రూ.23 లక్షల ప్యాకేజీ కాదని రూ.18 లక్షల ప్యాకేజీతోనే ఉద్యోగం.. ఎందుకంటే ?

సాధారణంగా ప్రైవేటు ఉద్యోగులు.. వేరే కంపెనీలో ఎక్కువ వేతనంతో ఆఫర్‌ వేస్తే అక్కడికే వెళ్తుంటారు. ఓ ఉద్యోగి మాత్రం రూ.23 లక్షల ప్యాకెజీ ఆఫర్‌ వస్తే దాన్ని వదిలేసి ప్రస్తుతం ఉన్న రూ.18 లక్షల ప్యాకేజీ ఉద్యోగమే చేస్తున్నాడు.ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

New Update
job 2

సాధారణంగా ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు.. వేరే కంపెనీలో ఎక్కువ వేతనంతో ఆఫర్‌ వేస్తే అక్కడికే వెళ్తుంటారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం అలాంటి ఆఫర్‌ను వదులుకున్నాడు. తక్కువ జీతంతో ఉన్న ఉద్యోగంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఆయన ఆలోచన విధానం మాత్రం అందరినీ ఆలోచింపజేసేలా చేస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కటారియా అనే ఓ వ్యక్తి తన లింక్డిన్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. అందులో ఇలా రాసుకొచ్చాడు. '' నా మిత్రుడికి ఏడాదికి రూ.23 లక్షల ప్యాకేజితో జాబ్ ఆఫర్ వచ్చింది. కాన్ని అతను దాన్ని రిజెక్ట్ చేశాడు. ప్రస్తుతం అతను రూ.18 లక్షల వార్షిక ప్యాకేజ్‌తో చేస్తున్న పాత ఉద్యోగాన్నే ఎంచకుకున్నాడు. ఇలా ఎందుకు చేశాడనే డౌట్ వచ్చింది. దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అసలు మ్యాటర్ అర్ధమయ్యింది. 

Also Read: విమాన ప్రమాదాలు.. గాల్లోనే పోతున్న ప్రాణాలు

ప్రస్తుతం నా ఫ్రెండ్ ఓ హెబ్రిడ్ వర్క్ కల్చర్ కంపెనీలో రూ.18 లక్షల జీతంతో జాబ్ చేస్తున్నాడు. ఈ కంపెనీలో వారానికి ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది. ఈ ఉద్యోగంలో పనితో పాటు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది. కానీ రూ.23 లక్షలు వచ్చే ఉద్యోగంలో మాత్రం వారంలో ఆరు రోజులు పనిదినాలు ఉంటుంది. ఇది వ్యక్తిగత సమయాన్ని కూడా పనికే పరిమితం చేసేలా చేస్తోంది. అందుకే నా స్నేహితుడు తన కుటుంబం, స్నేహితులతో గడిపేందుకు అనూకలంగా ఉందనే పాత ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నాడు. చాలామంది ఉద్యోగం, వ్యక్తిగత జీవితం.. ఇవి రెండు కూడా బ్యాలెన్స్ చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ పోటీ ప్రపంచంలో అభివృద్ధి చేందేందుకు జీతం ఎంత ముఖ్యమే.. ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని'' కటారియా రాసుకొచ్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!

జమ్ము కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

author-image
By Lok Prakash
New Update
Terrorist Attack In Kashmir

Terrorist Attack In Kashmir

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

🔴Pahalgam Terrorist Attack: 

జమ్ము కశ్మీర్‌(Jammu-Kashmir)లో మరోసారి ఉగ్రవాద దాడి(Terrorist Attack) కలకలం రేపింది. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag District) పహల్గాం(Pahalgam) ప్రాంతంలోని బైసరన్(Baisaran) వద్ద మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా  కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది పర్యాటకులు ఉన్నప్పుడు, అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా దూసుకువచ్చిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దుండగుల దాడితో కొంతమంది అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు సహాయం కోరుతూ పంపిన వీడియోలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే లైవ్ అప్‌డేట్స్‌ను ఇక్కడ ఫాలో అవ్వండి.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

 

