Delhi Elections Results : లక్కీ ఛాన్స్.. ఎన్నికలకు ముందు పార్టీ మారి గెలిచారు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపుగా 40 మందికి పైగా అభ్యర్థులు పార్టీలు మారారు. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలోకి చేరినవారే ఎక్కువగా ఉన్నారు

New Update
bjp vs aap

bjp vs aap

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపుగా 40 మందికి పైగా అభ్యర్థులు పార్టీలు మారారు. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలోకి చేరినవారే ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు పార్టీల నుంచి బీజేపీలోకి మారిన దాదాపు అందరు నాయకులు విజయం సాధించారు.  

కాంగ్రెస్ కు చెందిన అర విందర్ సింగ్ లవ్లీ.. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.  గాంధీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి అయిన ఆప్ అభ్యర్థి నవీన్ చౌదరిపై 12 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ కూడా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్ర త్యర్థి అయిన ఆప్ అభ్యర్థిపై 11 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ కు  చెందిన తర్వీందర్ సింగ్ మార్వా కూడా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను స్వల్ప ఓట్ల తేడాతో ఓడించారు.  అంతకుముందు జంగ్‌పురా నుండి మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు తర్విందర్ సింగ్ మార్వా.  

ఆప్ నుంచి బీజేపీ లోకి వెళ్లిన ఛత్తర్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ కూడా ఆప్ అభ్యర్థి బ్రహ్మసింగ్ తన్వర్ పై 6 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అకాలీదళ్ నుంచి బీజేపీలోకి చేరిన మంజీందర్ సింగ్ సిర్సా రాజౌరీ గార్డెన్ లో ఆప్ కు  చెందిన ధన్వతి చందేలాపై 18 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ నుండి ఆప్‌లోకి వెళ్లిన ఇద్దరు రాజకీయ నాయకులలో ప్రవేశ్ రత్న్ ఒకరు గెలిచారు.  పటేల్ నగర్ స్థానాన్ని ఆయన గెలుచుకున్నారు. మరోనేత  జితేందర్ సింగ్ కుంటి బీజేపీ అభ్యర్థి చేతిలో దాదాపు 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో

ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో కాంగ్రెస్‌కు వెళ్లిన అనేక మంది ఆప్ సభ్యులు ఉన్నారు. వీరిలో అసిమ్ అహ్మద్ ఖాన్ (మతియా మహల్), దేవేందర్ సెహ్రావత్ (బిజ్వాసన్), అబ్దుల్ రెహ్మాన్ (సీలంపూర్), మొహమ్మద్ ఇష్రాక్ (బాబర్‌పూర్) మరియు ఆదర్శ్ శాస్త్రి (ద్వారక) ఉన్నారు.  ఇలా ఆప్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వారంతా విజయం సాధిస్తే..బీజేపీ నుంచి ఆప్, కాంగ్రెస్ లో చేరినవారంతా ఓటమి చవిచూశారు.

Also Read :  Swati Maliwal : పార్టీ ఓడిపోతే సిగ్గులేకుండా డ్యాన్స్ చేస్తావా.. సీఎంపై స్వాతి ఫైర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు