Tahawwur Rana: తహవ్వుర్‌ రాణాపై కీలక అప్‌డేట్‌.. ఎక్కడ ఉంచారంటే..?

తహవ్వూర్‌ రాణాను ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లోలోని ఎన్‌ఐఏ భవనానికి తీసుకెళ్లారు. దాని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గదిలో రాణాను ఉంచారు. 14*14 అడుగుల వైశాల్యం ఉన్న గదిలో అతడు ఉన్నాడు. రాణాపై 24 గంటల నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

New Update
Tahawwur Rana With NIA Officials

Tahawwur Rana With NIA Officials

ముంబయి ఉగ్రదాడి నిందితుడు తహవ్వుర్‌ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు (NIA) కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. అతడి కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. అలాగే అతడి నుంచి కీలక సమాచారాన్ని సేకరించనున్నారు.  రాణాను ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం వల్ల సీజీఓ కాంప్లెక్స్‌లో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. 

Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!

Tahawwur Rana

ఆ కాంప్లెక్స్‌లోనే ఎన్‌ఐఏ భవనం ఉంది. దాని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గదిలో రాణాను ఉంచారు. 14*14 అడుగుల వైశాల్యం ఉన్న గదిలో అతడు ఉన్నాడు. అతడిపై 24 గంటల నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ గదిలో డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్‌ కూడా ఉంది. రాణా పడుకునేందుకు నేలపైనే బెడ్‌ వేశారు. ఈ రూమ్‌లో బాత్రూర్‌ కూడా ఉంది. ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అన్నీ ఆ గదికే వస్తాయని తెలుస్తోంది. పర్మిషన్ లేకుండా ఎవరూ లోపలికి వెళ్లడానికి వీలు లేదు. కేవలం 12 మంది NIA అధికారులకు మాత్రమే పర్మిషన్ ఉంది.   

Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!

ఇదిలాఉండగా మంబయి ఉగ్రదాడి కేసులో నిందితుడిగా ఉన్న రాణాను అమెరికా నుంచి ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్‌కోర్టు ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచారు. రాణాను 20 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇవ్వాలని NIA కోరింది. దీంతో న్యాయమూర్తి 18 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం అతడిపై విచారణ జరుగుతోంది. 

Also Read: బిగ్ బ్రేకింగ్...తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖరారు

Also Read :  రేపు హనుమాన్‌ శోభాయాత్ర... ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

 rtv-news | Tahawwur Rana | national-news

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించారు.

New Update
west-bengal-teacher

west-bengal-teacher

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ ఎప్పటికీ మరచిపోదు. బైసరన్ లోఅమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది స్పాట్ లోనే మరణించారు. ఈ ఘటనలో ఎక్కువ మంది పర్యాటకులు గాయపడ్డారు కూడా. టూరిస్టులను చంపేముందు ఉగ్రవాదులు వారు ఏ మతానికి చెందినవారో కూడా నిర్ధారించుకున్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పెద్ద అడుగు వేశాడు. స్కూల్ టీచర్ అయిన సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇది నా వ్యక్తిగత నిర్ణయం

ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్ లో హింసకు మతాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని అంగీకరించలేనని తెలిపారు.  మతం పేరుతో ప్రాణాలు తీయడం బాధను కలిగిస్తోందని ..  అందుకే ఇస్లాంను త్యజిస్తున్నానని వెల్లడించారు. అయితే తన నమ్మకాలను తన కుటుంబంపై రుద్దబోనని అతను స్పష్టం చేశాడు. నా భార్య, పిల్లలకు ఈ విషయంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా వారికి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. నేను ఏ మతాన్ని అగౌరవపరచడం లేదని ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని తెలిపాడు. ప్రతిదీ మతం చుట్టూ తిరుగుతున్న ప్రపంచంలో తాను జీవించాలనుకోవడం లేదని హుస్సేన్ అన్నారు. 

Also Read :  Veeraiah Chowdary Murder Case : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసులో కీలక పరిణామం..నిందితులు ఎవరంటే...

Advertisment
Advertisment
Advertisment