Maha Kumbh Mela : కుంభమేళా రైళ్లల్లో రద్దీ....ఏసీ కోచ్ అద్దాలు పగులగొట్టి

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహా కుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. రైళ్లు పూర్తిగా నిండడంతో ఏసీకోచ్ అద్దాలు పగులగొట్టి మరి రైలెక్కుతున్నారు.

New Update
Maha Kumbh Mela

Maha Kumbh Mela

Maha Kumbh Mela : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహా కుంభమేళాను సందర్శించి, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. ఫిబ్రవరి 26తో కుంభమేళా ముగియనుండటంతో భక్తులు పెద్ద ఎత్తున ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటు న్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ కు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జాం నెలకొంటున్నది. రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. ఎక్కడికక్కడ వాహనాలు కదలకుండా నిలిచిపోవడంతో భక్తులు గంటల కొద్ది నడి రోడ్ల మీదనే వేచి చూడాల్సి వస్తుంది. ట్రాఫిక్ ను అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా జబల్‌పుర్‌ -ప్రయాగ్‌రాజ్‌ మార్గంలో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!

మరోవైపు రైళ్లు కూడా ప్రయాణీకులతో నిండిపోయాయి. బీహార్‌లో రైళ్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. రైల్లో కూర్చునేందు కు స్థలం దొరకకపోవడంతో భక్తులు రైళ్లపై దాడులు చేస్తున్నారు. రైలులో ఎలాగైనా ఎక్కాలనే ఆతృతతో స్వతంత్ర సేనాని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఏసీకోచ్‌ల అద్దాలు పగుల గొట్టారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలు కూడా అయ్యాయి. జయనగర్‌ నుంచి న్యూఢిల్లీ్కి వెళ్లే ఈ సూపర్‌ ఫాస్ట్‌ రైలు జనరల్‌ బోగినుంచి ఏసీ బోగి వరకూ అన్ని నిండిపోయాయి. కనీసం కాలు పెట్టేందుకు కూడా ఖాళీ లేకుండా పోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.

ఇది కూడా చూడండి: Telangana Beers : పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత? .. ప్రభుత్వానికి ఎంత ఆదాయం ?
బయటి ప్రయాణీకుల రద్దీని గమనించిన రైలులో ఉన్నవారు తలుపులు మూసి వేశారు. మధుబని స్టేషన్‌లో రైలుకోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులకు ఈ ఘటన కోపం తెప్పించింది. అసహనంతో ఏసీ బోగిల అద్దాలు పగలుగొట్టి కిటీకిల గుండా రైల్లోకి ఎక్కారు.. ఈ ఘటనతో రైలు ఆలస్యంగా బయలుదేరింది.

Also Read: Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా?
 
కుంభమేళాకు వెళ్తున్నవారు పక్కనే ఉన్న వారణాసి, అయోధ్యలకు భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల మంది భక్తులు ఈ రెండు దేవాలయాలకు క్యూ కట్టారు. దీంతో కాశీలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా.. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్ ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ జాం దృష్ఠ్యా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, ప్రయాగ్ రాజ్ వెళ్లే భక్తులు దయచేసి ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. కాగా ప్రయాగ్‌ రాజ్‌లో ఇప్పటివరకు 44 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 26 నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

 Also Read: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CRIME NEWS: అయ్యో పాపం.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం- రోలర్‌ కోస్టర్‌ నుంచి కిందపడి యువతి స్పాట్‌డెడ్!

ఢిల్లీలో 24 ఏళ్ల యువతి రోలర్‌ కోస్టర్ నుంచి కింద పడి మృతి చెందింది. ప్రియాంకకు నిఖిల్‌తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. సరదాగా తిరిగొద్దామని కాప్‌సహేడా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ ఎక్కారు. దాని స్టాండ్ విరగడంతో ఆమె కిందపడి మరణించింది.

New Update
Delhi woman dies after falling from Roller Coaster

Delhi woman dies after falling from Roller Coaster

నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ నుండి కింద పడి 24 ఏళ్ల ప్రియాంక మృతి చెందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు.  పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

ఏం జరిగిందంటే?

నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంకతో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. అక్కడ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో గురువారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. అదే సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగి ఆమె కింద పడిపోయింది. దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం

పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో మృతిచెందిన మృతురాలు ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ENT రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద పంక్చర్ గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు ఉన్నాయని తెలిపారు. 

ఇది కూడా చదవండి: డేంజర్.. ఇలాంటి సన్‌స్క్రీన్ లు వాడితే ముఖంపై తెల్లటి మచ్చలు!

కాగా చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రియాంకకు ఫిబ్రవరి 2026లో వివాహం జరగాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: కూల్‌ డ్రింక్స్‌ కాదు రాగి అంబలి తాగండి.. సింపుల్‌గా ఇలా చేసుకోండి!

(crime news | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment