Hathras Stampede : తొక్కిసలాట ఘటనలో భోలే బాబాకు క్లీన్ చిట్ !

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన భయంకరమైన తొక్కిసలాట సంఘటనపై న్యాయ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో భోలే బాబాకు క్లీన్ చిట్ లభించింది. 2024లో జరిగిన ఈ తొక్కిసలాటలో  121 మంది ప్రాణాలు కోల్పోయారు. 

author-image
By Krishna
New Update
bhole baba 1

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని హత్రాస్‌లో జరిగిన భయంకరమైన తొక్కిసలాట సంఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో భోలే బాబా (Bhole Baba) కు క్లీన్ చిట్ ఇచ్చింది.  తొక్కిసలాటకు నిర్వాహకులే ప్రాథమికంగా బాధ్యులని, పోలీసుల నిర్లక్ష్యం కూడా తీవ్రంగా ఉందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి జ్యుడీషియల్ కమిషన్ కొన్ని ముఖ్యమైన సూచనలను ఇచ్చింది. ఏదైనా పెద్ద కార్యక్రమానికి ముందు, పోలీసు అధికారులు స్వయంగా వేదికను తనిఖీ చేయడం తప్పనిసరి అని తెలిపింది.

Also Read :  ఎఫ్‌బీఐ డెరెక్టర్‌గా ట్రంప్ విధేయుడు..ఇంతకీ ఈ భారతీయుడు ఎవరో తెలుసా!

కాగా  హత్రాస్  తొక్కిసలాట ఘటనపై  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.  రిటైర్డ్ ఐపీఎస్ భవేష్ కుమార్ సింగ్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ హేమంత్ రావులను కమిషన్ సభ్యులుగా నియమించారు. కాగా ఈ కేసులో పోలీసులు 11 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు పోలీసులు.  

Also Read :  ఐదుసార్లు ఎమ్మెల్యే, ప్రజా ఉద్యమకారుడు..కానీ అవమానించారు

Also Read :  కొడుకుకి ధ్యాన్‌చంద్‌ ఖేల్ రత్న పురస్కారం..కానీ ఇంతలోనే తండ్రి..!

121 మంది మృతి 

2024న జూలై 2వ తేదీన  ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు.  జనసమూహ నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు నలిగిపోయి ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.  సత్సంగ్‌లో ప్రవచనాలు బోధించిన  భోలే బాబా పాద ధూళి కోసం భక్తులు ఒక్కసారిగా వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. తొక్కిసలాటలో చనిపోయినవారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు.  ఇక భోలే బాబా అసలు పేరు సూరజ్‌పాల్ జాటవ్. ఆయన్ను నారాయణ్ సాకార్ హరి అని కూడా పిలుస్తుంటారు. ఒకప్పుడు పోలీసు కానిస్టేబుల్ అయిన సూరజ్‌పాల్ జాటవ్ ఉద్యోగాన్ని వదిలేసి ఆయన ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు.  

Also Read :  పురిట్లో బిడ్డను కోల్పోయిన తల్లులకు గుడ్ న్యూస్.. ఆ రాష్ట్రంలో 60 రోజుల పాటు సెలవులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?

New Update
Indian Army

Indian Army

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ లలో పరిస్థితి మారిపోయింది. ఒక్క ఉగ్రదాడితో రెండు దేశాలు అల్లకల్లోలం అయిపోయాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 26మందిని పోగొట్టుకుని భారత ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ మీద కస్సుబుస్సుమంటోంది. ఆ దేశాన్ని అన్ని విధాలా దిగ్భంధనం చేస్తూ ఐదు కఠిన నిర్ణయాలను తీసుకుంది. పోనీ అటు నుంచి పాకిస్తాన్ ఏమైనా తగ్గిందా అంటే..అదీ లేదు. ఆ దేశం కూడా యద్ధానికి సిద్ధం అంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది. అసలు ఇదంతా జరగడానికి తామే కారణం అయినా కూడా ఆ విషయాన్ని ఒప్పుకోకుండా పొగరుగా మాట్లాడుతోంది. ఇండియా ఒక్కటేనా నిర్ణయాలు తీసుకోగలదు అంటూ వాళ్ళు కూడా సేమ్ టూ సేమ్ కాపీ కొట్టేశారు. దీంతో యుద్ధం తప్పదనే సూచనలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. దీని కోసం రెండు దేశాలూ సిద్ధమైపోతున్నాయి కూడా. భారత ఆర్మీ ఛీప్ రేపు కాశ్మీర్ కూడా వెళుతున్నారు. అక్కడ బలగాలు పర్యవేక్షించడంతో పాటూ ఇతర ఏర్పాట్లను కూడా చూడనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యుద్ధమే కనుక జరిగితే ఏ దేశం గెలుస్తుంది...ఎవరి బలం ఎంత అనే చర్చలు జరుగుతున్నాయి. 