  • Apr 25, 2025 18:22 IST

    పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలి లేదంటే.. DGP వార్నింగ్

    పాకిస్థానీలను వెంటనే వెనక్కి పంపాలన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే భారత్ ను వీడాలని స్పష్టం చేశారు. అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    hyd-dgp warning
    hyd-dgp warning

     



  • Apr 25, 2025 14:08 IST

    Pakistanis in Hyderabad: హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు.. CMకు అమిత్ షా ఫోన్

    హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు ఉన్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గుర్తించింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియాలోని పాకిస్తాన్ పౌరులంతా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అమిత్ షా అన్నీ రాష్ట్రాల CMలకు ఫోన్ చేసి మాట్లాడారు.

    Pakistanis in Hyderabad



  • Apr 25, 2025 13:57 IST

    Terror Attack Vijayawada: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!

    పహల్గాం దాడి దృష్ట్యా విజయవాడలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. SIMI అనుచరులుగా భావిస్తున్న నలుగురిని గుర్తించి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలోని అనుమానిత ప్రాంతాలలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టాయి.

    Terror Attack Vijayawada
    Terror Attack Vijayawada

     



  • Apr 25, 2025 13:56 IST

    లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. పోలీసులు అదుపులోకి నిందితుడు

    పహల్గామ్‌ ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్‌ మృతి చెందడంతో భర్త మృతదేహం దగ్గర రోధించింది. ఈ ఫొటో వైరల్ కావడంతో ఒసఫ్ ఖాన్ దారుణ కామెంట్ చేశాడు. ఈమెపై దర్యాప్తు చేయాలని.. ఆమె ఒక షూటర్‌తో కావాలనే భర్తను చంపిందన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

    Osaf Khan
    Osaf Khan

     



  • Apr 25, 2025 13:56 IST

    Pahalgam Terror Attack: మొత్తం చేసింది వీడే.. పహల్గామ్ అటాక్ వెనుక కుట్రదారు!!

    పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ ఉగ్ర మాడ్యూల్కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. విదేశీ ఉగ్రవాదులను ఈ దాడి కోసం రప్పించారు.

    Lashkar Chief Hafiz Saeed



  • Apr 25, 2025 12:32 IST

    Baisaran Valley: బైసరన్‌ లోయపై అఖిలపక్ష భేటీలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు!

    పహల్గాంలోని బైసరన్‌ లోయ ఉగ్రదాడిపై అఖిలపక్ష భేటీలో భద్రతా వైఫల్యంపై తీవ్ర చర్చ జరిగింది. స్థానిక అధికారులు ముందుగా సమాచారం ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపనున్నట్లు వెల్లడించింది.

    Baisaran Valley
    Baisaran Valley

     



  • Apr 25, 2025 12:32 IST

    Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. సైనికులకు బిగ్ షాక్

    పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావంతో పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. సెలవులపై వెళ్లిన జవాన్లు కూడా వెంటనే రిపోర్ట్‌ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అన్ని మిలిటరీ విభాగాల్లో జమ్మూకశ్మీర్‌‌లో సైన్యాన్ని పెంచారు.

    Army Jobs-2023: ఇంజనీరింగ్ చేశారా..? నెలకు లక్ష జీతంతో ఉద్యోగం మీదే..పూర్తి వివరాలివే..!!



  • Apr 25, 2025 12:31 IST

    Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

    భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు.

    Exercise Aakraman



  • Apr 25, 2025 12:30 IST

    Stock Market: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్లోజ్..నష్టాల్లో భారత సూచీలు

    భారత్ ఇచ్చిన షాక్ కు పాకిస్తాన్ విలవిలలాడుతోంది. అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న దాయాది పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారిపోయింది. దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లో కూడా సూచీలు భారీ నష్టాలు చూస్తున్నాయి. 

    pak
    Pakistan Stock Exchange

     



  • Apr 25, 2025 11:35 IST

    Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్

    పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం ఉందని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. హమాస్ అగ్రనేతలు పాకిస్తాన్ లో ఉన్నరని...లష్కరే తోయిబాతో కలిసి పని చేస్తున్నారని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ధృవీకరించారు. 

