Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్‌లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్

ఢిల్లీలో సోమవారం ఈ సీజన్‌లోనే ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్‌జంగ్‌లో 40.2 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్ నమోదైంది. ఇది సాధారణం కంటే 5.1 డిగ్రీలు ఎక్కువని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేపటి వరకూ ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

New Update
Delhi highest temperature

Delhi highest temperature

ఢిల్లీలో భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. సోమవారం ఢిల్లీలో ఈ సీజన్‌లోనే ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్‌జంగ్‌లో 40.2 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్ నమోదైంది. ఇది సాధారణం కంటే 5.1 డిగ్రీలు ఎక్కువని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఉత్తర, మధ్య భారత్‌లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదైయ్యే అవకాశం ఉందని  IMD అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీలో మంగళవారం వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధానితోపాటు వాయువ్య, మధ్య భారతదేశంలో హీట్‌వేవ్ సంభవించవచ్చని తెలిపారు. 

Also read: Varanasi gang rape: ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ యువతికి మత్తుమందు ఇచ్చి.. 23 మంది గ్యాంగ్‌రేప్

ఢిల్లీలోని పాలంలో ఉష్ణోగ్రత ఒకేసారి 39.5 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువ. సోమవారం నుండి బుధవారం వరకు రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40, 42 డిగ్రీల సెల్సియస్ చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీని ఇప్పటికే కాలుష్య భూతం పట్టి పీడిస్తుంటే.. మరో వైపు వేసవి ఉష్ణోగ్రతలు ఢిల్లీవాసులకు నరకం చూపిస్తున్నాయి. ఏప్రిల్ 7న హిమాచల్ ప్రదేశ్‌లోని ఏకాంత ప్రాంతాలు ప్రభావితమవుతాయి. ఏప్రిల్ 7 నుండి 10 వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 7 నుండి 9 వరకు, మధ్యప్రదేశ్‌లో ఏప్రిల్ 8 నుండి 10 వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉంది. రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్రలలోని దాదాపు 21 నగరాల్లో రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Also read: Mamata Banerjee: త్వరలోనే నన్ను అరెస్ట్ చేసి జైళ్లో వేస్తారు.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

New Update
Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకపక్షంగా పదవి ఆయనకే ఖరారైపోయింది. ఈ ఎన్నిక వెనుక అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Also Read: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?

1960లో కన్యాకుమారి జిల్లా వడివీశ్వరంలో నాగేంద్రన్ జన్మించారు. 2001, 2011, 2021 ఎన్నికల్లో తిరునల్వేలి స్థానం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001- నుంచి 2006 సమయంలో ఏఐడీఎంకే పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2017లో ఏఐడీఎంకేను వీడి బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నారు. జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 

Also Read: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..

ప్రభుత్వ పాలనలో అనుభవం, ప్రజాధారణ, రాజకీయ వ్యూహాలపై పట్టుఉండటంతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐడీఎంకే, బీజేపీలను సమన్వయం చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అయితే ఇటీవల రామేశ్వరంలో పాంబన్ వంతెన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు నాగేంద్రన్ కనిపించారు. వాస్తవానికి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే పదేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం ఉడాలి. కానీ పార్టీ అభివృద్ధికి నాగేంద్రన్ కృషి చేయడం వల్ల  ఆయనకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. 

telugu-news | rtv-news | national-news | bjp

Advertisment
Advertisment
Advertisment