Priyanka Gandhi: 'ఆమె ఏ గ్రహం మీద నివసిస్తోంది'.. నిర్మలపై ప్రియాంక గాంధీ సెటైర్లు

ఇటీవల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. తన ప్రసంగంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై మట్లాడిన అంశాలను ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. అసలు ఆమె ఏ గ్రహం మీద ఉంటున్నరో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Nirmala Sitharaman and Priyanka gandhi

Nirmala Sitharaman and Priyanka gandhi

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శలు చేశారు. ఇటీవల పార్లమెంటులో నిర్మలా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన సమాధానంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి బడ్జెట్‌ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. ప్రభుత్వం తీసుకునే మొత్తం రుణాన్ని 2025-26 మూలధన వ్యయాలకు వినియోగించబోతోందని చెప్పారు. 

Also Read: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!

అలాగే నిరుద్యోగంపై కూడా స్పందించారు. అయితే నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. '' దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ధరల పెరుగుధల లాంటివి లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. అసలు ఆమె ఏ గ్రహం మీద ఉంటున్నరో నాకు అర్ధం కావడం లేదని'' ప్రియాంక గాంధీ సెటైర్లు వేశారు. ఇదిలాఉండగా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బిహార్ ఎన్నికలే టార్గెట్‌గా ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు ఆరోపణలు చేశాయి.  

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ఇదిలాఉండగా ఈసారి బడ్జెట్‌లో మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరటనిచ్చేలా రూ.12 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పన్ను చెల్లించే శ్లాబ్‌లను కూడా మార్చారు.  రూ. 75000 స్టాండర్డ్ డిడక్షన్  కలిపితే రూ. రూ.12,75,000 వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మధ్యతరగతి ప్రజలు స్వాగతించారు. నిర్మలా సీతారామన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. 

Also Read: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

Also Read: Trump: ట్రంప్ నిర్ణయంతో హెచ్‌ఐవీ మరణాలు 63 లక్షలు పెరుగుతాయంటున్న ఐరాస...!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime News: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి

బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తితో పారిపోయిందని ఆగ్రహించిన తండ్రి ఆమెను ఇంటికి రప్పించి హత్య చేశాడు. చివరికి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

New Update
Bihar Man Kills Daughter

Bihar Man Kills Daughter

బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తండ్రి ఆమెను హత్య చేయడం కలకలం రేపింది. మృతదేహన్ని బాత్‌రూమ్‌లో ఉంచి  లాక్‌ చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాక్షి (25) అనే అమ్మాయి తన ప్రియుడితో కలిసి మార్చి 4న ఢిల్లీకి పారిపోయింది. మాజీ సైనికుడైన తండ్రి ముఖేష్ సింగ్ వారం తర్వాత తన కూతురుకు నచ్చజెప్పాడు. ఆ తర్వాత సమస్తిపూర్‌కు ఆమెను రప్పించాడు.   

Also Read: భారత్‌కు చేరుకున్న తహవ్వుర్ రాణా.. ఉరిశిక్ష విధిస్తారా ?

కానీ వేరే కులానికి చెందిన వ్యక్తితో కూతురు వెళ్లిపోవడంతో తండ్రి ముఖేష్ సింగ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి ఏప్రిల్ 7న తన కూతురును హత్య చేశాడు. ఇంట్లో బాత్‌రూమ్‌లో మృతదేహాన్ని ఉంచి లాక్ చేశాడు. అనంతరం ఆమె ప్రియుడిని కూడా హత్య చేసేందుకు వెళ్లాడు. కానీ అతడు గ్రామంలో లేకపోవడంతో వెనక్కి వచ్చేశాడు. అయితే కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లి భర్తను ముఖేష్‌ను అడిగింది. దీనికి అతడు సాక్షి మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. 

Also Read: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్‌ బిలియనీర్‌ కేసులో భయంకర నిజాలు!

దీంతో కూతురు కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటికి వచ్చి పరిశీలించారు. లాక్‌చేసిన బాత్‌రూమ్ నుంచి దుర్వాసన రావడం గమనించారు. డోర్‌ తీయగా లోపల మృతదేహం కనిపించడంతో షాక్ అయిపోయారు. దీంతో తండ్రి ముఖేష్‌ను అదుపులోకి తీసుకొని అడిగారు. వేరే కులం వ్యక్తితో పారిపోవడంతో తానే హత్య చేసినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. చివరికీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Also Read: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!

rtv-news | murder

 

Advertisment
Advertisment
Advertisment