భారత్, పాక్ సైనిక బలాలు ఇవే..

ఇండియా, పాకిస్తాన్ ల మధ్య ఇదే మొదటిసారి కాదు. ఇలా దాడులు జరగడం...రెండు దేశాలు యుద్ధానికి రెడీ అవడం చాలాసార్లే జరిగింది. పాక్ చేసిన పనులకు భారత్ అన్ని సార్లూ గట్టిగానే జవాబు చెప్పింది. ఎప్పుడూ విజయం కూడా మనవైపే ఉంటుంది కూడా. అయితే ఈ సారి యుద్ధం జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి. ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందంటే..కచ్చితంగా భారత్ కే అని చెప్పాలి. ఎందుకంటే అన్ని రకాలుగా పాకిస్తాన్ కంటే భారత్ బలంగా ఉంది. 

భారత ఆర్మీ సైనికులు...పాక్ ఆర్మీ సైనికుల కంటే దాదాపు రెండింతలు ఉన్నారు.  భారత సైనికులు 14, 55, 550 మంది ఉంటే పాక్ సైనికులు 6, 54,00 మంది ఉన్నారు.  ఇండియా దగ్గర ఆరు వైమానిక ట్యాంకర్లు ఉంటే పాక్ దగ్గర నాలుగు ఉన్నాయి. ఇక అణు జలాంతర్గాముల విషయానికి వస్తే భారత్ దగ్గర 2893 ఉన్నాయి. పాక్ దగ్గర 121 మాత్రమే ఉన్నాయి. గగనతలం సంగతి చూస్తే..ఇండియా దగ్గర 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్, 513 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్ దగ్గర 1, 399 ఎయిర్ క్రాఫ్ట్స్, 328 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటూ భారత్ దగ్గర 1.15 మిలియన్ రిజర్వ్, 25 లక్షల పారా మిలటరీ బలగాలు అదనంగా ఉన్నాయి. 

ఆర్థిక బలం..

ఇవన్నీ ఒక ఎత్తైతే ఆర్థికంగా పాకిస్తాన్ కంటే భారత్ చాలా ఉన్నతంగా ఉంది. ఇప్పటికప్పుడు యుద్ధం వచ్చినా దాన్ని ఇండియా తట్టుకోగలదు. దానికి కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేయగలదు. ప్రపంచ దేశాలు కూడా భారత్ కు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. ముఖ్యంగా పెద్దన్న అమెరికా అందరి కంటే ఈ విషయంలో ముందుంటుంది. కానీ మరి పాకిస్తాన్ సంగతేంటి. ఆ దేశం చాలా రోజులుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. తినడానికి తిండి కూడా లేకుండా బాధలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆ దేశం ఫుల్ ఎఫెర్ట్ పెట్టి యుద్ధం చేయగలదా...ఒకవేళ చేసినా...యుద్ధం ముగిశాక వచ్చే పరిసనామాలను తట్టుకోగలదా అనే చాలా పెద్ద ప్రశ్నే. పైగా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కు ఏ విధంగానూ సహాయం చేయవు. ఆఖరుకి కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత తాలిబాన్లు కూడా భారత్ కు సపోర్టు చేశారు. పాక్ చేసింది తప్పు అంటూ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం అంటూ ఎగదోయడం సరైన విషయం కాదు. దీన్ని ఆ దేశం ఎంత త్వరగా తెలుసుకుంటే...దానికి అంత మంచిది. 

 today-latest-news-in-telugu | india | pakistan | war | army

Advertisment
Advertisment
Advertisment