Madhu Yaskhi: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. హింట్ ఇచ్చేసిన బండి సంజయ్!

బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందంటూ కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. విలీనంలో భాగంగానే కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారని ఆరోపించారు. హరీష్ రావును మంచి లీడర్ అంటూ పొగుడుతూ బండి సంజ్ హింట్ ఇచ్చారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

New Update
Madhu Yaskhi: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. హింట్ ఇచ్చేసిన బండి సంజయ్!

Telangana: బీఆర్ఎస్ (BRS) త్వరలోనే బీజేపీలో (BJP) విలీనం కాబోతుందంటూ మాజీ ఎంపీ మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపేందుకు ఒప్పదం కుదుర్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారంటూ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న మధుయాష్కి.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తే బండి సంజయ్ మద్దతు పలికారన్నారు. అందుకే బండి సంజయ్ (Bandi Sanjay).. హరీష్ రావును మంచి లీడర్ అంటూ పొగుడుతూ హింట్ ఇచ్చేరంటూ ఆసక్తికర ఆరోపణలు చేశారు.

ఆ ఎమ్మెల్యేలకు ఎలాంటి హామీ ఇవ్వట్లేదు.. 
అలాగే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తుంటే కేసీఆర్ మద్దతు పలికారంటూ విమర్శలు గుప్పించారు. రేవంత్‌ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యేలకు ఎలాంటి హామీలు ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా పాలనను చూసే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని స్పష్టం చేశారు.

Also Read: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Virat Kohli Record: రాజస్థాన్‌తో మ్యాచ్.. కింగ్ కోహ్లీ ముందు భారీ రికార్డు- 3 సిక్సులు బాదితే

ఇవాళ చినస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ vs ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ముందు భారీ రికార్డు ఉంది. కోహ్లీ మరో మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు.

New Update
virat Kohli rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్‌లో భాగంగా ఇవాళ 42వ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ముందు భారీ రికార్డు ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ రికార్డు అందుకునే ఛాన్స్ ఉంది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

కోహ్లీ ముందు భారీ రికార్డు

కోహ్లీ మరో మూడు సిక్స్‌లు కొడితే ఎవరికీ అందనంత అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నవాడవుతాడు. అవును.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో (ఛాంపియన్స్ లీగ్, ఐపీఎల్‌) 300 సిక్స్‌లు కొట్టిన తొలి ఆర్సీబీ బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ విషయం తెలిసి కోహ్లీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ మూడు సిక్సులు కొట్టి రికార్డును క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది చూడాలి. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

టాస్ గెలిచిన ఆర్ఆర్

ఐపీఎల్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,  రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్  జరుగుతోంది.  ముందుగా టాస్ గెలిచిన జట్టు రాజస్థాన్  కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్  లో రాజస్థాన్  కీలక ఆటగాడు సంజూ ఆడటం లేదు. కాగా ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 33 మ్యాచ్ లు జరగగా..  16 సార్లు ఆర్సీబీ గెలువగా..  14 సార్లు రాజస్థాన్ గెలిచింది. 

జట్లు:

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (సి), ధ్రువ్ జురెల్ (w), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, ఫజల్‌హాక్ ఫరూకీ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

virat-kohli | IPL 2025 | virat-kohli-records | rcb-vs-rr | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment