Beggars: యాచకుల సమాచారం ఇస్తే నగదు బహుమతి.. ఎక్కడంటే ?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం యాచకులు లేకుండా చేసేందుకు చర్యలు చేపడుతోంది. యచకుల సమాచారం అందించినవారికి రూ.వెయ్యి నగదు అందిస్తామని ఇటీవల అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నాయి.

New Update
Beggar

Beggars

Beggars: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం యాచకులు లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కీలక ప్రకటన చేసింది. భిక్షాటన చేస్తూ కనిపించే వారి గురించి సమాచారం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సూచించింది. సమాచారం అందించిన వారికి రూ.వెయ్యి నగదు అందిస్తామని ప్రకటించింది. దీంతో అధికారులకు వందల సంఖ్యలో ఫొన్‌కాల్స్‌ వస్తున్నాయి.      

Also Read: BPSC పేపర్‌ లీక్‌ వ్యవహారం.. ప్రశాంత్ కిషోర్ జైలుకు తరలింపు 

ఈ సందర్భంగా ఇండోర్ జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. '' నగరంలో భిక్షాటన చేస్తున్నవారి గురించి మాకు సమాచారం ఇస్తే రూ.1000 నగదు బహుమతిగా ఇస్తామని జనవరి 2న ప్రకటన చేశాం. ప్రజలు ఫొన్ చేసేందుకు ఓ నంబర్‌ కూడా ఇచ్చాం. నాలుగు రోజుల్లోనే దాదాపు 200 వరకు కాల్స్ వచ్చాయి. మాకు వచ్చిన కాల్స్‌కు సంబంధించి వివరాలను విచారిస్తున్నాం. వీటిలో 12 మంది సరైన సమాచారం ఇచ్చారు. మిగితావారి వివరాలు కూడా పరిశీలిస్తున్నామని'' తెలిపారు.  

Also Read: ఆర్మీ కాన్వాయ్‌ పై ఆత్మాహుతి దాడి..47 మంది సైనికులు మృతి

ఇదిలాఉండగా ఇండోర్ నగరం యాచకులు లేని నగరంగా మార్చేందుకు ముందుడుగులు వేస్తోంది. ఇప్పటికే యాచకులకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా, వారికి ఇతర వస్తువులు అందించినా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. గత 4 నెలల్లో ఇప్పటివరకు 400 మంది యాచకులను పునరావాస కేంద్రాలకు పంపించారు. అలాగే మరో 64 మంది చిన్నారులను పిల్లల సంరక్షణ సంస్థకు అప్పగించినట్లు పేర్కొన్నారు. 

Also read: రాష్ట్రం ప్రభుత్వం గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు!

Also Read: మావోయిస్టుల కట్టడికి రూ.5,601 కోట్లు.. కేంద్రం వ్యూహం ఇదే!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING : ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 2:31 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ మంటలు తక్కువ సమయంలోనే మరింత విస్తరించాయి.

New Update
Fire Accident

Fire Accident

Fire Accident : ముంబై బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 2:31 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ మంటలు తక్కువ సమయంలోనే మరింత విస్తరించాయి. దీంతో అగ్నిమాపక దళం పెద్ద ఎత్తున మంటలను అదుపు చేసింది.

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ED కార్యాలయ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు సంభవించలేదని తెలిపారు. కురింభోయ్ రోడ్డులోని గ్రాండ్ హోటల్ సమీపంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం ఉన్న బహుళ అంతస్తుల కైజర్-ఐ-హింద్ భవనంలో ఆదివారం తెల్లవారుజామున 2:31 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక దళానికి సమాచారం అందిందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

అగ్నిమాపక దళం బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలను ప్రారంభించాయి. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో, మంటలను అదుపు చేయగలిగామని , ఇది అతిపెద్ద అగ్నిప్రమాదంగా  పరిగణించబడుతుందని అగ్నిమాపక దళం ధృవీకరించింది. అగ్నిమాపక సిబ్బంది త్వరిత గతిన స్పందించడంతో ఐదు అంతస్తుల భవనంలోని నాల్గవ అంతస్తుకే మంటలు పరిమితమయ్యాయని అధికారులు తెలిపారు.

Also read :  India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

ప్రమాదాన్ని నివారించేందుకు గాను ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు, ఆరు జంబో ట్యాంకర్లు, ఒక వైమానిక నీటి టవర్ టెండర్, ఒక బ్రీతింగ్ ఉపకరణ వ్యాన్, ఒక రెస్క్యూ వ్యాన్, ఒక క్విక్ రెస్పాన్స్ వెహికల్, 108 సర్వీస్ నుండి అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారి తెలిపారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు.

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Also read : Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!

 

Advertisment
Advertisment
Advertisment