Nandigama: 20 ఏళ్ల పాటు బిడ్డల కోసం తల్లి తపన.. ముగ్గురికి జన్మనిచ్చి అంతలోనే విషాదం!!

నందిగామ మండలంలోని మాగల్లు గ్రామానికి చెందిన షేక్ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఖాసీం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ దంపతులు పిల్లల కోసం ఎంతో తపించారు. ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఎదురు చూశారు. తీరా దేవుడు కరుణింగా నజీరా గర్భం దాల్చింది. పది రోజుల క్రితం ఆమెను ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి ఇద్దరు ఆడశిశువులు, ఓ మగశిశువును బయటకు తీశారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మరోవైపు నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో.. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆమె మంగళవారం హఠాత్తుగా మరణించింది.

New Update
Nandigama: 20 ఏళ్ల పాటు బిడ్డల కోసం తల్లి తపన.. ముగ్గురికి జన్మనిచ్చి అంతలోనే విషాదం!!
  • 20 ఏళ్ల పాటు బిడ్డల కోసం తపించి తల్లైన మహిళ
  • ఆసుపత్రిలో ముగ్గురు బిడ్డలకు జననం
  • ప్రసవం అనంతరం చికిత్స పొందుతూ మహిళ మృతి
  • తీవ్ర విషాదంలో మహిళ కుటుంబం

అమ్మా.. అనే పిలుపు కోసం ఆరాటపడని మహిళలు ఉండరు. ఆస్తుపాస్తులు లేకున్నా.. బిడ్డలుంటే చాలనుకుంటారు. ఇక బిడ్డల కోసం తిరగనా ఆస్పత్రి ఉండదు.. మొక్కని దేవుడూ ఉండడు. అలా ఓ మహిళ పిల్లల కోసం ఏకంగా 20 ఏళ్ల పాటు తపించింది. దేవుడు కరుణించడంతో గర్భం దాల్చింది. కానీ అంతలోనే విధి కర్కశంగా కాటేసింది. ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చిన ఆ తల్లి బిడ్డల బోసినవ్వులు కూడా చూడకుండానే.. అమ్మా అనే పిలుపు వినకుండానే తనువు చాలించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా నందిగామ మండలంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. నందిగామ మండలంలోని మాగల్లు గ్రామానికి చెందిన షేక్ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఖాసీం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ దంపతులు పిల్లల కోసం ఎంతో తపించారు. ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఎదురు చూశారు. తీరా దేవుడు కరుణింగా నజీరా గర్భం దాల్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు:

పది రోజుల క్రితం ఆమెను ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి ఇద్దరు ఆడశిశువులు, ఓ మగశిశువును బయటకు తీశారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడంతో నజీరాతో పాటు కుటుంబ సభ్యుల ఆనందం అంబరాన్నంటింది. ముగ్గురు శిశువులు ఆరోగ్యంతో ఉన్నారు.

రక్తం తక్కువగా ఉండటంతో..

మరోవైపు నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో.. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆమె మంగళవారం హఠాత్తుగా మరణించింది. పిలల్ల కోసం తపించిన ఆమె వారిని కళ్లారా చూసుకోకుండానే కన్నుమూయడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. నజీరా మరణంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. బుధవారం కుటుంబసభ్యుల రోదనల నడుమ ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. తన స్థాయికి మించి ఖర్చు చేసినా బిడ్డలు తల్లిలేని వారు కావడంతో ఖాసిం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lady Aghori- Mark Shankar: పవన్ నీ కొడుకు కోసం పూజలు చేస్తున్నా- అఘోరీ సంచలన వీడియో

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని లేడీ అఘోరీ ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. అతడి కోసం పూజలు చేస్తున్నానని పేర్కొంది. పిల్లలందరిపై శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పింది. నా వంతు నేను కృషి చేస్తానని ఓ వీడియో రిలీజ్ చేసింది.

New Update


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్‌ స్కూల్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలిసిన తర్వాత ఎంతో మంది ప్రముఖులు స్పందించారు. చిరంజీవి, కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ తదితరులు రియాక్ట్ అయ్యారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన లేడీ అఘోరీ పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. 

Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

త్వరగా కోలుకోవాలి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. మార్క్ శంకర్ తో పాటు మరెంతో మంది చిన్న పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాల నుంచి కూడా మిగతా పిల్లలు కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలందరిపై కాళిమాత ఆశిస్సులు, శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయి. 

Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

ఈ ప్రమాదంలో గాయపడిన పవన్ కుమారుడి గురించి తాను స్పందించడం వెనుక ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కువగా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. అందుకే నేను స్పందిస్తున్నాను. దీనిని రాజకీయ కోణంలో చూడకండి. రాజకీయ బురద చల్లకండి. సనాతన ధర్మం గురించి ఎవరు పోరాడినా నేను స్పందిస్తాను. వాళ్ల కుటుంబాలకు ఏమైనా నేను స్పందించి రక్షిస్తాను. 

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

పవన్ కళ్యాణ్ గారు మీరేం బాధపడకండి. మళ్లీ మీ కుమారుడు హ్యాపీగా నవ్వుతూ మీతో ఆడుకుంటాడు. మీరు సరదాగా మీ కుమారుడితో సమయాన్ని గడిపే రోజులు వస్తాయి. నా వంతు నేను కృషి చేస్తాను. పూజలో కూర్చోబోతున్నాను. మీరేం బాధపడకండి. మీరు సనాతన ధర్మం గురించి పోరాడండి. 

Also Read:  చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

(lady aghori | Pawan Kalyan | pawan kalyan son mark shankar | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment