Watch Video: ఘోరంగా కొట్టుకున్న స్కూల్‌ టీచర్‌, అంగన్‌వాడీ వర్కర్.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలోని ఓ లేడీ టీచర్, అంగన్‌వాడీ వర్కర్‌ తీవ్రంగా కొట్టుకున్నారు. కిందపడి జుట్లు పట్టుకుని తన్నుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

New Update
Anganwadi worker, teacher fight like school kids

Anganwadi worker, teacher fight like school kids

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలోని ఓ లేడీ  టీచర్, అంగన్‌వాడీ వర్కర్‌ తీవ్రంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు కిందపడి జుట్లు పట్టుకుని తన్నుకున్నారు. ఈ సంఘటన విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు దీనిపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు.  ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: భారతీయ రైల్వేకు రోజుకు ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ?

ఇక వివరాల్లోకి వెళ్తే మథురలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతీ తివారీ అసెస్టెంట్ టీచర్‌గా.. చంద్రవాతి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. అయితే మార్చి 26న వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఇది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే వాళ్లిద్దరూ కిందపడి ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. తన్నుకున్నారు. టీచర్‌కు మద్దతుగా కొందరు విద్యార్థులు అంగన్‌వాడీ కార్యకర్తను కాలితో తన్నారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన స్కూల్‌ సిబ్బంది వాళ్లిద్దరినీ విడిపించారు.  

Also Read: జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలు వాయిదా..! కారణం ఏంటంటే?

అయితే ఈ పోట్లాటలో అంగన్‌వాడీ కార్యకర్త చంద్రావతికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. దీనిపై విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలని బ్లాక్ అధికారులను ఆదేశించారు. టీచర్ ప్రీతి తివారి ఇంతకు ముందు కూడా కొందరితో ఘర్షణ పడినట్లు అక్కడున్న స్కూల్ సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు. 

Also Read: ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఉండగా భూకంపం.. చివరికి

Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన సీఐడీ

telugu-news | national-news | uttar-pradesh

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda scam: MP, MLAల స్పెషల్‌ కోర్టులో ముడా స్కామ్‌పై ED పిటిషన్

ముడా స్కామ్‌లో లోకయుక్తా పోలీసులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు క్లీన్ చీట్ ఇవ్వడాన్ని ఈడీ MP, MLAల స్పెషల్‌ కోర్టులో సవాలు చేసింది. ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో 8 పేజీల పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ త్వరలోనే కోర్టు విచారించనుంది.

New Update
muda scam case

muda scam case Photograph: (muda scam case)

ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ ఎదురైంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల స్కామ్‌లో దర్యాప్తు చేసిన లోకాయుక్త పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారు. లోకాయుక్తా పోలీసుల ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌ను రద్దు చేయాలని ఈడీ ఎమ్మెల్యే, ఎంపీల కోర్టును ఆశ్రయించింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఈడీ 8 పేజీల పిటిషన్ దాఖలు చేసింది. లోకాయుక్త నివేదికలో ఆయన నిర్దోషి అని తప్పుగా పేర్కొన్నారని వాదిస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబంపై అనేక ఆరోపణలు చేసింది ED. ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, ఇతరులపై పిటిషన్‌లో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

Also read: Loan waiver: లివర్ రూ.90 వేలు, కిడ్నీ రూ.75వేలు.. అప్పు తీర్చలేక అవయవాలు అమ్మకోడానికి రైతు

ED పిటిషన్‌ను ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు విచారిస్తోంది. లోకాయుక్త నివేదికను అంగీకరించాలా వద్దా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కర్ణాటక హైకోర్టు గతంలో ED సమన్లను రద్దు చేసింది. కానీ ఇప్పుడు దర్యాప్తు కోసం ఒత్తిడి మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. 2021లో మైసూరులోని విజయనగర ప్రాంతంలో 14 ప్లాట్లను ముడా సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిస్పందనగా, కేసరే గ్రామంలో పార్వతి యాజమాన్యంలోని 3.16 ఎకరాల భూమిని ముడా స్వాధీనం చేసుకుందనే ఆరోపణపై ED దర్యాప్తు చేస్తోంది. ఈ కేసునే ముడా స్కామ్‌గా కొనసాగుతుంది. ఈడీ విచారణలో సిద్ధరామయ్య తప్పు చేశారని వెల్లడైంది.  కానీ 2025 ఫిబ్రవరిలో లోకయుక్త పోలీసులు ఆయన కుటుంబం నిర్థోషి అని క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ విషయంపై ఈడీ ఎమ్మెల్యే, ఎంపీల స్పెషల్ కోర్టుకు వెళ్లింది.

Also read : Forbes Billionaires List 2025: 3లక్షల కోట్లు ఆమె సొంతం.. దేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరో తెలుసా..?

Advertisment
Advertisment
Advertisment