/rtv/media/media_files/2025/04/04/CfQfPEpDNJmNh4EnkQOq.jpg)
Kids using mobile Photograph: (Kids using mobile)
ప్రస్తుతం రోజుల్లో పిల్లలు ఎక్కువగా మొబైల్స్ చూడటానికే అలవాటు పడుతున్నారు. అందులోనూ ఉదయం లేచిన వెంటనే మొబైల్స్ చూస్తున్నారు. ఇలా ఎక్కువగా మొబైల్స్ చూడటం వల్ల కంటిలోని రెటినా బాగా దెబ్బతింటుంది. దీంతో వారు రంగులను గుర్తించలేరు. చిన్నతనంలోనే వారికి కలర్ బ్లైండ్నెస్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు అనేవారు ఏడాది తర్వాత మాటలు ఆడటం మొదలు పెడతారు.
ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
మాటలు కూడా పెద్దగా రావు..
ఇలాంటి సమయాల్లో వారు ఎక్కువగా మొబైల్ చూసుకుంటూ ఉంటే ఇంకా మాట్లాడలేరు. వారికి రెండు మూడేళ్ల వరకు మాటలు రావు. పూర్తిగా ఎవరితో మాట్లాడటం అలవాటు చేసుకోకుండా మొబైల్ చూస్తూ ఉంటే దీనికే అలవాటు పడతారు. పెద్ద అయిన తర్వాత కూడా మాటలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!
పిల్లలు ఏడాది తర్వాత చిన్న చిన్న మాటలు మాట్లాడటం ప్రారంభిస్తారు. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకుండా ఇతరులతో మాట్లాడటం అలవాటు చేయాలి. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇలా కుటుంబ సభ్యులతో సమయం గడిపేలా చేయాలి. దీనివల్ల వారికి తొందరగా మాటలు వస్తాయి.
ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!
పూర్వకాలంలో స్మార్ట్ఫోన్లు లేకపోవడం వల్ల పిల్లలు కుటుంబ సభ్యులతో ఉంచి మాట్లాడించేవారు. వారికి ఒక్కో మాట నేర్పిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే తొందరగా మాటలు వస్తాయి. అదే చిన్నతనంలో వారు ఎక్కువగా మొబైల్స్ చూస్తుంటే మాత్రం పెద్దయ్యాక వారికి ఆటిజం, మెదడు పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: KKR VS SRH: మరీ ఇంత దారుణంగానా..ఎస్ఆర్హెచ్ కు ఏమైంది?