Eating: భోజనం తర్వాత ఇలా చేశారంటే లివర్‌ పాడైపోతుంది

భోజనం తిన్న తర్వాత నిద్రపోయే అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవాలి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగించటంతోపాటు జీర్ణవ్యవస్థ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఉబ్బరం, కడుపులో నిరంతరం నొప్పులు వంటి సమస్యలకు దారితీస్తుంది.

New Update
eating..

Sleeping-Eating

Eating: భోజనం తర్వాత నిద్రపోవడం మీకు చాలా ప్రమాదకరం. ముఖ్యంగా మీ కాలేయం బలహీనంగా ఉంటే లేదా కాలేయ సంబంధిత వ్యాధి ఉంటే తిన్నతర్వాతఅస్సలు పడుకోవద్దంటున్నారు వైద్యులు. మన కాలేయం ఫ్యాక్టరీలా పని చేస్తుంది. ఆహారాన్ని ప్రాసెస్ చేస్తుంది, టాక్సిన్స్ ఫిల్టర్ చేస్తుంది. తిన్న తర్వాత నిద్రపోయే అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవాలని వైద్యులు అంటున్నారు. కాలేయాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాలేయం ఆరోగ్యంగా లేకపోతే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. తిన్న తర్వాత నిద్రపోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంటే GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్). ఇది కడుపు నుంచి ఆహారం, ఆమ్లం పైకి కదులుతుంది.

Also Read:  Hydrogen Train: త్వరలో ఈ మార్గంలో నీటితో నడిచే హైడ్రోజన్ ట్రైన్‌!

కడుపులో నిరంతరం నొప్పులు:

దీనివలన ఛాతీలో మంట, నొప్పి వస్తుంది. ముఖ్యంగా కాలేయంపై ఇప్పటికే అధిక ఒత్తిడి ఉన్నవారికి, కొవ్వు కాలేయం, హెపటైటిస్ లేదా ఇన్ఫ్లమేటరీ పరిస్థితులు వంటివి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఉబ్బరం, కడుపులో నిరంతరం నొప్పులు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల విసెరల్ కొవ్వు కూడా పెరుగుతుంది. ఇది అంతర్గత అవయవాలను ప్రభావితం చేస్తుంది.

ఇది కూడా చదవండి:  ఉదయాన్నే ఇలా పసుపును తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు

తిన్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటల వరకు నిద్రపోకండి. బదులుగా హాయిగా కూర్చోండి, సున్నితంగా నడవండి లేదా ఇతర కార్యకలాపాలలో పాల్గొనండి. ఎల్లప్పుడూ కొంచెం తక్కువగా తినండి. తద్వారా కడుపు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఖాళీ ఏర్పడుతుంది. కొవ్వు, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా కాలేయ సమస్య ఉంటే వేపుళ్ల జోలికి పోవద్దని వైద్యులు అంటున్నారు. కాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు లేదా టీ-కాఫీ తాగడం మానుకోండి. ఈ అలవాట్లను మెరుగుపరచడం ద్వారా కాలేయం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: మినరల్‌ వాటర్‌ అమ్మే బాటిళ్లతో కిడ్నీలకు ముప్పు

 

ఇది కూడా చదవండి: ఆస్తమా రోగులు ఈ ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vaishakha Amavasya వైశాఖ అమావాస్య రోజున.. ఈ రాశుల వారు ఇవి దానం చేస్తే అన్నీ శుభాలే !

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27న వైశాఖ అమావాస్య వస్తుంది. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

New Update
Vaishakha Amavasya

Vaishakha Amavasya

Vaishakha Amavasya హిందూ మతవిశ్వాసాల ప్రకారం వైశాఖ అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఏడాదిలో 12 అమావాస్య తిథులు ఉంటాయి. అందులో వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 27 ఉదయం 4: 28 గంటలకు మొదలై 28 తెల్లవారుజామున 1: 02 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును పూజిస్తారు. అలాగే దానధర్మాలకు కూడా ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. పితృదేవులకు పిండం, తర్పణం కూడా చేస్తారు. అయితే పితృదేవుల ఆత్మశాంతి కోసం  వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

రాశి చక్రం ప్రకారం చేయాల్సిన పనులు 

మేష రాశి 

 మేష రాశి వారు వైశాఖ అమావాస్య రోజున  తమ పూర్వీకులకు నీరు, షర్బత్, చల్లని వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. 

వృషభ రాశి 

వైశాఖ అమావాస్య రోజున వృషభ రాశి వారు డబ్బు, ఆహారాన్ని దానం చేయడం ద్వారా తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటారు. అలాగే శుభఘడియలు కూడా మొదలవుతాయి. 

కర్కాటక రాశి 

ఈ ప్రత్యేకమైన రోజున కర్కాటక రాశి వారు తెల్లటి ఆహార పదార్థాలను, ధనాన్ని ఎక్కువగా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు కలగడంతో పాటు పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. 

సింహరాశి 

సింహ రాశివారు బెల్లం, పప్పుదినుస్సులు, తేనే దానం చేయవచ్చు. వైశాఖ అమావాస్య రోజున ఈ దానాలు సింహరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడతాయి. 

కన్య రాశి 

వైశాఖ అమావాస్య రోజున కన్య రాశి వారు పూర్వీకుల ఆనందం కోసం నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలను దానం చేయాలి. 

తులారాశి 

తులారాశిలో జన్మించినవారు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, తెల్లటి వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభాలు చేకూరుతాయి. 

వృచ్చిక రాశి 

వృచ్చిక రాశివారు బెల్లం, ఎర్రటి బట్టలు దానం చేస్తే పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

telugu-news | latest-news | life-style | zodiac-signs

Advertisment
Advertisment
Advertisment