Vijayawada: విజయవాడ చేరుకున్న చిరంజీవి కుటుంబం, రజనీకాంత్

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులు అందరూ ఒక్కొక్కరుగా విజయవాడకు చేరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటంబసమేతంగా కొంతసేపటి క్రితమే విజయవాడకు వచ్చారు. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గన్నవరం చేరుకున్నారు.

New Update
Vijayawada: విజయవాడ చేరుకున్న చిరంజీవి కుటుంబం, రజనీకాంత్

చంద్రబాబు ప్రమాణ స్వీకారిని చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక ఘనంగా నిర్వహించేదుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, వెంకయ్య నాయుడు, యోగితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం రానున్నారు. రేపు ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

ఇక అతిధులు ఒక్కొక్కరుగా విజయవాడకు చేరుకుంటున్నారు. కొంతసేపటి క్రితమే చిరంజీవి తన కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చేశారు. హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు అక్కడి నుంచి కారులో విజయవాడకు ఆయన విచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవికి గన్నవరంలో, విజయవాడలో కూడా ఘన స్వాగతం లభించింది. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గన్నవరం చేరుకున్నారు. ఆయన కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు.

Also Read:National: ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు-రాహుల్ గాంధీ

Advertisment
Advertisment
తాజా కథనాలు