Kolkata: ఆందోళన విరమించిన జూడాలు..శనివారం నుంచి విధుల్లోకి

కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం తర్వాత దాదాపు నెల రోజులుగా నిరసనలు చేస్తూ విధులకు దూరంగా ఉన్న జూనియర్ డాక్టర్లు మొత్తానికి తమ ఆందోళనను విరమించారు. శనివారం నుంచి డ్యూటీలో జాయిన్ అవుతామని ప్రకటించారు.

author-image
By Manogna alamuru
New Update
Kolkata doctor rape-murder case: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. చివరిసారి ఆమె డైరీలో రాసుకుంది ఇదే

Kolkata Junior Doctors: 

తమ తోటి ట్రైనీ డాక్టర్‌‌కు న్యాయం చేయాలని..జూనియర్ డాక్టర్ల డ్యూటీల విషయంలో రూల్స్ మార్చాలని డిమాండ్ చేస్తూ జూడాలు నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఎవరు ఎంత చెప్పినా తమకు న్యాయం జరిగే వరకూ నిరసనలు ఆపేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. బెంగాల్ ఛీప్ మినిస్టర్ మమతా బెనర్జీ వీరితో ఐదుసార్లు చర్చలు జరపడానికి ప్రయత్నించారు. చివరకు ఐదోసారి జూడాలు దీదీతో మాట్లాడ్డానికి ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లకు మమత అంగీకరించారు. కోల్‌కతా నగర పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ను బదిలీ చేశారు. నూతన కమిషనర్‌గా మనోజ్‌ కుమార్‌ వర్మను నియమించారు. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కౌస్తవ్‌ నాయక్‌, హెల్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ దేవాశిష్‌ హల్దేర్‌లను వారి పోస్టుల నుంచి తొలిగించనున్నట్లు ప్రకటించారు. దాని తర్వాత ఇప్పుడు తాము ఆందోళనను విరమిస్తున్నట్టు ప్రకటించారు.  ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంతో ఆందోళన విరమించామని చెప్పారు. శనివారం నుంచి విధుల్లోకి జాయిన్ అవుతామని చెప్పారు.

Also Read: Hezbollah:  హెజ్బుల్లా స్థావరాల మీద విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు

ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
India's first train ATM installed on board Panchavati Express

India's first train ATM installed on board Panchavati Express

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్‌ డోర్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.

Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

 అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్‌ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

telugu-news | national-news | trains

Advertisment
Advertisment
Advertisment