Rahul Gandhi: రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై వివాదం..కోర్టు కీలక ఆదేశం

విపక్ష నేత రాహుల్ గాంధీ పౌరస్వంపై వివాదం నెలకొంది. నాలుగు వారాల్లో ఆయన పౌరసత్వం అంశం తేల్చాలని అలహాదాబ్ హైకోర్టు కేంద్రానికి ఆదేశించింది. రాహుల్‌కు బ్రిటన్‌ పౌరసత్వం ఉందని ఇద్దరు బీజేపీ నేతలు ఆయనపై కోర్టులో పిటిషన్ వేశారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ పౌరస్వంపై వివాదం నెలకొంది. నాలుగు వారాల్లో ఆయన పౌరసత్వం అంశం తేల్చాలని అలహాదాబ్ హైకోర్టు కేంద్రానికి ఆదేశించింది. నాలుగు వారాల్లోనే పౌరసత్వం అంశం తేల్చాలని సూచనలు చేసింది.  అనంతరం విచారణను ఏప్రిల్ 21కి  వాయిదా వేసింది. ఈ గడువు లోపల కేంద్రం న్యాయస్థానానికి రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి గత కొన్నేళ్లుగా వివాదం జరుగుతూనే ఉంది.


Also Read: రాహుల్ గాంధీతో డేటింగ్ చేయడం ఇష్టం : కరీనా కపూర్

రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ నేత విఘ్నేశ్ శిశిర్‌ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విదేశీయుడైన ఆయనకు భారత్‌లో ప్రభుత్వ పదవులు చేపట్టే అధికారం లేదని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే దీనిపై విచారించిన ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్‌లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నట్లు సుబ్రహ్మణ్య స్వామి గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. అంతేకాదు ఆ కంపెనీ వార్షిక నివేదికలో రాహుల్ తనను బ్రిటిష్ పౌరుడిగా  చెప్పుకున్నట్లు తెలిపారు. 

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు!

భారత చట్టాల ప్రకారం.. ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేదని, ఎవరైనా ఇతర దేశానికి చెందిన పౌరసత్వం పొందితే భారత పౌరసత్వం రద్దవుతుందని పేర్కొన్నారు. వేరే దేశంలో పౌరుడిగా ఉండే వ్యక్తి భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇలా చేయకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారతీయ పౌరసత్వ చట్టం, 1955ను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. ఈ విషయంపై గతంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. విఘ్నేశ్‌ మాట్లాడుతూ..  తన దగ్గర రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి యూకే ప్రభుత్వం సమర్పించిన రికార్డులు ఉన్నట్లు చెబుతున్నారు.  

 telugu-news | rtv-news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment