Hyderabad: ఎట్టకేలకు చిక్కిన చిరుత..ఎయిర్ పోర్ట్‌లో ప్రశాంతం

శంషాబాద్‌లో ఆరు రోజులుగా దొరక్కుండా తప్పించుకుని తిరుగుతూ భయపెడుతున్న చిరుత ఎట్టకేలకు దొరికింది. ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చిన చిరుత బోనులో చిక్కింది. దీంతో స్థానికులు, అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Hyderabad: ఎట్టకేలకు చిక్కిన చిరుత..ఎయిర్ పోర్ట్‌లో ప్రశాంతం

Leopard Trapped In Shamshabad Air Port: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆరు రోజులుగా ఓ చిరుత కలకలం రేపింది. ఆరు రోజుల క్రితం గొల్లపల్లి మీదుగా ఎయిర్‌పోర్టు ఫెన్సింగ్‌ దూకి ఎయిర్ పోర్ట్ రన్‌వే మీదకు వచ్చింది. గోడ దూకుతున్నప్పుడు చిరుత ఫెన్సింగ్‌కు కాలు తగలడంతో అలార్మ్స్‌ మోగాయి. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అప్పటి నుంచి అక్కడక్కడే తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఎంత పట్టుకుందామన్నా తప్పించుకుని తిరిగింది. చిరుత కోసం ఎయిర్ పోర్ట్ సిబ్బందే కాక అటవీ శాఖ ప్రత్యేక బృందాలు కూడా తెగ గాలించాయి.

ఆరు రోజులుగా ఏడిపించిన చిరుత..

ఎయిర్ పోర్ట్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో చిరుత ఫెన్సింగ్‌ దూకినట్టు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 20కి పైగా ట్రాప్ కెమెరాలు, 5 బోన్లు పెట్టారు చిరుత కోసం. ఆరు రోజులుగా బోన్ వరకు వచ్చి చిరుత మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయింది. ప్రతీరోజు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయిన చిరుత దృశ్యాలు రికార్డ్ అవుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఇవాళ తెల్లవారు ఝామున 2 గంటలకు బోనులో చిరుత చిక్కింది. ఎరగా వేసిన మేకను తినడానికి వచ్చిన చిరుత బోనులో ఉండిపోయింది. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు, అటవీశాఖ ప్రత్యేక బృందాలు ఊపిరి పీల్చుకున్నారు.

నెహ్రూ జూపార్క్‌కు...

కాసేపట్లో చిరుతను ఎయిర్‌పోర్టు నుంచి నెహ్రూ జూ పార్క్ కు అధికారులు తరలించనున్నారు. అక్కడ జూ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచనున్నారు. తర్వాత నల్లమల అడవిలో వదిలేస్తామని చెప్పారు అటవీ శాఖ అధికారులు.

Also Read: Brazil: బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment