Crime:ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు డాక్టర్ ఇంతియాజ్ అరెస్ట్

చార్మినార్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కొడుకు ఖాజా అహ్మద్ ఖాన్ ఇంతియాజ్ పై కేసు నమోదు అయింది. బిల్డర్ను బెదిరించి అక్రమంగా 12 లక్షలు వసూలు చేసినట్లు ఇతను ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.

New Update
Crime:ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు  డాక్టర్ ఇంతియాజ్ అరెస్ట్

MIM ఎమ్మెల్యే కుమారుడు ఇంతియాజ్ ఖాన్ , MIM స్థానిక నాయకుడు గులాం ఖాదర్ జీలానీ అలియాస్ మన్నన్ లను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2021లో జరిగిన ఘటనకు సంబంధించిన ఓ ఆడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. వీరిద్దరూ 2021లో ఓ బిల్డర్ దగ్గర నుంచి బలవంతంగా 12లక్షలు మామూలు వసూలు చేశారని తెలుస్తోంది. అందులో
మన్నన్ 5 లక్షలు, ఎమ్మెల్యే కొడుకు ఇంతియాజ్ 7 లక్షలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఆడియో ఇప్పుడు లీక్ అవ్వడంతో పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఇది ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో వుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్డర్ ముఖీద్ చౌదరి నుంచి ఇద్దరూ 12 లక్షల మమూలు వసూలు చేశారు. స్థానిక నాయకుడైన మన్నన్ బిల్డర్ ను బెదిరించి అతని వద్ద 12 లక్షలు వసూలు చేసి ఎమ్మెల్యే కొడుకుకు మాత్రం 8 లక్షలే వచ్చాయని అబద్ధం చెప్పాడు. ఎమ్మెల్యే కొడుకు ఇంతియాజ్ కు ఏడు లక్షలు ఇచ్చి లక్ష తాను తీసుకున్నానని చెప్పాడు.

Also Read:అనంతపురంలో బస్ బ్రేక్ ఫెయిల్..ఒకరు మృతి

ఇది జరిగిన నెల తర్వాత అసలు విషయం ఎమ్మెల్యే కొడుకు అయిన డాక్టర్ ఇంతియాజ్ కు తెలిసింది. ఆగ్రహంతో ఊగిపోయిన డాక్టర్ ఇంతియాజ్ నాయకుడైన మన్నన్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. అర్ధగంట లో తీసుకున్న ఐదు లక్షలు తన క్లినిక్ కు వచ్చి ఇవ్వకపోతే నిన్ను నీ తమ్ముడిని ఎత్తుకొచ్చి తంతానని... బూతులతో రెచ్చిపోయాడు. ఐదు లక్షలు తీసుకున్న దాంట్లో నేనొక్కడినే లేను మీ స్నేహితుడు అహ్మద్ కూడా ఉన్నాడు. మీ దగ్గర నుంచి నేనేం డబ్బులు తీసుకోలేదు. నేనే మీకు డబ్బులు ఇచ్చాను అని మన్నన్ ఎమ్మెల్యే కుమారుడైన డాక్టర్ ఇంతియాజ్ కు ఫోన్ లో చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఇంతియాజ్.. ఆ బిల్డర్ కట్టిన బిల్డింగ్ను ghmc అధికారులతో కూలగొట్టిస్తా... రోడ్ వైడ్‌నింగ్‌లో కూలిపోతుంది.. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని నీ మీద కేసు కూడా పెడతా అంటూ మన్నన్ కు వార్నింగ్ ఇచ్చాడు. మొత్తం ఈ సంభాషణ అంతా మన్నన్ కాల్ రికార్డ్ చేశారు. ఈ ఆడియోనే ఇప్పుడు లీక్ అయింది.

ఆడియె రికార్డ్ ఆధారంగా బిల్డర్ ముఖీద్ చౌదరి, నిందితులు ఎమ్మెల్యే కొడుకు ఇంత్యాజ్, మన్నన్ లను పోలీసులు విచారించారు. నిందితులు అక్రమంగా బిల్డర్ ను బెదిరించి డబ్బులు వసూలు చేశారని ధృవీకరించారు. బాధితుడైన బిల్డర్ ముఖీద్ చౌదరి మాత్రం నిందితుల పై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించాడు. దీంతో చార్మినార్ పోలీసులే సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి విచారిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nalgonda Crime: నల్గొండలో విషాదం.. ప్రియుడు మోసం చేశాడని హాస్టల్‌లోనే యువతి..!

నల్గొండ జిల్లాలో ఓ యువతి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న మల్లేశ్వరి జాన్ రెడ్డిని ప్రేమించింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. 15 రోజుల కిందట మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకుంది.

New Update

Nalgonda Crime: నల్గొండ జిల్లా బొకంతలపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి బలవన్మరణం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న  మల్లేశ్వరి అనే యువతి జాన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. జాన్ రెడ్డి 15 రోజుల కిందట మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మల్లేశ్వరి మనస్థాపం చెంది హాస్టల్‌లోనే మత్తు ఇంజక్షన్ తీసుకుని మృతి చెందింది. దీంతో యువతి డెడ్‌బాడీని తీసుకుని కుటుంబ సభ్యులు జాన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారు. జాన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.  

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

సంగారెడ్డి జిల్లాలో కూడా..

ఇదిలా ఉండగా.. సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పఠాన్ చెరువు మండలంలో పెద్దకంజర్ల గ్రామం రమిలా అనే మహిళకు సురేష్ (32)తో ఐదు సంవత్సరాల క్రితం ఘనంగా వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అయినప్పటి నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

కానీ గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి. చివరకు పంచాయతీ వరకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో రమిలా తన తల్లి ఇంటి దగ్గర ఉంటుంది. అయితే ఈ సమయంలో కూడా సురేశ్ అక్కడికి వెళ్లి గొడవ పడేవాడు. ఓ రోజు తీవ్ర ఆగ్రహానికి గురై రోకలి బండతో రమిలాపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన అత్తను కూడా రోకలితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యుల అనుమతితో సురేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

 

Advertisment
Advertisment
Advertisment