    israel
    Israel's Ambassador Reuven Azar

     



  • Apr 25, 2025 11:34 IST

    BIG BREAKING: ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మృతి

    బండిపోరాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించాడు. బండిపోరాలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

    Let encounter

     



  • Apr 25, 2025 10:12 IST

    Pahalgam Terror Attack:



  • Apr 25, 2025 10:12 IST

    Pahalgam Terror Attack:



  • Apr 25, 2025 10:11 IST

    Pahalgam Terror Attack:



  • Apr 25, 2025 09:56 IST

    Pak: ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులు..పాక్ ఉప ప్రధాని ప్రేలాపన

    ఏం జరిగినా...ఎవరేం అన్నా తమ నోటిని మాత్రం కంట్రోల్ లో పెట్టుకోమంటున్నారు పాక్ నేతలు. ఒకవైపు యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాన్ని మరింత ఎగదోస్తూ.. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు స్వాత్రంత్య సమరయోధులంటూ పాక్‌ ఉప ప్రధాని వ్యాఖ్యలు చేశారు.

    pak
    Pakistan Deputy Pm Ishaq

     



  • Apr 25, 2025 09:25 IST

    Pahalgam Attack: 'ప్రయాణాలు మానుకోండి'- ట్రంప్ సంచలన ప్రకటన

    పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం, జమ్మూ కశ్మీర్‌ ప్రాంతానికి అమెరికా ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. హింస, ఉగ్ర ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లద్దాఖ్‌ సురక్షితమని పేర్కొంది. అలాగే భారత్‌కు తమ మద్దతు తెలిపింది.

    Pahalgam Attack
    Pahalgam Attack

     



  • Apr 25, 2025 09:24 IST

    UN: భారత్ , పాక్ సంయమనం పాటించాలి..ఐక్యరాజ్యసమితి

    ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ లు యుద్దానికి సిద్ధం అవుతున్నాయి. దీనికి సంబంధించి రెండు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. 

    Pak
    UN Security

     



  • Apr 25, 2025 09:23 IST

    ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

    శ్రీన‌గ‌ర్‌లోకి కొంద‌రు విదేశీయులు ఆయుధాల‌తో ప్రవేశించార‌ని, దానికి సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని డిప్యూటీ ప్రధాని దార్ తెలిపారు. భార‌త ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆ వ్యక్తుల‌ను శ్రీన‌గ‌ర్‌లో దాచిన‌ట్లు పాక్ డిప్యూటీ పీఎం ఆరోపించారు.

    Kashmiris' generosity during terror attacks, Free transport for tourists
    Kashmiris' generosity during terror attacks, Free transport for tourists

     



  • Apr 25, 2025 09:22 IST

    Pahalgam: సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మెనగాళ్లు

    ప్లాన్ ప్రకారం టార్గెట్‌ను నాశనం చేయడమే సర్టికల్ స్ట్రైక్. భారత్ ఉగ్రవాదులపై 2016లో ఆర్మీతో, 2019లో ఎయిర్ ఫోర్స్‌తో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆర్మీలో పారా కమాండోలు, నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్‌లో గరుడ సర్జికల్ స్ట్రైక్స్‌కు పెట్టింది పేరు.

    surgical strike



  • Apr 25, 2025 09:21 IST

    Pahalgam: ఏ క్షణమైనా భారత్ -పాక్ యుద్ధం.. వేగంగా మారుతున్న పరిణామాలు?

    సరిహద్దులో ఆయుధాలు కదులుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు రద్దైపోతున్నాయి. పాక్, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అటు పాక్ ఇండియా బార్డర్‌లో మిస్సేల్ టెస్ట్ చేస్తోంది. ఈ పరిస్థితులు అన్నీ చూస్తోంటే ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది.

    india pak war



  • Apr 25, 2025 09:20 IST

    Pakistan army chief: పుల్వామా నుంచి పహల్గామ్‌ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!

