Digital Arrest: మరో డిజిటల్‌ అరెస్టు .. రూ.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

దేశంలో డిజిటల్ అరెస్టు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను ఇంట్లో బంధించి ఏకంగా రూ.20 కోట్లకు పైగా కాజేశారు.

New Update
Digital Arrest

Digital Arrest

డిజిటల్ అరెస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులు, ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఈ మోసాలు ఆగడం లేదు. ఇప్పటికీ సైబర్‌ నేరగాళ్లు కొందరు అమయాకులకు వల వేసి డిజిటల్ అరెస్టులు చేస్తున్నారు. లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను ఇంట్లో బంధించి ఏకంగా రూ.20 కోట్లకు పైగా కాజేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!

ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని దక్షిణ ముంబయికి చెందిన వృద్ధురాలికి (86) గత ఏడాది డిసెంబర్ 26న ఫోన్ చేశాడు. సీబీఐ అధికారినంటూ చెప్పాడు. నగదు అక్రమ చలామణి వ్యవహారంలో మీ ఖాతా నుంచి కార్యకలాపాలు జరిగాయని... మీరు డిజిటల్ అరెస్టు అయ్యారంటూ నమ్మించారు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని హెచ్చరించారు. దీనిపై మేము దర్యాప్తు చేపట్టామని.. ప్రతి మూడు గంటలకు ఒకసారి మిమ్మల్ని తనిఖీ చేస్తామని చెప్పాడు. లేకపోతే మీ పిల్లలు అరెస్టవుతారని బెదిరించారు.  

Also Read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!

ఆ వృద్ధురాలు వాళ్లని నమ్మింది. చివరికి  వాళ్లు చెప్పినట్లుగా విడుతల వారీగా డబ్బులు చెల్లించింది. రెండు నెలల పాటు ఆమెను నిర్బంధించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.20.26 కోట్లు కాజేశారు. గతేడాది డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది మార్చి 3 వరకు ఆమె డిజిటల్ అరెస్టయ్యింది. చివరికి తాను మోసపోయినట్లు గ్రహించిన ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వివిధ ఖాతాలకు బదిలీ అయిపోయిన బాధితురాలి నగదులో రూ.77 లక్షలు స్తంభింపజేశారు. ఆ తర్వాత ముంబయిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 

Also Read: వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు

ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
India's first train ATM installed on board Panchavati Express

India's first train ATM installed on board Panchavati Express

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్‌ డోర్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.

Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

 అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్‌ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

telugu-news | national-news | trains

Advertisment
Advertisment
Advertisment