Telangana Game Changer : మహబూబాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!

ఈ లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్‌లో కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Telangana Game Changer : మహబూబాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!

Lok Sabha Elections 2024 : మహబూబాబాద్‌(Mahabubabad).. 2009లో ఏర్పాటైంది ఈ లోక్‌సభ సీటు. గిరిజనులు, ఆదివాసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం వరంగల్‌కు పొరుగునే వుంది. అటవీ ప్రాంతం అధికంగా వుండే మహబూబాబాద్‌లో స్థానిక సమస్యలే గెలుపోటములను తేలుస్తాయి. అడవి బిడ్డల బాగోగులు చూసుకునే వారికే ఇక్కడి ఓటర్లు పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. ఎస్‌టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం ఇది.

2019లో బీఆర్ఎస్ అభ్యర్ధి మాలోత్ కవిత గెలిచారు. కాంగ్రెస్(Congress) అభ్యర్ధి బలరాం నాయక్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు.

ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ బరిలో ఉన్నారు.

కాంగ్రెస్
బలరాం నాయక్ - మాజీ ఎంపీ, కేంద్రమంత్రిగా చేశారు.

బీఆర్ఎస్
మాలోత్ కవిత - సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే.

బీజేపీ
అజ్మీరా సీతారాం నాయక్ - తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది. 2014 నుంచి 2019 వరకూ మహబూబాబాద్ ఎంపీగా చేశారు.

కాంగ్రెస్ కు గెలిచే అవకాశం

publive-image

రీజన్స్‌ః
1) గతంలో ఇక్కడ్నించి ప్రాతినిధ్యం వహించడం, కేంద్రంలో మంత్రిగా చేయడంతో బలరాం నాయక్‌(Balaram Naik) ప్రభావం గట్టిగా కనిపిస్తోంది.
2) మంత్రి సీతక్క ప్రభావం 6 నియోజకవర్గాలపై వుండడం సానుకూలమైన అంశం.
3) ఈ పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు.
4) బీఆర్ఎస్‌ వీక్‌ అవడం.. బీజేపీ విజయం సాధించే స్థాయికి విస్తరించకపోవడం.. ప్రధానంగా కాంగ్రెస్‌ విజయానికి కారణమవుతోంది.
5) సీతారాం నాయక్‌కు వ్యక్తిగతంగా కరిష్మా వుంది. కొన్ని ఉద్యమ సంస్థలు ఆయన కోసం పనిచేస్తున్నా.. 2014 నాటి ఐక్యత సంఘాల్లో లేదు.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGSRTC: తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన టీజీఎస్‌ ఆర్టీసీ!

గ్రేటర్ హైదరాబాద్‌లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి.

New Update
tgrtc

హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు టీజీఎస్‌ రోడ్డు రవాణా సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే జులై నాటికి 200 కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే సమయానికి ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త బస్సుల్లో దాదాపు 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండటం విశేషం.

Also Read: BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో సిటీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి చేరింది. ముఖ్యంగా ఉదయం.. సాయంత్రం రద్దీ సమయాల్లో సిటీ బస్సులు అధిక లోడ్‌తో నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు మరింత మందిని ఆకర్షించాలంటే కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అంటున్నారు.

Also Read: BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్

అవసరమైన నిధుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బ్యాంకులను సంప్రదించగా, వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో రోజూ 23 నుంచి 24 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.వీరిలో 14 నుంచి 15 లక్షల మంది మహిళలే అధికంగా ఉన్నారు. ఈ గణాంకాలు నగరంలో ప్రజా రవాణా ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో టీఎస్‌ఆర్టీసీ ముందుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో ప్రస్తుతం 3,100 బస్సులు నడుస్తుండగా.. రానున్న రోజుల్లో  పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని ప్రభుత్వం అనుకుంటుంది. 2025 డిసెంబర్ నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలోనే గ్రేటర్ జోన్‌లోని 25 బస్ డిపోల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఈ చర్యలు నగరంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా.. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయని అధికారులు అనుకుంటున్నారు.

Also Read: BIG BREAKING: పాక్ కి భారీ షాక్‌..10 మంది సైనికులు హతం!

Also Read: Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

 rtc | electric-bus | Electric busses in telangana | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment