Life Style: ఈ సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం తింటే డేంజర్!

సగ్గుబియ్యంతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం మంచిది. అధిక బరువు, మధుమేహం, జీర్ణసమస్యలు ఉన్నవారు దీనితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం మంచిది కాదు.

New Update
చలికాలంలో సజ్జలు తింటే కలిగే ప్రయోజనాలు

సాధారణంగా సగ్గుబియ్యంలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, ఐరన్ , మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, కండరాలను బలోపేతం చేయడం, గుండె పనితీరును మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు ఇందులో  ఉన్నాయి. సగ్గుబియ్యంతో టిక్కీ, కిచిడి, ఖీర్ వంటి ఆహారాలు తయారు చేసుకోవచ్చు. అయితే దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం మంచిది. 

ఎవరు తినకూడదు 

అధిక బరువు  

 బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు  సగ్గుబియ్యంతో చేసే ఆహార పదార్థాలకు  దూరంగా ఉండాలి.  వీటిలో సాగోలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది.  ఇది శరీరంలో కేలరీలను పెంచుతుంది. అలాగే  ప్రోటీన్  ఫైబర్ తక్కువగా ఉంటాయి. తద్వారా బరువు తగ్గడానికి సరైనదిగా పరిగణించబడదు. 

డయాబెటిస్ రోగులు 

సగ్గుబియ్యం  అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. దీనివల్ల డయాబెటిస్ రోగులు మరింత సమస్యను ఎదుర్కుంటారు. 

జీర్ణ సమస్యలు

సగ్గుబియ్యంలో  అధిక మొత్తంలో స్టార్చ్ ఉంటుంది, దీని కారణంగా మీకు కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం అనిపించవచ్చు. ఆలాగే దీనిలో ఫైబర్ తక్కువ.. కావున త్వరగా జీర్ణమవదు. 

తగిన పరిమాణంలో

సగ్గుబియ్యంలో అధిక మొత్తంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల, ఎక్కువ పరిమాణంలో తింటే బరువు పెరగవచ్చు. తగిన పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యకరం. 

life-style | latest-news | helath | telugu-news 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Life Style: ఎవర్నైనా ముట్టుకుంటే షాక్‌ కొడుతుందా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

చాలా మందికి చేతులు కలిపినప్పుడు, డోర్ హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇది హానికరమైనదేమీ కాదు. కానీ ఇదెలా జరుగుతుందో మీకు తెలుసా? ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకోండి

New Update
electric shock when touching someone

electric shock when touching someone

Life Style: ఒకరిని తాకినప్పుడు చిన్నపాటి విద్యుత్ షాక్‌లా అనిపించడం చాలా మందికి జరగే సాధారణ అనుభవం. చేతులు కలిపినప్పుడు, డోర్ హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇది హానికరమైనదేమీ కాదు. కానీ ఇదెలా జరుగుతుందో మీకు తెలుసా?

ఇది "స్టాటిక్ ఎలక్ట్రిసిటీ" వల్ల జరుగుతుంది. అంటే, కొన్ని వస్తువుల ఉపరితలంపై సహజంగానే ఎలక్ట్రిక్ చార్జ్ ఉండడం వల్ల ఇలా షాక్ కొడుతుంది. ఉదాహరణకు, కార్పెట్ మీద సాక్స్ వేసుకుని నడిచినప్పుడు మన శరీరం పై ఉండే ఎలక్ట్రాన్లను అది గ్రహిస్తుంది. ఆ ఎలక్ట్రాన్లే విద్యుత్ చార్జ్ రూపంలో మారి మరొకరు దానిని తాకినప్పుడు షాక్ కొట్టిన భావనని కలిగిస్తాయి. 

ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

చలికాలంలో ఎక్కువగా  ఎందుకు?

చలికాలంలో వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. దీని వల్ల మన శరీరంపై చార్జ్ నిల్వవుతుంది. అందుకే చలికాలంలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎక్కువగా అనిపిస్తుంది.

ఆరోగ్యానికి ప్రమాదమా?

ఈ చిన్న షాక్‌లు ఆరోగ్యానికి హానికరం కావు. కేవలం ఒక అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో, ఉదాహరణకు విద్యుత్  ఎగిసిపడే చోట లేదా సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాల దగ్గర ఇది ప్రమాదంగా మారవచ్చు. అందుకే కొన్ని పరిశ్రమలు స్టాటిక్ ఎలక్ట్రిసిటీకి గట్టి జాగ్రత్తలు తీసుకుంటాయి.

తగ్గించడానికి ఏం చేయాలి?

  • తేమ కలిగిన మాయిశ్చరైజర్‌ని వాడటం
     
  • గదిలో హ్యూమిడిఫయర్ పెట్టడం
     
  • కాటన్ బట్టలు వేసుకోవడం (నైలాన్, పాలిస్టర్ వంటివి నివారించాలి)
     
  • ఇంట్లో పాదరక్షలు లేకుండా నడవడం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 latest-news | life-style | telugu-news

ఇది కూడా చదవండి: భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు