Delhi Airport: సెంట్రల్ గవర్నమెంట్‌పై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ దావా

రక్షణశాఖకు చెందిన విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని సవాల్‌ చేస్తూ జీఎంఆర్‌ సంస్థ దావా వేసినట్లు  తెలిపింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల యాజమాన్యంలో జీఎంఆర్‌కు మెజారిటీ వాటా ఉంది. కేంద్రంపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కోర్టులో దావా వేసింది.

New Update
delhi airport

delhi airport Photograph: (delhi airport)

కేంద్రంపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కోర్టులో దావా వేసింది. రక్షణశాఖకు చెందిన విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని సవాల్‌ చేస్తూ జీఎంఆర్‌ సంస్థ దావా వేసినట్లు  తెలిపింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల యాజమాన్యంలో జీఎంఆర్‌కు మెజారిటీ వాటా ఉంది. గతేడాది దాదాపు 73.6 మిలియన్ల మంది ప్రయాణికులు దీనిని ఉపయోగించారు. ప్రభుత్వ రుసుములు పెరగడం వల్ల దాదాపు 21 మిలియన్‌ డాలర్లు నష్టపోయింది. గాజియాబాద్‌ విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతిస్తే దిల్లీ విమానాశ్రయం ఆర్థికంగా నష్టపోతుందని మార్చి 10న న్యాయస్థానంలో సూట్ ఫైల్ చేసింది జీఎంఆర్ సంస్థ. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా లేకపోతే ఒక విమానాశ్రయానికి, మరో విమానాశ్రయానికి మధ్య 150 కి.మీ దూరం ఉండాలనే నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని అధికారులు దావాలో తెలిపారు.

Also read: Houthis attack: అమెరికాపై మోతీల వరుస దాడులు.. ప్రతీకారం తీర్చుకుంటామంటూ వార్నింగ్

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి కొనసాగుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోర్టును కోరారు. కాగా ఈ విషయంపై భారత విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించాల్సి ఉంది. ప్రపంచంలోని అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో ఢిల్లీ విమానాశ్రయం ఒకటి.

Also read: Sunita Williams : భూమి మీదకొచ్చాక నడవలేని పరిస్థితిలో సునీతా విలియమ్స్.. చాలా హెల్త్ ప్రాబల్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

New Update
Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకపక్షంగా పదవి ఆయనకే ఖరారైపోయింది. ఈ ఎన్నిక వెనుక అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Also Read: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?

1960లో కన్యాకుమారి జిల్లా వడివీశ్వరంలో నాగేంద్రన్ జన్మించారు. 2001, 2011, 2021 ఎన్నికల్లో తిరునల్వేలి స్థానం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001- నుంచి 2006 సమయంలో ఏఐడీఎంకే పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2017లో ఏఐడీఎంకేను వీడి బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నారు. జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 

Also Read: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..

ప్రభుత్వ పాలనలో అనుభవం, ప్రజాధారణ, రాజకీయ వ్యూహాలపై పట్టుఉండటంతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐడీఎంకే, బీజేపీలను సమన్వయం చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అయితే ఇటీవల రామేశ్వరంలో పాంబన్ వంతెన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు నాగేంద్రన్ కనిపించారు. వాస్తవానికి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే పదేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం ఉడాలి. కానీ పార్టీ అభివృద్ధికి నాగేంద్రన్ కృషి చేయడం వల్ల  ఆయనకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. 

telugu-news | rtv-news | national-news | bjp

Advertisment
Advertisment
Advertisment