AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఓటర్లకు ఆకట్టుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 15 గ్యారెంటీలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉద్యోగాల కల్పన, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని పథకం వంటి వివిధ హామీలు ఇందులో ఉన్నాయి.
Also Read: ఇవ్వాల్టితో ఉత్తరాఖండ్లో మారనున్న రూల్స్ ఇవే.. పెళ్లికి రిజిస్ట్రేషన్ ఇంకా..
ఆటో, టాక్సీ, ఈ-రిక్షా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.లక్ష అందజేయడం, వారి పిల్లకు ఫ్రీ కోచింగ్, జీవిత బీమా కల్పించడం వంటివి కూడా తాజాగా తమ మేనిఫెస్టోలో చేర్చారు. తాము అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఈ హామీలన్ని అమలు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హామీ ఇచ్చారు.
Also Read: Daaku Maharaaj: దబిడి దిబిడే.. ఓటీటీలోకి బాలయ్య డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మేనిఫెస్టోలో హామీలు ఇవే..
- మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100.
- నిరుద్యోగులు లేని రాజధానికి ఢిల్లీని మార్చడం. అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగాల కల్పన.
- సంజీవని స్కూమ్ కింద 60 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం.
- నీటీ సరఫరా బిల్లులు మాఫీ, 24 గంటలు నీటిని సరఫరా చేయడం.
- యూరప్ లాగా రోడ్ల నిర్మాణం చేయడం, యమునా నదిని శుభ్రం చేయడం.
- డా.అంబేద్కర్ స్కాలర్షిప్ పతకంతో విద్యార్థులకు ఫ్రీ బస్సు సౌకర్యం. ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పించడం.
- ఆలయ పూజరులు, గ్రంథీలకు నెలకు రూ.18 వేలు అందించడం.
- కౌలుదారులకు ఫ్రీ కరెంట్తో పాటు ఫ్రీగా నీటి సైకర్యం, మురుగు నీటివ్యవస్థను పరిష్కరించడం, అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయడం.
- ఆటో,టాక్సీ, ఈ-రిక్షా డ్రైవర్ల కుమార్తెల పెళ్లిల్ల కోసం ఒక్కో కుటుంబానికి రూ.లక్ష అందించడం, వాళ్ల పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా కల్పించడం.
- రెసిడెంట్ వెల్ఫెర్ అసోసియేషన్ (RWA)లకు ప్రైవేటు గార్డులను అందించడం.