Actress Ranya Rao:గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

కన్నడ నటి రన్యా రావు.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీబీఐ ఆమె పెళ్లి వీడియోను పరిశీలిస్తున్నారు.పూర్తి వివరాలు ఈకథనంలో..

New Update
Ranya Rao

Ranya Rao

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ.. అధికారులకు అడ్డంగా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఆమెను విచారణ జరపగా.. తాజాగా ఈ కేసులోకి సీబీఐ అధికారులు ఎంటర్‌ అయ్యారు. దీంతో ఈ కేసు శరవేగంగా దర్యాప్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారంలో రన్యారావుతో పాటు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనేది గుర్తిచేందుకు సీబీఐ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. 

Also Read: Trudeau:కుర్చీ చేత పట్టుకుని..నాలుక బయటపెట్టి..ట్రూడో ఫొటో వైరల్‌!

పెళ్లి వీడియోను...

అందుకు ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీబీఐ అధికారులు రన్యారావు ఇల్లు, ఆమెకు సంబంధించిన అన్ని ప్రాంతాలు, ఆమె పెళ్లి చేసుకున్న హోటల్‌కు వెళ్లి విచారణ జరుపుతున్నారు. అయితే రన్యారావు పెళ్లి వేడుకకు హాజరైన వారు, అతిథులు ఇచ్చిన ఖరీదైన కానుకలపైనా సీబీఐ దృష్టి సారించనుంది. ఇందుకోసమే రన్యారావు పెళ్లి వీడియోను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

Also Read: Supreme Court: కలెక్టర్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మరోవైపు రన్యారావు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రన్యారావు బెయిల్‌పై అభ్యంతరాలను సమర్పించాలని డీఆర్‌ఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు.. గోల్డ్ స్మగ్లింగ్‌ చేసే సమయంలో ఎయిర్‌పోర్టులో వీఐపీ ప్రొటోకాల్‌ను రన్యారావు దుర్వినియోగం చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. 

ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెకింగ్స్‌ను తప్పించుకునేందుకు ఆమె సవతి తండ్రి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కె.రామచంద్రరావు పేరును ఆమె వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో రన్యారావు తండ్రి కె.రామచంద్రరావు పాత్ర ఉందా లేదా అనే విషయంపైనా దృష్టి పెట్టాలని తెలిపింది. ఇక ఈ రన్యరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచారణ అధికారిగా అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్‌ గుప్తాను సిద్ధరామయ్య ప్రభుత్వం నియమించింది.

ఇక 4 నెలల క్రితం రన్యా రావును జితిన్‌ హుక్కేరి అనే ఆర్కిటెక్ట్‌ను బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్‌లో ఘనంగా పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ పెళ్లి వచ్చిన అతిథుల లిస్ట్‌ను తీసుకున్న సీబీఐ అధికారులు.. వారు ఎలాంటి ఖరీదైన బహుమతులు ఇచ్చారు అనేది ఆరా తీస్తోంది. మరోవైపు.. రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు గురించి కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర రచ్చకు దారి తీసినట్లు తెలుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీపై.. ప్రతిపక్ష బీజేపీ ఈ కేసు గురించి ప్రశ్నల వర్షం కురిపించింది.

Also Read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌.. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు

Also Read: పాక్‌లో ట్రైన్‌ హైజాక్.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) డిమాండ్స్‌ ఏంటి?.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటి?

Advertisment
Advertisment