తామని తాము చెప్పినట్లు పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాలకు చెందిన జగ్జిత్ సింగ్‌ డల్లేవాల్‌, స్వరణ్ సింగ్‌ తదితర రైతు నేతలు, ఇద్దరు పంజాబ్ రాష్ట్ర మంత్రులు చర్చల్లో పాల్గొన్నారు.    

Also Read: తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్స్..ఎప్పటినుంచంటే...

Also Read: మవోలకు మరో దెబ్బ.. భారీ డంప్ స్వాధీనం.. పోలీసుల చేతికి కీలక సమాచారం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh: భార్యకు దగ్గరుండి ప్రియుడికిచ్చి రెండో పెళ్లి చేసిన భర్త!

ఉత్తరప్రదేశ్ లో  భార్యలను వారి ప్రియులకిచ్చి పెళ్లి చేస్తోన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కబీర్ నగర్ జిల్లాకు చెందిన ఓ భర్త తన భార్యకు ప్రేమ వివాహం జరిపించాడు. తాజాగా మరొకటి జరిగింది. రాహుల్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వైష్ణవితో వివాహం జరిగింది.

New Update
marriage lover

marriage lover

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో కట్టుకున్న భార్యలను వారి ప్రియులకిచ్చి పెళ్లి చేస్తోన్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కబీర్ నగర్ జిల్లాకు చెందిన ఓ భర్త తన భార్యకు ప్రేమ వివాహం జరిపించాడు. తాజాగా మరొక ఘటన జరిగింది.  రాహుల్ సింగ్ (25)అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వైష్ణవి(23)తో వివాహం జరిగింది. అయితే అప్పటికే   వైష్ణవి మనోజ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీంతో భర్తతో రెండేళ్ల పాటు వైష్ణవి దూరంగా ఉంది. రాహుల్ ఆమెను తిరిగి రావాలని చాలాసార్లు ఒప్పించడానికి ప్రయత్నించాడు కానీ ఆమె నిరాకరిస్తూనే వచ్చింది. దీంతో తన భార్యకు నచ్చిన వ్యక్తితోనే పెళ్లి చేయాలని రాహుల్ నిర్ణయించుకున్నాడు. వారి ప్రేమ పెళ్లికి పెద్దలు కూడా  ఒప్పుకోగా, భర్తే తన భార్యకు దగ్గరుండి రెండో వివాహం జరిపించాడు.  ఒక న్యాయవాది సహాయంతో స్థానిక తహసీల్ కార్యాలయంలో వైష్ణవి, మనోజ్‌ల పెళ్లిని జరిపించాడు. 

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!

భార్య అక్రమ సంబంధం.. లవర్తో రెండో పెళ్లి

ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ భర్త తన భార్యకు రెండో పెళ్లి చేశాడు.  కతర్ జోట్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు - ఆర్యన్ (7), శివాని (2) జన్మించారు.  పనిపనుల కారణంగా బబ్లూ తరచుగా బయట ప్రదేశాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో రాధికకు స్థానిక యువకుడైన వికాస్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇది అక్రమ సంబంధానికి దారి తీసింది.  ఆ సంబంధం చాలా కాలం పాటు కొనసాగింది. ఆ తర్వాత బబ్లూకు ఈ  విషయం తెలిసింది.  ఆ తర్వాత బబ్లూ ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాడు. తాను ఎలాగూ తన భార్యకు సమయం కేటాయించలేకపోతున్నానని.. తన భార్య ఇష్టపడిన వ్యక్తితోనే ఇచ్చి రెండో పెళ్లి చేశాడు.  

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Advertisment
Advertisment
Advertisment