Children Selling Gang : మగ శిశువుకు 6 లక్షలు...ఆడ శిశువుకు 4 లక్షలు ..పసిపిల్లల విక్రయంలో బిగ్‌ట్విస్ట్‌

పసి పిల్లలను ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధమున్న 11 మంది నిందితులను గత నెలలోనే కటాకటాల్లోకి నెట్టారు. అయితే కస్టడీలో వారిచ్చిన సమాచారం మేరకు పలువురిని అరెస్ట్ చేశారు.

New Update
Baby selling gang arrested

Baby selling gang arrested

Children Selling Gang : పసి పిల్లలను ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధమున్న 11 మంది నిందితులను గత నెలలోనే కటాకటాల్లోకి నెట్టారు. అయితే కస్టడీలో వారిచ్చిన సమాచారం మేరకు తాజాగా మరో 9 మంది దళారులు, చిన్నారులను కొనుగోలు చేసిన 18 మంది తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 21 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు.. అందులో 10 మందిని రక్షించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.  ‘ఈ వ్యవహారంలో తొలుత అరెస్టయిన కృష్ణవేణి, వందనలను విచారించగా.. ప్రధాన నిందితురాలు మలక్‌పేటకు చెందిన ఆశా వర్కర్‌ సోము అమూల్య (29) పేరు వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

కస్టడీలోకి తీసుకుని కోలా క్రిష్ణవేణి, దీప్తీ, గుజరాత్ కు చెందిన వందనలను విచారించినప్పుడు పోలీసులు అమూల్య పేరు కొత్తగా వినపడింది. దీంతో ఆమె గురించి ఆరా తీశారు. అమూల్య హైదరాబాద్ అజంపుర యూ పిహెచ్ సి లో ఆశా వర్కర్ గా పని చేస్తుంది. 2011 లో వివాహం చేసుకున్న అమూల్య భర్తను వదిలేసి కూతురితో ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలో మలక్ పేట్ ఏరియా ఆస్పత్రిలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఇస్మాయిల్ పరిచయమయ్యాడు. అతను ఎవరికైనా పిల్లలు కావాలంటే చెప్పమన్నాడు. దీంతో తన బంధువైన సుగుణమ్మకు అవసరం ఉందని చెప్పడంతో ఇస్మాయిల్ పసి పిల్లను తెచ్చి ఇచ్చాడు. ఇలా అతనితో కొందరిని విక్రయించిన అమూల్యకు దీప్తి, కోలా క్రిష్ణ వేణి లింక్ దొరికింది. దీంతో అమూల్య 8 మంది శిశువులను, దీప్తీ 10 మంది శిశువులను, కోలా క్రిష్ణావేణి 3 శిశువులను అక్రమంగా అమ్మేశారని కస్టడీ విచారణలో తేలింది. దీంతో అమూల్యను బుధవారం అరెస్టు చేసి 10 మంది పసిపిల్లలను కాపాడారు. సోషల్‌ మీడియా ద్వారా ఇతర రాష్ట్రాల వారినీ పరిచయం చేసుకుని దందా కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే వారందరినీ గుర్తించి అరెస్టు చేశాం’ అని సీపీ వివరించారు. చట్టబద్ధంగా శిశువులను దత్తత తీసుకోవాలని సూచించారు. అక్రమంగా శిశువులను కొనుగోలు చేయడం, అమ్మడం నేరమని హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!

కోలా క్రిష్ణ వేణి , దీప్తీ, అమూల్యలు మహరాష్ట్రలోని ముంబాయి, అమరావతి, ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్ పూర్, ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్, తెలంగాణలో హైదరాబాద్ లో పసి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ లోని కోల్ కత్తా, తమిళ నాడు లో చెన్నై, కర్ణాటక లో బెంగళూరు, హైదరాబాద్, ఏపీ లో గుంటూరు ప్రాంతాల్లో అమ్మేస్తున్నారు. మగ శిశువును 4---5 లక్షలకు కొనుగొలు చేసి 6 లక్షలకు అమ్మేస్తున్నారు. ఆడ శిశువును 3 లక్షలకు కొనుగొలు చేసి 4 లక్షలకు విక్రయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా దేశవ్యాప్తంగా కోలా క్రిష్ణవేణి మూఠా ఏజెంట్ ల నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుని అక్రమంగా పసి పిల్లలను కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు.