    భారత్‌పై అనేక ఉగ్రదాడుల వెనుక ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. 2018 నుంచి ఆయన ISIగా బాధ్యతలు సీకరించిన ఏడాదికే పుల్వామా దాడి జరిగింది. పహల్గామ్ అటాక్‌కు 3రోజుల ముందు కూడా అసీమ్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు.

     Pakistan army chief Asim Munir
    Pakistan army chief Asim Munir

     



  • Apr 25, 2025 09:18 IST

    USA: పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు..పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్

    పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ ఆర్మీ ఛీఫ్ మునీర్ వ్యాఖ్యలే కారణమంటున్నారు. దీనిపై తాజాగా పెంటగాన్ మాజీ అధికారి రూబిన్ స్పందించారు. మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడని అన్నారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి పాకిస్తాన్ పక్కా ప్రణాళిక అని రూబిన్ ఆరోపించారు. 

    usa
    Pak Army Chief Asif Munir, Osama bin Laden

     



  • Apr 24, 2025 21:05 IST

    Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

    ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

    Wear black bands
    Wear black bands

     



  • Apr 24, 2025 20:23 IST

    Pahalgam Terror Attack: రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం



  • Apr 24, 2025 20:22 IST

    Pahalgam Terror Attack: ఉగ్రదాడి ఘటనపై ముగిసిన అఖిలపక్ష సమావేశం



  • Apr 24, 2025 20:20 IST

    Pahalgam Terror Attack: రేపు కాశ్మీర్ లో రాహుల్ గాంధీ పర్యటన



  • Apr 24, 2025 20:17 IST

    BIG BREAKING: పాకిస్థాన్ కు సపోర్ట్ .. అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్!

    పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని మోదీ, అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ కు సపోర్ట్ చేసిన, చేయడానికి ప్రయత్నించిన సహించబోమని సీఎం హిమంత అన్నారు. సదురు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

    arrest mla assam
    arrest mla assam

     



  • Apr 24, 2025 20:16 IST

    Terror Attack: భారత్‌లో కలవనున్న POK.. పాక్ చర్యలకు సరైన సమాధానం అదే!

    పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియాలో విలీనం చేయడమే పాకిస్తాన్‌లో ఉన్న సమస్యకు పూర్తి పరిష్కారమని ప్రముఖలు అంటున్నారు. ఇదే మాట మంత్రులు జై శంకర్, రాజ్ నాథ్ సింగ్ లు కూడా మీడియాతో చెప్పారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు రెచ్చిపోయి పహల్గామ్ అటాక్‌కు పాల్పడ్డారు.

    PoK with India



  • Apr 24, 2025 20:15 IST

    Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

    పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో గాయపడిన వారికి బిలియనీర్ ముఖేష్ అంబానీ ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు ప్రకటించారు. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్ఎన్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని.. ఎంత ఖర్చైనా భరిస్తామని తెలిపారు

    ambani free



  • Apr 24, 2025 19:01 IST

    Seema Haider : పహల్గాం ఉగ్రదాడి... సీమా హైదర్ కూడా పాకిస్థాన్కు వెళ్లిపోవాల్సిందేనా?

    పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ కూడా భారత్ నుంచి విడిచి వెళ్లాల్సి వస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో నెలకొన్నాయి. సీమా హైదర్ అనే పాకిస్తానీ మహిళ రెండేళ్ల క్రితం తన నలుగురు పిల్లలతో కలిసి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది.  

    seema haider-pak
    seema haider-pak

     



  • Apr 24, 2025 19:00 IST

    INS surat: యుద్ధానికి సిద్ధం.. క్షిపణి ప్రయోగించిన భారత్

    భారత నావికాదళం గురువారం స్వదేశీ క్షిపణి నౌక INS సూరత్‌పై క్షిపణిని ప్రయోగించింది. గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని కూల్చివేసింది.

    INS surat



  • Apr 24, 2025 18:59 IST

    Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మేం చనిపోలేదు.. ఆ వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, హిమాన్షి కాదు - షాకింగ్ వీడియో రిలీజ్

    పహల్గాం ఉగ్రదాడికి ముందు ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, తన భార్య హిమాన్షితో డ్యాన్స్ చేసిన వీడియో ఇదేనంటూ ఒక క్లిప్ వైరలైంది. ఆ వీడియోలో ఉన్నది వినయ్ జంట కాదని.. తామేనంటూ ఆశిష్ షెహ్రావత్, యషిక శర్మ జంట ఒక వీడియో రిలీజ్ చేసింది.

