Watch Video: రీల్స్‌ మోజులో పడి చేయి, కాలు పోగొట్టుకున్న యువకుడు

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఓ యువకుడు ఏకంగా తన కాలు, చేయిని పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించి రీల్‌ గురించి సెంట్రల్‌ రైల్వే.. ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ వైరలవుతోంది. ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం మానుకోవాలంటూ రైల్వేశాఖ కోరింది.

New Update
Watch Video: రీల్స్‌ మోజులో పడి చేయి, కాలు పోగొట్టుకున్న యువకుడు

సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోడ్లపై, రైలు పట్టాలపై రీల్స్‌ చేస్తూ కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ యువకుడు రీల్స్ మోజులో పడి ఏకంగా తన కాలు, చేయిని పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించి రీల్‌ గురించి సెంట్రల్‌ రైల్వే.. ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ వైరలవుతోంది. ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం మానుకోవాలంటూ రైల్వేశాఖ సూచనలు చేసింది.

Also Read: కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!

ఇక వివరాల్లోకి వెళ్తే.. మస్జిత్ షా అనే యువకుడు కదులుతున్న రైలును రెండు చేతులతో పట్టుకొని స్టంట్ చేశాడు. అలా చేస్తూ ఉండగానే ప్రమాదవశాత్తు ఒక కాలు, చేయి పొగొట్టుకున్నాడు. రీల్స్ చేస్తూ తాను ఇలా కాలు, చేయి పోగొట్టుకున్నానని తెలుపుతూ ఆ యువకుడు చెప్పిన వీడియోను సెంట్రల్ రైల్వే తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేసింది. అయితే అంతకుముందు ఆ యువకుడు ఇలా స్టంట్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా.. అలా ఒక కాలు, చేయి కోల్పోయిన స్థితిలో కనిపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఏప్రిల్ 14న రైల్వే స్టేషన్‌లో ఇలా రీల్స్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కాలు, చెయి కోల్పోయినట్లు ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలాఉండగా.. ఎవరైనా రైళ్లు, రై ల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఇటువంటి స్టంట్లు చేస్తే వెంటనే 9004410735 లేదా 139 నంబర్‌కు సంప్రదించాలని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ తెలిపారు.

Also read: సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారా ? ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్‌.. ఎక్కడంటే

#reels #telugu-news #Social Media
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

YS jagan: జగన్ పర్యటనలో భద్రతా లోపం.. హెలికాప్టర్‌...

YS jagan: జగన్ పర్యటనలో భద్రతా లోపం.. హెలికాప్టర్‌ అద్దాలు ధ్వంసం

వైసీపీ అధినేత జగన్ అనంతపురం పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. రాప్తాడుకి హెలికాఫ్టర్‌లో వచ్చిన ఆయన్ని చూడ్డానికి జనం భారీగా తరలివచ్చారు. కార్యకర్తలు పోలీసులను దాటుకొని హెలికాఫ్టర్ దగ్గరకు దూసుకొచ్చారు. జనం తాకిడికి హెలికాఫ్టర్ అద్దాలు పగిలిపోయాయి.

New Update
YS jagan helicoptor

YS jagan helicoptor Photograph: (YS jagan helicoptor)

వైసీపీ నేత జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు. హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్న జగన్‌ను చూడడానికి వందలాది వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జగన్‌ను కలిసేందుకు కార్యకర్తలు హెలికాఫ్టర్ వద్దకు దూసుకొచ్చారు. జనాలను పోలీసు సిబ్బంది నియంత్రించలేక పోయ్యారు. జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ (అద్దాలు) ధ్వంసమైయ్యాయి. భద్రతా కారణాల రీత్యా వీఐపీని అలాంటి పరిస్థితిలో హెలికాఫ్టర్‌లో తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.

హెలికాప్టర్‌ దగ్గర క్రౌడ్‌ను కంట్రోల్ చేయడానికి సరిపడా సెక్యూరిటీ పెట్టలేదని పోలీసు వ్యవస్థపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ హత్యకు కుట్ర చేశారని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం పైలెట్ల సూచనతో రోడ్డు మార్గంలో జగన్‌ బెంగళూరుకు బయలుదేరారు.

Advertisment
Advertisment
Advertisment