USA: పక్కలో పాసు పోసిందని 4ఏళ్ల చిన్నారిని చచ్చేవరకు కొట్టిన తల్లి.. ఎక్కడంటే!

కన్న కూతురినే దారుణంగా చంపిందో తల్లి. చిన్నారి పాపకు కేవలం నాలుగేళ్ళే అన్న విషయం కూడా మర్చిపోయింది. తనకున్న మెంటల్ డిప్రెషన్‌కు పాపను బలి చేసింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన అక్కడ సంచలనం సృష్టించింది.

New Update
USA: పక్కలో పాసు పోసిందని 4ఏళ్ల చిన్నారిని చచ్చేవరకు కొట్టిన తల్లి.. ఎక్కడంటే!

Mom Killed Four Years Daughter: మామూలుగా పిల్లలను ఎవరైనా కొడితేనే చూసి తట్టుకోలేము. అలాంటిది చాలా చిన్న కారణానికే చంపేస్తే...అది కూడా తల్లే..తన కన్న కూతురిని దారుణంగా కొట్టి చనిపోయేట్టు చేస్తే...వినడానికే చాలా విషాదంగా ఉన్న ఈ సంఘటన అమెరికాలోనే హామిల్టన్ కౌంటీలో జరిగింది. అక్కడ ఉండే టియానా రాబిన్సన్ అనే ఆమె తన నాలుగేళ్ళ కూతురిని అత్యంత క్రూరంగా హింసించింది. దీనివలన ఆ పాప నరకయాతన అనుభవించింది. అచివరకు ప్రాణాలను కూడా వదిలేసింది.

పక్కలో పాస్ పోస్తే నేరమా..

టియానా రాబిన్సన్, నహ్లా మిల్లర్ తల్లీ కూతుళ్ళు. వీరిద్దరు హామిల్టన్ కౌంటీలో ఉంటారు. టియానాకు 28ఏళ్ళు, నహ్లాకు 4ఏళ్ళు. పాపకు పక్కలో పాస్ పోసే అలవాటు ఉంది. టియానా దాన్ని మానిపించడానికి ప్రయత్నించింది. అయితే కొంతమంది పిల్లలకు ఈ అలవాటు కాస్త పెద్ద అయితే కానీ పోదు. అయితే టియానాకు ఈ విషయం తెలీదో లేక అంత ఓపిక లేదో కానీ...నహ్లాను విపరీతంగా కొట్టింది. పక్క మీద పాస్ పోసిందని దారుణంగా హింసించింది. అంతేకాదు ఏకంగా గొంతు కోసేసింది. ఈ దాడిలో నహ్లా చేయి విరిగింది. మెదడుకు కూడా బాగా దెబ్బలు తగిలాయి. దీంతో పాప చనిపోయింది. ఈ సంఘటన 2021లో జరిగింది. అయితే ఇప్పుడు దాదాపు మూడు ఏళ్ళ తర్వాత హామిల్టన్ కౌంటీ టియన్నా కేసును విచారించి శిక్షను ఖరారు చేసింది.

30 ఏళ్ళ జైలు శిక్ష..

టియన్నా చేసిన పనిని దారుణంగా అభివర్ణించారు హామిల్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ మెలిస్సా పవర్స్. నహ్లా పరిస్థితి తలుచుకుంటే కడుపులోంచి బాధ తన్నుకొస్తుందని వ్యాఖ్యానించారు. అంత బాధను ఆ చిన్న ప్రాణం ఎలా తట్టుకుందో అంటూ విచారం వ్యకతం చేశారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన టియన్నాకు అంతకంటే ఘోరమైన శిక్ష వేయాల్సిందేనని అన్నారు. ఆమెకు ౩౦ సంవత్సరాల జైలు శిక్షను విధించారు. అది కూడా పెరోల్ ఇవ్వనటువంటి శిక్షను వేశారు. టియన్నాకు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ మరియు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని..దాని వలనే ఆమె అంత దారుణంగా ప్రవర్తించిందని కోర్టు తెలిపింది. అయినా కూడా ఆమె శిక్షకు అర్హురాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Also Read:జోరుమీదనున్న మెగా డాటర్..యమ్మీ కబుర్లు అంటున్న నిహారికా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment