🔴 LIVE BREAKINGS: ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సమావేశాలు.. కులగణనపై కీలక ఘట్టం

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Jan 30, 2025 19:37 IST

    Telangana Assembly: ఫిబ్రవరి 7న అసెంబ్లీ స్పెషల్ సమావేశాలు.. కులగణనపై కీలక ఘట్టం

    కలగణనకు అమోదం తెలిపేందుకు ఫిబ్రవరి 7 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్‌ను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. దానిపై ఫిబ్రవరి 5న మంత్రివర్గం భేటీ కానుంది.

    Telangana Cabinet
    Telangana Cabinet

     



  • Jan 30, 2025 12:18 IST

    వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

    మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పాస్‌ లను పూర్తిగా రద్దు చేసింది.ఈ ప్రాంతాన్నినో వెహికల్‌ జోన్‌ గా ప్రకటించింది.

    maha kumbh mela 2025
    maha kumbh mela 2025

     



  • Jan 30, 2025 10:49 IST

    మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ తల్లి కన్నుమూత

    ప్రముఖ సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఇంట విషాదం చోటుచేసుకుంది.  ఆయన తల్లి లివి సురేష్ బాబు(65) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కేరళలోని కుర్కెన్చెరీలోని తన అపార్ట్ మెంట్ లో తుదిశ్వాస విడిచారు.

    gopi sundar
    gopi sundar Photograph: (gopi sundar)

     



  • Jan 30, 2025 09:41 IST

    అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

    అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక విమానం, హెలికాఫ్టర్ ఢీ కొన్నాయి. దీంతో రెండూ పక్కనే ఉన్న నదిలో కూలిపోయాయి. విమానంలో 60 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

    usa
    Washington Plane, Helicopter Crash

     



  • Jan 30, 2025 09:41 IST

    రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం



  • Jan 30, 2025 09:40 IST

    దొంగగా మారిన ఐటీ ఎంప్లాయ్.. కొలీగ్ ఇంటికి వెళ్లి అతని భార్యను..

    అతనో ఐటీ కంపెనీలో ఎంప్లాయ్.. లక్షల్లో జీతం.. బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. జల్సాలు, షికార్లుకు అలవాటు పడి వచ్చే జీతం సరిపోక అప్పులపాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు బాగా ఒత్తిడి చేయడంతో దొంగగా మారాడు. ఏకంగా తన తోటి ఉద్యోగి ఇంట్లోనే దోపిడీకి పాల్పడ్డాడు.

    it employee
    it employee Photograph: (it employee)

     



  • Jan 30, 2025 09:40 IST

    తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

    రాష్ట్రం లో పంచాయతీ పాలకవర్గాల పాలన ముగిసి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనపించడం లేదు. దీనికి కారణం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సామాజిక సర్వే. బీసీ రిజర్వేషన్ తేలితేగానీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు

    Read More : https://rtvlive.com/telangana/elections-to-local-bodies-in-telangana-8669712



  • Jan 30, 2025 09:39 IST

    ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ పేమెంట్స్ చేయలేరు!

    దేశంలో యూపీఐ రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఫిబ్రవరి 1, 2025 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరని ఓ వార్త వినపడుతుంది. లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు అంటే @, #, $ వంటివి ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు అవ్వనుంది.

    UPI Payments: బయోమెట్రిక్, ఫేస్‌ ఐడీలతో UPI పేమెంట్స్.. ఎప్పటి నుంచి అంటే?



  • Jan 30, 2025 09:38 IST

    తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు.. లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే!

    తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు అనేదానిపై  ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవికాలం ఏప్రిల్ 7వ తేదీతో ముగియనుంది.  దీంతో తదుపరి సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

    Telangana new cs
    Telangana new cs Photograph: (Telangana new cs )

     



  • Jan 30, 2025 09:38 IST

    గ్రేటర్‌ మేయర్‌కు షాక్‌...ఆ భూములు వెనక్కు....

    గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి మరో షాక్‌ తగిలింది. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సదరు జీవోను రద్దు చేస్తూ.. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో కోరారు.

    Greater Mayor Gadwal Vijayalakshimi
    Greater Mayor Gadwal Vijayalakshimi

     



  • Jan 30, 2025 09:37 IST

    టెన్త్ విద్యార్థులకు రేవంత్ సర్కార్‌ గుడ్ న్యూస్

    టెన్త్ విద్యార్థులకు కాంగ్రెస్ సర్కార్‌ గుడ్ న్యూస్ చెప్పింది.  ప్రభుత్వ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది.  స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

    evening snacks
    evening snacks Photograph: (evening snacks)

     



  • Jan 30, 2025 09:36 IST

    27 ఏళ్ల క్రితం మిస్సింగ్.. కుంభమేళాలో అఘోరిగా కనిపించిన భర్త ..

    ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.  ప్రస్తుతం 65 ఏళ్ల వయసులో ఉన్న గంగాసాగర్ యాదవ్ 1998లో పాట్నా వెళ్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు.  27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తను ఓ మహిళ గుర్తించింది. పూర్తి స్టోరీ చదవండి.

    Maha Kumbh 2025
    Maha Kumbh 2025 Photograph: (Maha Kumbh 2025)

     



  • Jan 30, 2025 09:35 IST

    డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలనం



  • Jan 30, 2025 09:34 IST

    ప్లే స్టోర్ లో డీప్‌ సీక్‌ దూకుడు..కానీ ఆ ప్రశ్నలకు మాత్రం!



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు