కుంభమేళాలో అలా చేసిన వారిపై కఠిన చర్యలు.. పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న రెండు అకౌంట్లపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఓ ఇన్‌స్టాగ్రామ్, CCTV CHANNEL 11 అనే టెలిగ్రామ్ ఛానళ్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

New Update
Kumbh bathing photos

Kumbh bathing photos Photograph: (Kumbh bathing photos)

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అమ్ముతున్నట్లు ప్రయారం జరుగుతుంది. ట్రెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అడల్ట్ కంటెంట్ షేర్ చేసిన విజువల్స్‌ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. మహిళలు స్నానాలు చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోలు పోస్ట్ చేసిన రెండు ఇస్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానళ్లపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Zelensky: ట్రంప్‌ చుట్టూ తప్పుడూ సమాచారమే..జెలెన్‌ స్కీ సంచలన వ్యాఖ్యలు!

@neha1224872024 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, CCTV CHANNEL 11 అనే టెలిగ్రామ్ ఛానల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అకౌంట్ నిర్వహకులను అదుపులోకి తీసుకోడానికి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రెండు సోషల్ మీడియాలో అకౌంట్‌లో మహా కుంభ్‌లో మహిళా భక్తులు స్నానం చేస్తున్న అనుచిత వీడియోలను షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్‌లో వీడియోస్ సేల్‌కు పెట్టారు.

Also Read: Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు!

 #mahakumbh2025, #gangasnan, #prayagrajkumbh వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించే ఫేస్‌బుక్ పేజీలు వీడియోలను షేర్ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు, తప్పుదారి పట్టించే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

ఈ మధ్య తరుచుగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు మళ్ళీ దేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. 

New Update
hdfc

UPI

ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏ యూపీఐ సేవా పని చేయలేదు. అసలు ఏ ట్రాన్సాక్షన్స్ పని చేయలేదు. రీసెంట్ గా మార్చి 26న యూపీఐ ట్రాన్సక్షన్స్ లో ఇదే సమస్య రాగా మళ్లీ ఇవాళ అదే సమస్య రావడంతో కస్టమర్లు మండిపడుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 2న  రాత్రి 8 గంటల వరకూ యూపీఐ పని చేయడం లేదని 449 ఫిర్యాదులు నమోదయ్యాయి.

కారణం తెలియ లేదు..

యూపీఐ సేవల్లో 64 శాతం మనీ ట్రాన్స్ ఫర్, 28 శాతం పేమెంట్స్, 8 శాతం యాప్ సమమస్యలు తలెత్తాయి. అలాగే ఎస్బీఐలో 57 శాతం కస్టమర్లు మనీ ట్రాన్సక్షన్ జరపడంలో ఇబ్బంది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు. 34 శాతం మొబైల్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కున్నామని చెప్పారు. అయితే  డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి కారణమేంటని అనేది మాత్రం తెలియలేదు.  దీనిపై సంబంధిత బ్యాంకులు కానీ, యాప్స్ కానీ ఏమీ ప్రకటన చేయలేదు. నేషనల్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.  

 today-latest-news-in-telugu | upi

Also Read: RCB VS GT: లివింగ్ స్టోన్ మెరుపులు..గుజరాత్ టైటాన్స్ టార్గెల్ 170

Advertisment
Advertisment
Advertisment