🔴 LIVE NEWS: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ MLAలు ఏకగ్రీవం

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Feb 19, 2025 21:21 IST

    Delhi CM Rekha Gupta : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ MLAలు ఏకగ్రీవం

    ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఢిల్లీ రామ్ లీలీ మైదాన్‌లో ఘనంగా రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమెతోపాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

    bjp rekha gupta
    bjp rekha gupta Photograph: (bjp rekha gupta )

     



  • Feb 19, 2025 15:27 IST

    BIG BREAKING: వైఎస్ జగన్ పై కేసు

    ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చీ యార్డులో పర్యటించిన వైఎస్ జగన్ పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. యార్డులోకి వెళ్లకూడదని ముందే చెప్పినా జగన్ పట్టించుకోలదని పోలీసులు చెబుతున్నారు.

    YS Jagan Mohan Reddy
    YS Jagan Mohan Reddy

     



  • Feb 19, 2025 13:34 IST

    రేవంత్ రెడ్డి ఫొటోకు కుమారి ఆంటీ ప్రత్యేక పూజలు.. దేవుని గదిలో హారతిస్తూ (వీడియో )!

    కుమారీ ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఫుడ్ స్టాల్ తొలగించొదని గతంలో అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పూజలు చేస్తోంది. తన ఇంట్లో దేవుని గదిలో దేవుళ్లతో పాటుగా రేవంత్ రెడ్డికి పూజలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    Kumari aunty worshipping Telangana CM Revanth Reddy photo In Pooja Room
    Kumari aunty worshipping Telangana CM Revanth Reddy photo In Pooja Room Photograph: (Kumari aunty worshipping Telangana CM Revanth Reddy photo In Pooja Room)

     



  • Feb 19, 2025 12:44 IST

    తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో హైటెన్షన్!

    తెలంగాణలో బర్డ్‌ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా వనపర్తి జిల్లాలోని కొన్నూరు గ్రామంలో రైతు శివకేశవరెడ్డికి చెందిన 4వేల కోళ్లు చనిపోయాయి. దీంతో అతడు ఆవేదన చెందుతున్నాడు. వెటర్నరీ అధికారులకు తెలిపినా వారు స్పందించలేదని అతడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

    Bird Flu Outbreak In Telangana, Wanaparthy 4000 Chickens Died at Poultry
    Bird Flu Outbreak In Telangana, Wanaparthy 4000 Chickens Died at Poultry Photograph: (Bird Flu Outbreak In Telangana, Wanaparthy 4000 Chickens Died at Poultry)

     



  • Feb 19, 2025 12:15 IST

    ఏంటీ ఘోరం.. బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్!

    తమిళనాడు కోయంబత్తూర్లో దారుణం జరిగింది. 17ఏళ్ల బాలికపై 7గురు విద్యార్థులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ కాలేజీ విద్యార్థి.. ఆమెను తన గదికి రప్పించుకున్నాడు. అనంతరం తనతో పాటు ఆరుగురు స్నేహితులతో అత్యాచారం చేయించాడు.



  • Feb 19, 2025 12:14 IST

    కామారెడ్డి లో విద్యార్థుల కోసం ఛావా సినిమా ప్రత్యేక షో!



  • Feb 19, 2025 12:14 IST

    కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం.. రెండు తెలంగాణ ఆర్టీసీ బస్సులు దగ్ధం

    హైదరాబాద్ కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పార్కింగ్‌లో ఉన్న రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు అంటుకొని బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

    bus fire
    bus fire

     



  • Feb 19, 2025 08:09 IST

    నా సోదరుడు, మరదలు అప్పులు తెచ్చారు.. నేనిక తీర్చలేను: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు ముగ్గురు బలి!

    కర్ణాటకలోని మైసూర్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు ముగ్గురు బలైయ్యారు. జోశి ఆంథోని ఆత్మహత్య చేసుకునేముందు ఓ వీడియో చేశాడు. తన అన్న,మరదలు రూ.80లక్షల వరకు అప్పులు చేశారని అవి తీర్చలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఆ వీడియో వైరల్ కావడంతో అతడి అన్న,మరదలు ఉరివేసుకున్నారు.

    Karnataka Mysore brothers and woman died due to online betting
    Karnataka Mysore brothers and woman died due to online betting Photograph: (Karnataka Mysore brothers and woman died due to online betting)

     



  • Feb 19, 2025 08:08 IST

    ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే వారికి అలర్ట్..నేడు ఆ రైలు రద్దు..14 గంటల ముందే రైల్వే శాఖ ప్రకటన!

    సికింద్రాబాద్‌ నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌ రాజ్‌ మీదుగా దానాపూర్‌ వెళ్లాల్సిన రైలును రైల్వే బోర్డు రద్దు చేసింది. బుధవారం ఉదయం బయల్దేరాల్సి ఉండగా..మంగళవారం రాత్రి రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

    Kumbh Mela and Train
    Kumbh Mela and Train

     



  • Feb 19, 2025 08:06 IST

    మెగా సమరానికి సై..నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ...

    అన్నీ పెద్ద జట్లే..ఒక్కటీ బోర్ కొట్టే మ్యాచ్ ఉండదు. ఏ ఒక్క టీమ్ నీ తక్కువగా అంచనా వేయలేము. 19 రోజులు...15 మ్యాచ్ లు...విజేతగా నిలిచేది ఎవరో...రసవత్తరమైన ఛాంపియన్స్ ట్రోఫీకి తెర లేచేది నేడే...

    Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ షెడ్యూల్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే.. 



  • Feb 19, 2025 08:05 IST

    యూ బెగ్గర్‌ అని పిలిచేవాడు...అందుకే చంపేశా!

    వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సొంత మనవడే ఆయనను హత్య చేశాడు. తాత సొంతమనిషిలా చూడకుండా అవమానించడం వల్లే ఈ హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు