Amit Shah: ఏడు రోజులు జైల్లో ఉన్నా: అమిత్‌ షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సాంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా జైల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్‌గా ఉండే సమయంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నానని.. ఆ సమయంలో తనని 7 రోజులు జైల్లో పెట్టారని అన్నారు.

New Update
Amit Shah

Amit Shah

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సాంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా జైల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్‌గా ఉండే సమయంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నానని.. ఆ సమయంలో తనని జైల్లో పెట్టారని అన్నారు. అప్పడు తనపట్ల కఠినంగా వ్యవహరించినట్లు చెప్పారు. అస్సాంలోని డెర్గావ్‌లో లచిత్‌ బర్ఫుకాన్ పోలీసు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.  

Also read: కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు.. భగ్గుమన్న బీజేపీ

'' అస్సాంలో అప్పుడు హితేశ్వర్ సైకియా సీఎంగా ఉన్నారు. ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా విద్యార్థులందరం కలిసి ఆందోళన చేపట్టాం. ఆ సమయంలో నన్ను ఏడు రోజుల పాటు జైల్లో పెట్టారు. నాపై కఠినంగా వ్యవహరించారు. భౌతికంగా కూడా నాపై దాడి చేశారు. సైకియా అస్సాంకు రెండుసార్లు సీఎంగా ఉన్నారు. అస్సాంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు శాంతికి ఏమాత్రం కృషి చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక 10 ఏళ్లలో శాంతిభద్రలు మెరుగయ్యాయి.  

Also Read: నెక్స్ట్ హర్షసాయి.. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్!

10 వేల మంది యువత ఆయుధాలు వీడియ జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ పోలీసు అకాడమీకి లచినత్‌ బర్ఫకన్‌ పేరు పెట్టినందుకు సీఎం హిమంతబిశ్వ శర్మకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొఘలుల పాలన, వాళ్ల దాష్టీకాలను ఎదుర్కొన్న వాళ్లలో లచిత్ బర్ఫుకన్‌ ఒకరు. ఆయన చరిత్ర కేవలం అస్సాం మాత్రమే పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా తెలియాల్సిన అవసరం ఉందని'' అమత్ షా అన్నారు. 

Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్‌ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment