B.ed: బీఈడీ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి ఒక ఏడాదే కోర్సు

బీఈడీ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ఇప్పటివరకు బీఈడీ కోర్సు రెండేళ్లు ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ త్వరలో ఒకే ఏడాది కోర్సు అందుబాటులోకి రానుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
NCTE to bring back one-year B.Ed programme

NCTE to bring back one-year B.Ed programme

మీరు బీఈడీ చేయాలనుకుంటున్నారా ?. అయితే మీకో గుడ్ న్యూస్. ఇప్పటివరకు బీఈడీ కోర్సు రెండేళ్లు ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ త్వరలో ఒకే ఏడాది కోర్సు అందుబాటులోకి రానుంది. 2026-2027 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని నేషనల్ కౌన్సిల్ ఫర్‌ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) అమలు చేయనుంది. ఇటీవల ఎన్‌సీటీఈకి సంబంధించి జరిగిన మీటింగ్‌లో డ్రాఫ్ట్‌ రెగ్యులేషన్స్‌ -2025 ను అధికారులు ఆమోదించారు. త్వరలోనే దీనిపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకోనున్నారు.  

Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే

ఇదిలాఉండగా.. బీఈడీ, ఎమ్‌ఈడీ కోర్సులు దశాబ్దాలుగా ఒక ఏడాది కోర్సు మాత్రమే ఉండేది. కానీ 2014లో ఎన్‌సీఈటీ దీన్ని రెండేళ్లకు పొడిగించింది. 10 ఏళ్ల తర్వాతా మళ్లీ ఇప్పుడు పాత విధానానికే శ్రీకారం చుట్టనుంది. అయితే ఇక్కడ తాజగా సవరించిన బీఈడీ, ఎమ్ఈ‌డీకి సంబంధించి రెండేళ్ల కోర్సును పూర్తిగా రద్దు చేసినట్లు కాదు. ఎమ్‌ఈడీ ఒక ఏడాది కోర్సు ఫుల్‌ టైమ్ ఉంటుందని.. రెండేళ్ల కోర్సు టీచర్లు, అలాగే ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్‌లకు ఉంటుందని ఎన్‌సీటీఈ ఛైర్మన్‌ పంకజ్ అరోరా తెలిపారు. 

Also Read: అమెరికా బాటలో యూకే.. 600 మందికి పైగా అక్రమ వలసదారులు అరెస్టు

 డ్రాఫ్ట్ రెగ్యులషన్స్‌ ప్రకారం.. ఒక ఏడాది బీఈడీ కోర్సు చేసేందుకు కేవలం నాలుగేళ్ల డిగ్రీ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (PG) పూర్తి చేసుకున్న వాళ్లే అర్హులని పంకజ్ పేర్కొన్నారు. మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్నవాళ్లు ఈ ఒక ఏడాది కోర్సుకు అర్హులు కాదని స్పష్టం చేశారు. ఇలాంటి విద్యార్థులకు రెండేళ్ల బీఈడీ కోర్సు ఎప్పట్లాగే కొనసాగుతోందని చెప్పారు.  

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment