/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Delhi-Air-Pollution-jpg.webp)
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ పీక్స్కి చేరింది. సాధారణంగానే ఢిల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు దీపావళి పండుగ నేపథ్యంలో కాలుష్యం ఇంకా పెరిగింది. ఢిల్లీలోని చాలా ప్రదేశాల్లో ఎయిర్ క్వాలిటీ లేదు. దీపావళి కారణంతో గాలిలో నాణ్యత 362 పాయింట్లు నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 400 పాయింట్లకు పైగా కూడా చేరింది.
ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే..
చాలా కుటుంబాలు అనారోగ్య సమస్యలతో..
ఇంత ఎక్కువ మొత్తంలో పొల్యూషన్ ఆరోగ్యానికి హానికరం. అయితే ఈ పొల్యూషన్ వల్ల ఢిల్లోలోని 69 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ సర్వే తెలిపింది. 62 శాతం కుటుంబాల్లో గొంతు నొప్పి, ముక్కు, జలుబు వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. మరికొందరు ఆస్తమాతో పాటు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, తలనొప్పి, యాంగ్జయిటీ, నిద్రలేమి వంటి వాటితో బాధపడుతున్నారు.
ఇది కూడా చూడండి: Vaishnavi Chaithanya: దీపాల వెలుగులో బేబీ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో..!
ఆర్కేపురం, అశోక్ విహార్, మందిర్ మార్గ్, ఎయిర్పోర్టు, రోహిణీ, జహంగీర్పుర్తో పాటు నొయిడా, గాజియాబాద్, గురుగ్రామ్లోనూ సూచీ 350పైనే ఉంది. మహారాష్ట్రలోని ఇందౌర్లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో పాటు పశ్చిమబెంగాల్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత క్షీణించింది.
ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్
ఢిల్లీలో అధిక పొల్యూషన్ కారణంగా చాలా మంది వేరే ప్రదేశానికి మారుతున్నారు. కొందరు వాటి నుంచి తప్పించుకోవడానికి ఎయిర్ ఫ్యూరిఫయర్లు కూడా వాడుతున్నారు. కొన్ని కుటుంబాలు ఆ పొల్యూషన్లోనే జీవిస్తున్నారు. మరికొందరు ఆహార నియమాలు పాటిస్తే అదే కాలుష్యంలో జీవనం సాగిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Russia-Ukrain-Putin: ఉక్రెయిన్ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు