Delhi High Court : భార్య పదేపదే అలా చేయడం తప్పే!

భర్త ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య పదేపదే తన పుట్టింటికి వెళ్లి పోవడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దూరం పెరిగే కొద్ది వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్‌ పేర్కొంది.

New Update
Delhi High Court : భార్య పదేపదే అలా చేయడం తప్పే!

Delhi High Court : భర్త(Husband) ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య(Wife) పదేపదే తన పుట్టింటికి వెళ్లి పోవడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దూరం పెరిగే కొద్ది వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్‌ పేర్కొంది. భార్య క్రూరత్వం, అకారణంగా విడిచిపెట్టిన కారణంగా భార్యభర్తలకు విడాకులు మంజూరు చేయోచ్చని వివరించింది.

విడాకుల(Divorce) కోసం అప్లై చేసిన వ్యక్తి తన పిటిషన్‌ లో తన భార్ అకారణంగా తనను విడిచి ఏడు సందర్భాల్లో వెళ్లిపోయిందని దీనిని సవాల్‌ చేస్తూ అతను ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. అయితే ఫ్యామిలీ కోర్టు అతనికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.

జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. 19 ఏళ్ల వివాహ బంధంలో ఏడు సార్లు, ఒక్కో సమయంలో 3 నుంచి 10 నెలల వరకు భార్య, భర్తను విడిచిపెట్టినట్లు కోర్టుకు సదరు వ్యక్తి తెలిపాడు. చాలా కాలం పాటు భార్య భర్తలు విడిగా ఉండడం వల్ల వివాహ బంధం(Marriage Life) కోలుకోని విధంగా విచ్చిన్నం కావొచ్చని.. ఇది మానసిక క్రూరత్వానికి నాంది అని పేర్కొంది.

భార్య ఎప్పటికప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లడం క్రూరత్వానికి సంబంధించిన చర్యగా కోర్టు పేర్కొంది. ఇది మానసిక కేసు, భర్త వేదన, అతడికి విడాకులు ఇచ్చే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. అత్తింటికి తిరిగి రావడానికి భార్య ఎలాంటి రాజీ ప్రయత్నాలు చేయలేదని, దీంతో వివాహ బంధాన్ని కొనసాగించే ఉద్దేశం ఆమెకు లేదని కనిపిస్తోందని కోర్టు వివరించింది. దీంతో కోర్టు విడాకుల్ని మంజూరు చేసింది.

Also read:  శ్రీవారి భక్తులకు శుభవార్త… వేసవిలో వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anemia: రక్తహీనతతో బాధపడేవారు ఇవి తప్పక తినాలి

రక్తహీనత, హిమోగ్లోబిన్ లేక పిల్లలు, మహిళలు బాధపడుతూ ఉంటారురు.మొలకెత్తిన పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్రరక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Anemia

Anemia

Anemia: భారతదేశంలో రక్తహీనత ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. చాలా మంది రక్తహీనత, హిమోగ్లోబిన్ లేకపోవడంతో బాధపడుతున్నారు. దీని వల్ల రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత ముఖ్యంగా పిల్లలు, మహిళలు, బలహీనులను ప్రభావితం చేస్తుంది. ఒక నివేదిక ప్రకారం 6 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల 67శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దాదాపు 52శాతం గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ ఆహారాలు ముట్టుకోకూడదు

సరైన ఆహారం తీసుకోకపోవడం..

ప్రసవ సమయంలో సమస్యలను కలిగిస్తుందని, శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శాకాహారులు తరచుగా సలాడ్ లేదా పండ్లను మాత్రమే తినడం వల్ల రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు. రక్త కణాలలు తగ్గడానికి శరీరంలో ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీర్ణవ్యవస్థలో సమస్యలు, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ లేకపోవడం, ఏదైనా రకమైన గాయం, అధిక ఋతు రక్తస్రావం కారణం అవుతుందని వైద్యులు అంటున్నారు.

Also Read:  బ్రో..'లక్కీ భాస్కర్' ఓటీటీ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

మొలకెత్తిన పప్పులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మొలకలు నాన్-హీమ్ ఐరన్ మంచి మూలం. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Also Read  రోజూ గుడ్డు తింటే వృద్ధాప్యంలోనూ మతిమరుపు ఉండదు

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment