తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు దంపతులు

తిరుపతి జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala)శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మంత్రి హరీష్‌రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. నేడు (సోమవారం) వేకువజామున తిరుమల చేరుకున్న హరీష్‌ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

New Update
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు దంపతులు

Minister Harishrao Couple Visited Tirumala Tirupathi Temple: తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ రావు (Minister Harish rao) దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీష్‌ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ద, ఆశీర్వచనం చేసి, మంత్రి హరీష్‌రావుకు వేదపండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఆలయం వెలుపల మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి హరీష్‌రావుతోపాటు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి (MP Parthasathi Reddy), రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి శ్రీనివాసరాజులు (Srinivasaraju), జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ హన్సరాజ్‌ గంగారాం (Hansraj Gangaram) కూడా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Also Read: నేడు ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు.. ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర!

Advertisment
Advertisment
తాజా కథనాలు