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

కోలా క్రిష్ణవేణి గ్యాంగ్ నలుగురిని కాదు ఏకంగా 25 మంది పసిపిల్లలను అమ్మేశారు. దాదాపు నెల రోజుల కిందట చైతన్యపురిలో ఓ మగ శిశువును అమ్మేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రాచకొండ మాల్కాజిగిరి ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు కోలా క్రిష్ణవేణి గ్యాంగ్ ను అరెస్ట్ చేసి నలుగురు పిల్లలను కాపాడిన విషయం తెలిసిందే. ఈ నిందితులను తిరిగి కస్టడీలోకి తీసుకుని విచారించినప్పుడు మరో 21 మంది పసిపిల్లల విక్రయాల భాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మరో 10 మంది పసిపిల్లలను కాపాడారు. ఇలా మొత్తం రాచకొండ పోలీసులు ఇప్పటి వరకు 14 మంది పసి పిల్లలను కాపాడి వారిని దత్తతకు తీసుకున్న తల్లిదండ్రులను జైలుకు పంపారు.

Also read: Manipur riots: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణ.. ఈసారి హమర్‌, జోమి తెగల మధ్య గొడవలు
   
పోలీసులు మరో 11 మంది పసి పిల్లలను కాపాడేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. బుధవారం అరెస్టైన వారిలో అమూల్య, వైశాలి భీమ్ రావు, జానాపల్లి కార్తీక్ , సజ్జన్ అగర్వాల్ , బానాల మంగయ్య, బోడాసు నాగరాజు, రామారాం అశొక్, షేక్ ఇస్మాయిల్, మాచర్ల వంశీకృష్ణ లు ఉన్నారు. ఇంకా ఈ పసిపిల్లలను కొనుగోలు చేసి దత్తత తీసుకున్న 17 మంది తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. పుట్టిన రెండు, మూడు రోజుల పసి శిశువులను వీరు కొనుగోలు చేస్తారని విచారణలో తెలిసింది. వీరికి విక్రయిస్తున్న ఏజెంట్ లు కు ఈ పసి పిల్లలను ఆర్ధికంగా సతమతమవుతున్న వారి నుంచి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. కిడ్నాప్ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

bomb blast case : 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

2008లో జైపూర్‌లో వరుస పేలుళ్లుకు పాల్పడిన నిందితులను స్పెషల్ కోర్టు దోషులుగా ప్రకటించింది. నలుగురికి జీవిత ఖైదు శిక్ష విధింస్తూ తీర్పు ఇచ్చింది. జైపూర్‌లో 2008 మే 13న ఎనిమిది వరుస పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడ్డారు.

New Update
jaipur bamb balst case

jaipur bamb balst case Photograph: (jaipur bamb balst case)

2008 జైపూర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో జైపూర్ స్పెషల్ కోర్టు మంగళవారం ఫైనల్ తీర్పు వెల్లడించింది. నలుగురు దోషులకు జీవిత ఖైదు శిక్ష విధించింది. నలుగురు దోషులు, సర్వర్ అజ్మీ, షాబాజ్, సైఫర్ రెహమాన్ మరియు మహ్మద్ సైఫ్‌లను ఏప్రిల్ 4న కోర్టు ఐపిసిలోని వివిధ సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద దోషులుగా నిర్ధారించింది. 2008 మే 13న చాంద్‌పోల్‌లో పేలుడు పదార్థాలను అమర్చిన కేసు ఇది. ఈ కేసులో కోర్టు 600 పేజీల తీర్పును వెలువరించింది. ప్రభుత్వం 112 ఆధారాలు, 1192 పత్రాలు, 102 వ్యాసాలు మరియు 125 పేజీల లిఖిత వాదనలను సమర్పించింది.

Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

జైపూర్‌లో 2008 మే 13న ఎనిమిది వరుస పేలుళ్లు జరిగాయి. సాయంత్రం జరిగిన పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడ్డారు. రామచంద్ర ఆలయం సమీపంలో ఒక లైవ్ బాంబును స్వాధీనం చేసుకున్నారు, దానిని బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. తొమ్మిదవ బాంబు చాంద్‌పోల్ బజార్‌లోని గెస్ట్ హౌస్ సమీపంలో కనుగొనబడింది. చాంద్‌పోల్ లో అమర్చిన బాంబ్‌ను పేలడానికి 15 నిమిషాల ముందు దానిని నిర్వీర్యం చేశారు. ఈ కేసులో సర్వర్ అజ్మీ, మహ్మద్ సైఫ్, సైఫుర్రహ్మాన్ మరియు షాబాజ్‌లను దోషులుగా నిర్ధారించిన కోర్టు మంగళవారం వారికి జీవిత ఖైదు విధించింది.

Also read: Dubai Crown Prince: ఢిల్లీకి చేరుకున్న అత్యంత సంపన్నుడు దుభాయ్ రారాజు.. ఎందుకంటే?

అలాగే ఇదే రోజు (మంగళవారం) హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కూడా తీర్పు వెల్లడించింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. NIA ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్‌ షేక్‌కు ఉరిశిక్ష విధించింది.

Advertisment
Advertisment
Advertisment