Mobile: పిల్లలకు ఎక్కువగా మొబైల్ ఇస్తున్నారా?

పిల్లలు ఎక్కువగా మొబైల్ చూస్తే కళ్లు దెబ్బతింటాయి. చిన్నతనంలోనే కలర్ బ్లైండ్‌నెస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే పిల్లలు ఇతరులతో మాట్లాడకుండా మొబైల్ చూస్తే వారికి తొందరగా మాటలు కూడా రావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
watching mobile

watching mobile

ఈ రోజుల్లో తల్లిదండ్రులు బిజీ అయిపోయి పిల్లలకు ఎక్కువగా మొబైల్స్ ఇస్తున్నారు. పిల్లలు తినకపోయినా, ఏడ్చినా, ఏదైనా మారం చేస్తే చాలు వెంటనే మొబైల్ ఇచ్చేస్తుంటారు. పిల్లలు ఎక్కువగా మొబైల్స్ చూడటానికే అలవాటు పడుతున్నారు. ఎక్కువగా ఈ రేస్ చూడటం వల్ల పిల్లల కళ్లకు దెబ్బ పడుతుంది. కంటిలోని రెటినా బాగా దెబ్బతింటుంది. దీంతో వారు రంగులను గుర్తించలేరు. చిన్న తనంలోనే వారికి కలర్ బ్లైండ్‌నెస్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?

ఎక్కువగా పిల్లలకు మొబైల్ ఇస్తున్నారా..

చిన్నపిల్లలు అనేవారు ఏడాది తర్వాత మాటలు ఆడటం మొదలు పెడతారు. ఇలాంటి సమయాల్లో వారు ఎక్కువగా మొబైల్ చూసుకుంటూ ఉంటే ఇంకా మాట్లాడలేరు. వారికి రెండు మూడేళ్ల వరకు మాటలు రావు. పూర్తిగా ఎవరితో మాట్లాడటం అలవాటు చేసుకోకుండా మొబైల్ చూస్తూ ఉంటే దీనికే అలవాటు పడతారు. పెద్ద అయిన తర్వాత కూడా మాటలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా పిల్లలకు అసలు మొబైల్ ఫోన్ ఇవ్వకూడదని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?

పిల్లలు ఏడాది తర్వాత చిన్న చిన్న మాటలు మాట్లాడటం ప్రారంభిస్తారు. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకుండా ఇతరులతో మాట్లాడటం అలవాటు చేయాలి. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇలా కుటుంబ సభ్యులతో సమయం గడిపేలా చేయాలి. దీనివల్ల వారికి తొందరగా మాటలు వస్తాయి. పూర్వకాలంలో స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం వల్ల పిల్లలు కుటుంబ సభ్యులతో ఉంచి మాట్లాడించేవారు. వారికి ఒక్కో మాట నేర్పిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే తొందరగా మాటలు వస్తాయి. అదే చిన్నతనంలో వారు ఎక్కువగా మొబైల్స్ చూస్తుంటే మాత్రం పెద్దయ్యాక వారికి ఆటిజం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Telangana: రాజీవ్‌ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు.. ఆ 5 వ్యాధులు ఫసక్.. తప్పక తెలుసుకోండి!

కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్స్ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేసి శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గటంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

New Update
Curry Leaves

Curry Leaves

Curry leaves: భారతీయులు ఆహారాన్ని రుచికరంగా చేసుకోవడానికి కరివేపాకును ఉపయోగిస్తారు. కరివేపాకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్స్ శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గటంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కొలెస్ట్రాల్‌ పరార్:

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది శరీరం నుండి హానికరమైన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కరివేపాకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేసి ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 
ఇది కూడా చదవండి: మెదడుకి మేలు చేసే ఆరు శక్తివంతమైన ఆహారాలు

కరివేపాకులో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇది కంటిశుక్లం చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది.  కరివేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలు, మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా, మెరుస్తూ ఉంచుతుంది. కరివేపాకు తినడానికి ఉత్తమ మార్గం ఉదయం ఖాళీ కడుపుతో 4-5 కరివేపాకులను నమలడం. దీని తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. మీరు దీన్ని జ్యూస్, సూప్, టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలా రోజూ చేయడం వల్ల శరీరానికి అధిక ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: తొలి సీజన్ మామిడి పండ్లు ఆరోగ్యానికి హానికరమా..?

( curry-leaves | curry-leaves-benefits | curry-leaves-water | health-tips | latest health tips | best-health-tips | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment