Summer: వేసవిలో ఈ పదార్థాలు తిన్నారో.. మీరు పైకి పోవడం ఖాయం

వేసవిలో డ్రైఫూట్స్, స్పైసీ ఫుడ్, వేయించిన పదార్థాలు, కాఫీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అధికంగా తీసుకుంటే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో మీకు అలసట, నీరసం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

New Update
summer tips

summer

వేసవి కాలం వచ్చేసింది. తీవ్రమైన ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలంలో పోషకాలు ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి. లేకపోతే బాడీ డీ హైడ్రేషన్‌కు గురై కళ్లు తిరిగిపడిపోయిన ఆశ్చర్య పడక్కర్లేదు. అయితే వేసవిలో తినకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

డ్రై ఫూట్స్

జీడిపప్పు, పిస్తా వంటి వాటిని ఎక్కువగా తినవద్దు. వీటివల్ల బాడీ వేడి చేస్తుంది. సాధారణంగానే వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే ఇంకా ఎక్కువ శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!

స్పైసీ ఫుడ్
వేసవిలో స్పైసీ ఫుడ్‌ను తినడం తగ్గించాలి. వీటిని తినడం వల్ల బాడీ డీహైడ్రేట్ కావడంతో పాటు ఎండ తీవ్రతకి చిరాకు అనిపిస్తుంది. కాస్త తక్కువ స్పైసీ ఉండే వాటిని తీసుకోండి. 

వేయించిన పదార్ధాలు 
వేసవిలో వేయించిన పదార్థాలను తినడం వల్ల శరీరానికి ఎలాంటి శక్తి అందదు. దీంతో బయటకు వెళ్లినప్పుడు కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Elan Musk: ఎక్స్‌ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్‌ దాడే అంటున్న మస్క్‌!

కాఫీ
కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే కాఫీని ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకోవద్దు. కాఫీ ఎక్కువగా తాగితే బాడీకి వేడి చేస్తుంది. ఎప్పుడో ఒకసారి తాగితే పర్లేదు.. కానీ రోజులో ఎక్కువ సార్లు తాగడం వల్ల మీ బాడీకి ఎలాంటి శక్తి కూడా లభించదు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు నిపుణులను సంప్రదించండి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పరగడుపున ఈ ఎల్లో పండు తింటున్నారా.. మీ పని ఖతం

పరగడుపున అరటి పండ్లను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఆమ్లం జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఏదైనా టిఫిన్ చేసిన తర్వాత అరటి పండును తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి పరగడుపున ఎప్పుడూ కూడా అరటి పండు అసలు తీసుకోవద్దు.

New Update
Health Tips : ఈ 5 అలవాట్లు మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి..అలసటను దూరం చేస్తాయి...!!

Morning

సీజన్‌తో సంబంధం లేకుండా అరటి పండ్లు లభిస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పోటాషియం, కాల్షియం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే చాలా ఈ అరటి పండును తింటుంటారు. కానీ పరగడుపున అరటి పండ్లను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే వీటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

జీర్ణక్రియపై ఒత్తిడి పడుతుందని..

అరటి పండ్లను ఉదయం అల్పాహారంలో తీసుకోవచ్చు. కానీ ఏం తినకుండా పరగడుపున అయితే అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అరటి పండు ఎక్కువగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. పరగడుపున దీన్ని తీసుకుంటే జీర్ణక్రియపై ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అరటి పండ్లను ఉదయాన్నే తినవద్దు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఏదో ఒకటి తిన్న తర్వాత అరటి పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం గుండె, కిడ్నీ ఆరోగ్యం, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుందని నిపుణులు అంటున్నారు. రోజుకి ఒక రెండు అరటి పండ్లు తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలసట అంతా కూడా తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

Advertisment
Advertisment
Advertisment