Dalai Lama: కేంద్రం కీలక నిర్ణయం.. దలైలామాకు జడ్ కేటగిరి భద్రత

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా (89)కు కేంద్రం జడ్‌ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. చైనా మద్దతుదారుల నుంచి ఆయనకు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

New Update
Dalai Lama gets Z-category security

Dalai Lama gets Z-category security

కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా (89)కు జడ్‌ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. చైనా మద్దతుదారుల నుంచి ఆయనకు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే ఆయనకు జడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  

Also Read: అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు.. సరయూ నదిలో జల సమాధి

 ఇక వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న దలైలామా నివాసం ఉంటుంది. అక్కడే జడ్ కేటగిరి భద్రతను కేంద్రం ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా అదనంగా ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లు, నిఘా సిబ్బంది ఉంటారు. అయితే చైనా పాలనను వ్యతిరేకించిన దలైలామా 1959 నుంచి భారత్‌తోనే ఉంటున్నారు. భౌగోళిక, రాజకీయాల ఉద్రిక్తతల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆయనకు భారీ భద్రతను కల్పించింది.         

Also Read: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం

మరో విషయం ఏంటంటే చైనా మద్దతు గల వ్యక్తులు, సంస్థలతో దలైలామాకు ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భిన్న సంప్రదాయాల ప్రాముఖ్యతను చైనా అర్థం చేసుకోలేదని గతంలో దలైలామా విమర్శించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అక్కడ హాన్‌ వర్గ ఆధిపత్యం ఎక్కువగా ఉంటందని ఆయన విమర్శించారు. అలాగే తోటి వ్యక్తిగా తనకు చైనా ప్రజలపై ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. ఇకనుంచి భారత్‌లోనే ఉంటానంటూ తేల్చిచెప్పారు. అయితే ఆయనకు భద్రతకు ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో కేంద్రం భద్రతా ఏర్పాట్లు చేసింది.  

Also Read: ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్‌!

Also Read: ఢిల్లీ సీఎం ఎంపిక అప్పుడే.. ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్..!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment