Night Time: రాత్రిపూట ఇలా చేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే

రాత్రి నిద్రపోయే రెండు గంటల ముందు మొబైల్ ఫోన్ చూడవద్దు. అలాగే భోజనం ఆలస్యంగా చేయడం, కెఫిన్ ఉండే పదార్థాలు తీసుకోవడం వంటివి చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. తొందరగా తినడం, మొబైల్ చూడకపోవడం వల్ల రాత్రి హాయిగా నిద్రపడుతుంది.

New Update
phonecallslatenight1

night time

చాలా మంది రాత్రి సమయాల్లో సరిగ్గా నిద్రపోకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అయితే తెలిసో తెలియక రాత్రిపూట చేసిన కొన్ని తప్పుల వల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మీరు కూడా ఇలానే మిస్టేక్స్ చేస్తున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.

ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు

మొబైల్ చూడటం

ప్రస్తుతం రోజుల్లో చాలా మంది రాత్రి సమయాల్లో ఎక్కువగా మొబైల్ చూస్తున్నారు. వీటి నుంచి విడుదలయ్యే కిరణాల వల్ల కళ్లు దెబ్బతింటాయి. అలాగే నిద్రపట్టదు. కాబట్టి రాత్రి నిద్రపోయే రెండు గంటల ముందు అసలు మొబైల్ చూడవద్దు. 

ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!

తొందరగా తినడం
రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల తిన్న ఫుడ్ జీర్ణం కాదు. దీంతో కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు అన్ని వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నిద్రపోవడానికి ఒక మూడు గంటల ముందు తినండి. దీనివల్ల తిన్న ఫుడ్ జీర్ణం అవుతుంది. నిద్ర కూడా హాయిగా పడుతుంది. 

ఇది కూడా చూడండి: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు

కెఫిన్ తీసుకోవద్దు
కొందర రాత్రి సమయాల్లో కెఫిన్ ఉండే పదార్థాలు తీసుకుంటారు. వీటి వల్ల రాత్రి సమయాల్లో పూర్తిగా నిద్రపట్టదు. కాబట్టి సాయంత్రం నాలుగు గంటల తర్వాత కెఫిన్ ఉండే పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Plants: షాంపూతో మొక్కలకు పట్టిన పురుగులు పరార్‌.. ఏం చేయాలంటే!!

కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు క్రిమిసంహారక మందులు అవసరం లేదు. లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి ఈ స్ప్రే బాటిల్‌లో మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది.

New Update
Plants

Plants

Plants: ఇంటిలో చిన్న తోటను సృష్టించడం వలన అందం పెరగడమే కాదు మనకు మనశ్శాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం కూడా లభిస్తుంది. అయితే మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడుకోవడంలోనూ మన బాధ్యత ఉంటుంది. మొక్కలకు హాని కలిగించే తెగుళ్లలో మీలీబగ్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి చిన్న తెల్లటి పిండిలా కనిపించే పురుగులు. మొక్కల కాండం, ఆకులపై కనిపిస్తూ వాటి జీవరసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల మొక్కలు బలహీనమవుతాయి. 

మందులు అవసరం లేదు:

ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోతూ చివరికి మొక్క నశిస్తుంది. ఇలాంటి కీటకాల నుంచి మొక్కలను కాపాడేందుకు ఖరీదైన క్రిమిసంహారక మందులు అవసరం లేదు. కేవలం రూపాయి విలువైన షాంపూ పౌచ్‌తోనే దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఒక లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల షాంపూను కలిపి తయారు చేసే ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో పెట్టి మొక్కలపై చల్లితే మీలీబగ్స్ తగ్గుతాయి. కానీ దీన్ని సూర్యరశ్మి ఉన్న సమయంలో కాకుండా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. మొదటిసారి చేయగానే ఫలితం రాకపోవచ్చు. వారానికి మూడుసార్లు పిచికారీ చేస్తే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: పండ్లను చూసే తియ్యగా ఉన్నాయో లేదో చెప్పొచ్చు

దీంతో పాటు వేపనూనె కూడా ఒక మంచి సహజ పరిష్కారం. వేప నూనెను నీటిలో కలిపి పిచికారీ చేస్తే మీలీబగ్స్ నివారణకు తోడ్పడుతుంది. అంతేకాకుండా సేఫర్ సబ్బు లేదా సాదా వాషింగ్ సొప్పుతో తయారైన ద్రావణాలను ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీలీబగ్ తీవ్రత అధికంగా ఉంటే ప్రభావిత ఆకులను తొలగించడం ఉత్తమమైన చర్య. ఇలా ఇంట్లో చిన్న ప్రయత్నాలతోనే మొక్కలను కాపాడుకోవచ్చు. సహజ పద్ధతుల్లో క్రిమిసంహారక చర్యలు తీసుకోవడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: క్యాన్సర్‌ను తరిమికొట్టే అద్భుతమైన ఆహారాలు

( home-tips | home tips in telugu | latest-news | bedroom-plants | coconut-plants | Green Power Plants | houseplants)

Advertisment
Advertisment
Advertisment