    Pahalgam Terror Attack narwal
    Pahalgam Terror Attack Photograph: (Pahalgam Terror Attack)

     



  • Apr 24, 2025 17:40 IST

    ఇది దేశంపై జరిగిన దాడి: షర్మిల



  • Apr 24, 2025 17:13 IST

    మిస్సైల్ ను టెస్ట్ చేసిన భారత్



  • Apr 24, 2025 17:05 IST

    BIG BREAKING : జీరో లైన్ దాటిన భారత జవాన్.. బంధించిన పాక్ ఆర్మీ!

    ఫిరోజ్‌పూర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద BSF జవాన్ ను పాక్ సైన్యం బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్టు చేశామని చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను BSF ఖండించింది.

    pak-army
    pak-army

     



  • Apr 24, 2025 17:05 IST

    యుద్ధానికి సిద్ధం సైన్యానికి సెలవులు రద్దు.. పాకిస్థాన్ కీలక ప్రకటన

    భారత్ సిందూ ఒప్పందం రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది. పాక్ ప్రధాన మంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే.. తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది.

    Pakistan military leave



  • Apr 24, 2025 17:04 IST

    Pakistan : సింధు నదిలోప్రతీ నీటి చుక్కా మాదే: పాకిస్తాన్ సంచలన ప్రకటన

    సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనమని అన్నారు.

    pak-water
    pak-water

     



  • Apr 24, 2025 17:04 IST

    సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మునగాళ్లు

    ప్లాన్ ప్రకారం టార్గెట్‌ను నాశనం చేయడమే సర్టికల్ స్ట్రైక్. భారత్ ఉగ్రవాదులపై 2016లో ఆర్మీతో, 2019లో ఎయిర్ ఫోర్స్‌తో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆర్మీలో పారా కమాండోలు, నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్‌లో గరుడ సర్జికల్ స్ట్రైక్స్‌కు పెట్టింది పేరు.

    surgical strike



  • Apr 24, 2025 17:03 IST

    MLA Aminul Islam : పహల్గాం దాడి వెనుక మోదీ, అమిత్ షా కుట్ర.. అస్సాం ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

    పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశారు. 2018లో కూడా పుల్వామా దాడిలో కూడా కేంద్రం పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు.

    assam-mla
    assam-mla

     



  • Apr 24, 2025 16:45 IST

    రేపు జమ్ము&కశ్మీర్ కు ఆర్మీ చీఫ్



  • Apr 24, 2025 16:36 IST

    Pahalgam Terror Attack: భారత ప్రభుత్వ చర్యలతో కుదేలవుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థ



  • Apr 24, 2025 16:35 IST

    Pahalgam Terror Attack: భారత్ నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలు



  • Apr 24, 2025 16:35 IST

    Pahalgam Terror Attack: పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్ సైట్ మూసివేత



  • Apr 24, 2025 16:32 IST

    Pahalgam Terror Attack: రెండు శాతం పైగా పడిపోయిన పాక్ స్టాక్ మార్కెట్లు



  • Apr 24, 2025 16:31 IST

    Pahalgam Terror Attack: భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశం



  • Apr 24, 2025 16:30 IST

    Pahalgam Terror Attack: సైన్యానికి సెలవులు రద్దు చేసిన పాకిస్తాన్



  • Apr 24, 2025 16:29 IST

    Pahalgam Terror Attack: సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే : పాక్



  • Apr 24, 2025 16:28 IST

    Pahalgam Terror Attack: భారత్ విమానాలకు పాక్ గగనతలం మూసివేత



  • Apr 24, 2025 16:27 IST

    Pahalgam Terror Attack: పాకిస్తాన్ సంచలన నిర్ణయం



  • Apr 24, 2025 16:06 IST

    తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశం



Advertisment
Advertisment
Advertisment