పిల్లలకు ఎక్కువగా మొబైల్ ఇస్తే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

ఉదయాన్నే పిల్లలకు మొబైల్ ఇవ్వడం వల్ల కంటిలోని రెటినా బాగా దెబ్బతింటుంది. దీంతో పాటు మాటలు రాకపోవడం, మెదడు పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కలర్ బ్లైండ్‌నెస్ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.

New Update
Kids using mobile

Kids using mobile Photograph: (Kids using mobile)

ప్రస్తుతం రోజుల్లో పిల్లలు ఎక్కువగా మొబైల్స్ చూడటానికే అలవాటు పడుతున్నారు. అందులోనూ ఉదయం లేచిన వెంటనే మొబైల్స్ చూస్తున్నారు. ఇలా ఎక్కువగా మొబైల్స్ చూడటం వల్ల కంటిలోని రెటినా బాగా దెబ్బతింటుంది. దీంతో వారు రంగులను గుర్తించలేరు. చిన్నతనంలోనే వారికి కలర్ బ్లైండ్‌నెస్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు అనేవారు ఏడాది తర్వాత మాటలు ఆడటం మొదలు పెడతారు.

ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

మాటలు కూడా పెద్దగా రావు..

ఇలాంటి సమయాల్లో వారు ఎక్కువగా మొబైల్ చూసుకుంటూ ఉంటే ఇంకా మాట్లాడలేరు. వారికి రెండు మూడేళ్ల వరకు మాటలు రావు. పూర్తిగా ఎవరితో మాట్లాడటం అలవాటు చేసుకోకుండా మొబైల్ చూస్తూ ఉంటే దీనికే అలవాటు పడతారు. పెద్ద అయిన తర్వాత కూడా మాటలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

పిల్లలు ఏడాది తర్వాత చిన్న చిన్న మాటలు మాట్లాడటం ప్రారంభిస్తారు. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకుండా ఇతరులతో మాట్లాడటం అలవాటు చేయాలి. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇలా కుటుంబ సభ్యులతో సమయం గడిపేలా చేయాలి. దీనివల్ల వారికి తొందరగా మాటలు వస్తాయి.

ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

పూర్వకాలంలో స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం వల్ల పిల్లలు కుటుంబ సభ్యులతో ఉంచి మాట్లాడించేవారు. వారికి ఒక్కో మాట నేర్పిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే తొందరగా మాటలు వస్తాయి. అదే చిన్నతనంలో వారు ఎక్కువగా మొబైల్స్ చూస్తుంటే మాత్రం పెద్దయ్యాక వారికి ఆటిజం, మెదడు పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: KKR VS SRH: మరీ ఇంత దారుణంగానా..ఎస్ఆర్హెచ్ కు ఏమైంది?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aloe Vera: మొండి మొటిమలకు కలబందతో చెక్‌ పెట్టండి

జిడ్డు, పొడి, సున్నితమైన చర్మంతోసహా అన్ని చర్మ రకాలకు కలబంద మంచిది. జిడ్డు చర్మం, మొటిమల సమస్య ఉంటే కలబందను నీటిలో మరిగించి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌లో తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

New Update
Aloe Vera

Aloe Vera

Aloe Vera: చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మార్కెట్లో చాలా క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లో లభించే సహజ ఉత్పత్తులు చర్మ ఆరోగ్యానికి మంచివని బ్యూటీషియన్లు అంటున్నారు. వాటిలో కలబంద ఒకటి. జిడ్డుగల, పొడి, సున్నితమైన చర్మంతో సహా అన్ని చర్మ రకాలకు కలబంద మంచిదని నిపుణులు అంటున్నారు. ప్రకాశవంతమైన ముఖం కోసం ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ పాలు, కొద్దిగా రోజ్ వాటర్, ఒక టేబుల్ స్పూన్ తేనె బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి కలబంద జెల్ వే మళ్ళీ కలపండి. దీన్ని ముఖం, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత ముఖం బాగా కడుక్కోవడం వల్ల  ముఖ కాంతి పెరుగుతుందని బ్యూటీ నిపుణులు సలహా ఇస్తున్నారు. 

చర్మంపై ఉన్న మచ్చలను తొలగించడంలో..

జిడ్డు చర్మం ఉన్నవారు మొటిమల సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాంటి వారు కలబంద ఆకులను నీటిలో కాసేపు మరిగించి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌లో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మొటిమలు అమ్మాయిలకు ఒక సాధారణ సమస్య. మొటిమలు వచ్చి పోయినప్పుడు మచ్చలు కనిపిస్తే మరింత ఆందోళన చెందుతారు. వీటిని తగ్గించడంలో కలబంద మంచిది. కలబంద గుజ్జులో రెండు చుక్కల రోజ్ ఆయిల్ కలిపి ముఖానికి అప్లై చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. గాయాల వల్ల చర్మంపై ఉన్న మచ్చలను తొలగించడంలో కూడా కలబంద గుజ్జు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. దీని కోసం కలబంద గుజ్జులో కొంచెం రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై ఉన్న మచ్చలకు అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మామిడి పండ్లు తినేప్పుడు ఈ తప్పులు చేయొద్దు

పొడి చర్మం ముఖాన్ని నిస్తేజంగా కనిపించేలా చేస్తుంది. చర్మంలో తేమ తక్కువగా ఉండటమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. తేమ స్థాయిని పెంచాలనుకుంటే లబంద గుజ్జులో కొద్దిగా ఆలివ్ నూనె వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగితే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై టాన్ రావడం చాలా సాధారణం. కొంచెం కలబంద గుజ్జును తీసుకుని దానికి ఒక చెంచా పసుపు, నిమ్మరసం వేసి బాగా కలపండి. తర్వాత ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రాంతానికి అప్లై చేయండి. పది నిమిషాల తర్వాత కడిగేయండి. దీనివల్ల టాన్ తగ్గడమే కాకుండా ముఖంపై మొటిమలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: 82శాతం మందిలో విటమిన్ డి లోపం..కారణం ఇదే

( aloe-vera | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news face-tips | pimples | face-pimples | pimples-problem | pimples-tips)

Advertisment
Advertisment
Advertisment