/rtv/media/media_files/2025/02/08/yOcU2eCzGerlvEhw9x5P.jpg)
atishi vs ramesh
Ramesh Bidhuri: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ అద్మీ పార్టీ(AAP) ఓటమి దిశగా పయనిస్తోంది. ఆ పార్టీ అగ్ర నేతలందరూ దాదాపుగా ఓటమి అంచుల్లోనే ఉన్నారు. మాజీ మంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) ఓడిపోయారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) 600 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి సీఎం అతిషిపై 3,231 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి చారిత్రాత్మక విజయం సాధిస్తామని రమేష్ బిధూరి విశ్వాసం వ్యక్తం చేశారు. తన దృష్టి ముఖ్యమంత్రి పదవిపై కాదని.. ఢిల్లీ ప్రజలకు సేవ చేయడంపై ఉందని అన్నారు. సీఎం అతిషిపై గెలిచాక కేబినెట్ లో రమేష్ బిధూరికి ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు కేబినెట్ లో హోం మినిస్టర్ పదవి దక్కే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
వివాదాస్పద వ్యాఖ్యలతో రమేష్ బిధూరి వార్తల్లో
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో రమేష్ బిధూరి వార్తల్లో నిలిచారు. ఎంపీ ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా రోడ్లను మారుస్తానని.. సీఎం అతిషి తన ఇంటి పేరు మార్చుకుందంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అతిషి ఎప్పుడూ ప్రజలను కలవడానికి రాలేదని .. ఎన్నికలు వచ్చినప్పుడు, ఆమె ఢిల్లీ వీధుల్లో అడవిలో జింక పరిగెత్తినట్లుగా తిరుగుతోందంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఆయనపై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకనొక సమయంలో రమేష్ బిధూరిని తప్పించి మరోకరికి బీజేపీ టికెట్ ఇస్తుందంటూ ప్రచారం కూడా నడించింది. కానీ కౌంటింగ్ లో మాత్రం రమేష్ బిదూరి ఏకంగాసీఎం అతిషిని వెనక్కి నెట్టి ముందంజలో కొనసాగుతున్నారు.