Health Tips: నిద్రలేమితో బాధపడుతున్నారా ?.. ఈ టిప్స్ పాటిస్తే చాలు
చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా మెలటోనిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎగ్స్, పాలు, నట్స్, చేపలు, చెర్రీస్ తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.
మనిషి నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన నిద్ర ఎంతో ముఖ్యం. కంటినిండా నిద్రలేకుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. హర్మోన్లతో పాటు చాలా అంశాలు కూడా నిద్రను ప్రభావితం చేస్తుంటాయి. ఇప్పటికే చాలామంది నిద్రలేమితో బాధపడేవారు ఉన్నారు. ఇలాంటివారు మెలటోనిన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. అయితే ఈ సప్లిమెంట్స్ సురక్షితమే అయినప్పటికీ.. కొంతమందిలో తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, మగత వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంటాయి.
నిద్రలేమితో బాధపడేవారు సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా మెలటోనిన్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. దీనివల్ల సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు నిద్రలేమిని దూరం చేసుకునేందుకు ప్రతిరోజూ కూడా తినే ఆహారంలో గుడ్లు(EGGS)ని భాగం చేసుకోవడం మంచిది. ఎగ్స్లో ప్రొటిన్తో పాటు ఇతర సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి.. ఇందులో మెలటోనిన్ కూడా ఎక్కువగా ఉండటతో ఇది నిద్రలేమికి చెక్ పెడుతుంది.
ప్రతిరోజూ గుడ్లతో పాటు పాలు కూడా తీసుకోవాలి. పాలలో క్యాల్షియంతో సహా.. మెటలోనిన్ కూడా ఉండటం వల్ల ఇన్సోమ్నియాను ఇది నివారిస్తుంది. కంటినిండా నిద్రపోయేందుకు ఎగ్స్, పాలు, నట్స్, చేపలు, చెర్రీస్ తీసుకోవడం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
AP Liquor scam : లిక్కర్స్కాంలో మరో కొత్త పేరు..ఎవరంటే?
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని సిట్ విచారిస్తుంది.ఈ విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్చీఫ్ రాజశేఖర్ విచారిస్తున్నారు. ఈ కేసులో బల్లం సుధీర్ అనే పేరు తెరపైకి వచ్చింది.
AP Liquor scam : వైసీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించిన కెసిరెడ్డి రాజశేఖర్రెడ్డి అలియాస్ రాజ్ కెసిరెడ్డి ఎట్టకేలకు అరెస్టయ్యారు. ఆయనను సోమవారం సాయంత్రం 6.20 గంటల సమయంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి రాజేష్రెడ్డి అనే మారు పేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్ అధికారులు పట్టుకున్నారు. అరెస్టు చేసినట్లు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. శంషాబాద్ నుంచి రాత్రి 11.10 గంటలకు ఆయన్ను విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారు.
కాగా రాజ్ కెసిరెడ్డి.. సిట్ జారీ చేసిన నోటీసుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ, ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటి విచారణలన్నీ పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. మరోవైపు రాజ్ కెసిరెడ్డి విచారణకు ఏ మాత్రం సహకరించకపోవటంతో.. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, బినామీలు, మద్యం కుంభకోణం సొత్తును పెట్టుబడులుగా పెట్టిన సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు ఇటీవల వరుసగా 3 రోజులపాటు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన తండ్రి ఉపేంద్రరెడ్డికి నోటీసులిచ్చారు. ఇలా అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధం చేయడంతో తప్పించుకోవటం సాధ్యం కాదని గుర్తించిన రాజ్ కెసిరెడ్డి.. హైదరాబాద్ నుంచి చెన్నైకు చేరుకుని అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోవాలని కుట్ర చేశారు. కానీ ఈ లోపు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా కసిరెడ్డి విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్చీఫ్ రాజశేఖర్ బాబు విచారిస్తున్నారు. ఈవిచారణలో సిట్ చీఫ్తో పాటు ఏడుగురు అధికారుల బృందం ఉంది. అయితే వసూళ్ల నెట్వర్క్తో తనకు సంబంధం లేదని కసిరెడ్డి చెబుతున్నట్లు సమాచారం. గతంలో విజయసాయి, మిథున్ సిట్ఎదుట ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ జరుగుతోంది. పలు ఆధారాలను చూపిస్తూ సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి బల్లం సుధీర్ అనే పేరు వచ్చింది. ఇతను కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. లావాదేవీలన్నీ సుధీర్ ద్వారానే జరిపినట్టు తెలుస్తుంది. ఇంతకు సుధీర్ ఎవరు అనే కోణంలో అధికారులు కూపీ లాగే పనిలో ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఇసుక మాఫియాలోనూ ఇద్దరూ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. కసిరెడ్డి, సుధీర్ కలిసి వందల కోట్ల రూపాయలు వెనుకేసుకొన్నట్లు సమాచారం. ఈ లిక్కర్ స్కాంలో కేసిరెడ్డి తర్వాత సుధీర్దే కీలకపాత్రఅని అంటున్నారు. సుధీర్ అరెస్ట్ అయితే మరిన్ని సంచలనలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.