/rtv/media/media_files/2025/03/14/sB7QF2N8VXPoDjP6ZJWY.jpg)
14-year-old techie Photograph: (14-year-old techie)
ఆంధ్రప్రదేశ్కు చెందిన 14 ఏళ్ల బాలుడు నంద్యాల సిద్ధార్థ్ ఓ అద్భుత ఆవిష్కరణ చేశాడు. హార్ట్ చెక్అప్లు చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడకున్న పని. అంతేకాదు ఆ టెక్నాలజీ అన్నీ చోట్ల కూడా ఉండదు. కానీ ఇటీవల చాలామంది గుండె జబ్బులు బారిన పడుతున్నారు. ఆకస్మిక మరణాలు పెరిగిపోతున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ విభాగంలో రోగులకు రెండు రోజులుగా గుండె జబ్బుల స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో ఓ స్పెషాలిటీ ఉంది. 14 బాలుడు కనిపెట్టి ఓ ఏఐ యాప్ సాయంతో హార్ట్ చెక్అప్లు చేస్తున్నారు. ఈ టెస్టులు సింపుల్గా స్మార్ట్ ఫోన్తో చేయడం అందరినీ ఆకర్షించింది.
Also read : Aamir Khan: 60ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ హీరో డేటింగ్.. స్వయంగా ఆమె పేరు ప్రకటింపు
ఈ స్మార్ట్ ఫోన్లో అతడు స్వయంగా రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే సిర్కాడియావీ అనే యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే వెంటనే మీ గుండె ఆరోగ్యం గురించి చెప్పేయోచ్చు. స్మార్ట్ ఫోన్ను రోగి ఛాతీపై ఏడు సెకన్లపాటు ఉంచితే ఈ యాప్ హార్ట్ బీట్ రికార్డు చేస్తుంది. రోగికి గుండె జబ్బు ఉంటే బీప్ సౌండ్తో రెడ్ లైట్ వెలిగి గ్రాఫిక్లో అబ్నార్మల్ హార్ట్ బీట్ అనే పదాలు స్ర్కీన్పై కనిపిస్తున్నాయి. జీజీహెచ్ ఓపీలో దాదాపు 500 మందికి ఈ ఏఐ టెక్నాలజీతో స్ర్కీనింగ్ పరీక్షలు చేయగా, వారిలో పది మందికి గుండె జబ్బులు ఉన్నట్లు ఈ యాప్ తేల్చింది. వీరిని వార్డుకు తరలించి.. ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు చేయగా.. ఆశ్చర్యకరంగా అందరికీ గుండె జబ్బులు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో డాక్టర్లు సిదార్థ్పై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.
Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై
అనంతపురానికి చెందిన సిద్ధార్థ్ కుటుంబం 2010లో అమెరికాలో స్ధిరపడింది. తండ్రి మహేశ్ అమెరికాలో వ్యాపారవేత్త. సిద్ధార్థ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (డల్లా్స)లో బ్యాచ్లర్ ఆఫ్ ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఈ క్రమంలో సిర్కాడియావీ అనే యాప్ను ఆవిష్కరించాడు. ఆ యాప్తో అమెరికాలో 15 వేల మందికి స్ర్కీనింగ్ పరీక్షలు చేయగా.. 3,500 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు గుర్తించింది. 93 శాతం కచ్చితత్వంతో పనిచేసే ఈ యాప్ సాయంతో ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో స్ర్కీనింగ్ పరీక్షలు చేశారు.