Rahul Gandhi: పేదలు అడుగు పెట్టలేని రైళ్లు ఎవరికోసం.. మోడీ ప్రభుత్వానికి రాహుల్ చురకలు!

సంపన్నుల కోసమే మోడీ ప్రభుత్వం రైల్వే విధివిధానాలను తయారు చేస్తుందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేదలు అడుగు పెట్టలేని ఉన్నత వర్గం రైలును చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దోపిడీలు బయటపడుకుండా రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కు ముగింపు పలికారని ఆరోపించారు.

New Update
Rahul Gandhi: పేదలు అడుగు పెట్టలేని రైళ్లు ఎవరికోసం.. మోడీ ప్రభుత్వానికి రాహుల్ చురకలు!

Rahul Gandhi: దేశంలో పేదలకు మేలు చేయకుండా సంపన్నుల కోసమే మోడీ ప్రభుత్వం రైల్వే విధివిధానాలను తయారు చేస్తుందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. ముఖ్యంగా భారతీయ రైల్వేలో (Indian Railways) విధానాలన్నీ డబ్బున్న వారికి సౌకర్యాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోందని ఆరోపించారు. అంతేకాదు వివిధ ఛార్జీల పేరుతో టికెట్ల రేట్లు పెంచి, ఏసీ బోగీలను పెంచుతూ సాధారణ ప్రయాణికులకు రైల్వేలను దూరం చేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ఛార్జీల పేరుతో దోచుకుంటున్నారు..
ఈ మేరకు ఎక్స్‌ వేదికగా భారతీయ రైల్వే విధానాలను వ్యతిరేకిస్తూ పోస్ట్ పెట్టారు రాహుల్‌ గాంధీ. ‘డైనమిక్‌ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నారు. పెరుగుతోన్న క్యాన్సలేషన్‌ ఫీజుతోపాటు ప్లాట్‌ఫామ్‌ టికెట్ల ధరల పెంచుతున్నారు. రకరకాల పేర్లతో టికెట్ల రేటు 10శాతం రెట్టింపు చేస్తున్నారు. పేదలు అడుగు పెట్టలేని ఉన్నత వర్గం రైలును చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారు. వయోవృద్ధులకు ఇచ్చే మినహాయింపులను వెనక్కి తీసుకోవడం ద్వారా గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం రూ.3700 కోట్ల ఆదాయం మిగిల్చుకుంది. కార్మికులు, రైతులే కాకుండా విద్యార్థులు ప్రయాణించే జనరల్‌ బోగీలను తగ్గిస్తూ ఏసీ కోచ్‌లను పెంచుతున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రయాణికులకు రైల్వేల్లో ప్రాధాన్యత లేకుండా పోయింది’ అంటూ రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : Pakistan PM: పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్!

అలాగే రైల్వేపై ఆధారపడే కోట్ల మంది ప్రజలను మోసగిస్తున్నారన్న ఆయన.. ఈ దోపిడీలన్నీ బయటపడుకుండా రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కు ముగింపు పలికారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment