Mega DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ?

ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడగా.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మరో 5 వేల ఉద్యోగాలు ఇందులో జోడించనుంది.

New Update
Breaking : టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

Telangana Mega DSC in February: తెలంగాణ రాష్ట్రంలో మెగా డీఎస్సీకి (DSC) విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి నెలలో 20వేల ఉద్యోగాలు భర్తీకి నియమకాలు చేపడతామని సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఎన్నికల్లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో ఎక్కడ ఉపాధ్యాయ ఖాళీలు ఉండకూడదని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. దీంతో ఈ యేడాది విద్యాశాఖలో పదవీ విరమణ చేయనున్న వారితో సహా పలు ఖాళీల లెక్కలను అధికారులు సేకరిస్తున్నారు. అంతేకాదు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ (Lok Sabha Elections) వచ్చేలోపు డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌ జారీకి కసరత్తు కూడా జరుగుతోంది.

3, 800 మంది పదవీ విరమణ..
ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. నిజానికి వీరంతా 2021లోనే పదవీ విరమణ చేయాల్సింది. కానీ గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మూడేళ్లు పొడగించడంతో ఇంకా విధులు నిర్వహిస్తు్న్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. ఇక కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే గణాంకాలను సేకరించింది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. పాత నోటిఫికేషన్‌కు మరో 5 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేలోపే అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్లా్న్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: OU: ఓయూ డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు.. షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్‌లో అధికం..
ఇక కేవలం హైదరాబాద్‌లోనే 370 మంది టీచర్లు పదవీ విరమణ చేయనుండగా.. మేడ్చల్‌లో-260, ఖమ్మం-240, రంగారెడ్డి 210, సంగారెడ్డి-200, నిజామాబాద్‌లో-190 ఉద్యోగాల ఖాళీలుండనున్నాయి. అతి తక్కువగా నారాయణపేటలో 40 మంది రిటైర్ కానున్నారు. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 లక్షలు కాగా ప్రస్తుతం 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో ఈ యేడాది 3.7 శాతం మంది పదవీ విరమణ పొందనున్నారు. మార్చిలో 360 మంది, జూన్‌లో 700 మంది రిటైర్ కానున్నారు. ఇందులో 80 శాతం పురుషులుండటం విశేషం.

ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ..
ఇదిలావుంటే.. యూపీఎస్పీ తరహాలో గ్రూప్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) చెప్పారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఫిబ్రవరిలో మెగా డీఎస్సీని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీక్ లను దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణకు బలమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGPSC : గ్రూప్-1పై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతకు TGPSC నోటీసులు

బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్‌ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేశారని రాకేశ్‌రెడ్డికి కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. వారంలో రోజుల్లో సమాధానమిచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

New Update
TGPSC notices to BRS leader

TGPSC notices to BRS leader

భారతరాష్ట్రసమితి (బీఆర్ఎస్) నాయకుడు ఏనుగుల రాకేష్‌ రెడ్డికి టీజీపీఎస్సీ(TGPSC) పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేశారని రాకేశ్‌రెడ్డికి ఈ మేరకు కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. వారంలో రోజుల్లో సమాధానమిచ్చి క్షమాపణలు చెప్పాలని కమిషన్ డిమాండ్ చేసింది. లేదంటే పరువునష్టం, క్రిమినల్‌ కేసులు బుక్‌ చేస్తామని హెచ్చరించింది. ఇకపై భవిష్యత్తులో టీజీపీఎస్సీపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆంక్షలు విధించింది.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

TGPSC Notices To BRS Leader

కాగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో గోల్ మాల్ జరిగిందని, గ్రూప్ 1 పేపర్లను పదో తరగతి, ఇంటర్ పేపర్ల కంటే అధ్వాన్నంగా దిద్దారో విశ్లేషిస్తూ ఏనుగుల రాకేష్ రెడ్డ ఒక పత్రికలో ఆర్టికల్ రాశారు.రాసిన ఆర్టికల్ ను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని రాకేశ్ రెడ్డి  తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రాసిన వారిలో 40% మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారని, కాని వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకులో ఎందుకు లేరని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెయిన్స్ పరీక్షలు మొత్తం 46 కేంద్రాల్లో జరగగా కేవలం 2 కేంద్రాల్లోనే 72 మంది ఎలా టాప్ ర్యాంక్ పొందారో చెప్పాలని కమిషన్ ను డిమాండ్ చేశారు. అలాగే 25 సెంటర్ల నుంచి ఒక్కరు కూడా టాప్ లో లేకపోవడం వెనుక గల మతలబు ఏమిటో చెప్పాలని నిలదీశారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని ఆధారాలను సైతం సేకరించి అభ్యర్థులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్ క్యాటగిరీల్లో మొదట 33 మందిని భర్తీ చేసినప్పుడు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన అనేక మంది అభ్యర్థులను కాదని ఎటువంటి ప్రతిభ చూపకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు చేసినా మూడు సార్లు సర్టిఫికెట్లు పరిశీలించి కూడా ఇప్పటికీ ఆ నివేదికను ప్రభుత్వం బయట పెట్టడం లేదని విమర్శించారు. కాగా రాకేశ్ రెడ్డి ఆరోపణలను ఖండించిన టీజీపీఎస్సీ ఆయనకు నోటీసులు జారీ చేసింది . వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే కేసు పెడుతామని హెచ్చరించింది.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

 

anugula-rakesh-reddy | tgpsc latest news | tgpsc-group-1-exam | tgpsc-group-1 | telangana-jobs | latest-telugu-news | telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు