IND VS SA: వారేవా ఏం ఆడావ్‌ బ్రో.. సెంచరీతో అదుర్స్‌.. టీమిండియా ఆలౌట్!

సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 245 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. కేఎల్‌ రాహుల్‌ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. టెస్టుల్లో రాహుల్‌కు ఇది 8వ సెంచరీ.

New Update
IND VS SA: వారేవా ఏం ఆడావ్‌ బ్రో.. సెంచరీతో అదుర్స్‌.. టీమిండియా ఆలౌట్!

కేఎల్‌ రాహుల్‌(KL Rahul) ఆపద్బాంధవుడుగా మారాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును నిలబెట్టాడు. టీమిండియా పరువు పోకుండా కాపాడాడు. సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికా(South Africa)పై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ రెండో రోజు ఫస్ట్ సెషన్‌లో ఆలౌట్ అయ్యింది. నిన్న వర్షం కారణంగా మ్యాచ్‌ 31 ఓవర్లు తక్కువగా సాగింది. ఇవాళ(డిసెంబర్ 27) అరగంట ముందే మ్యాచ్‌ మొదలవగా.. సిరాజ్‌తో కలిసి రాహుల్‌ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. సెంచరీతో అదరగొట్టాడు.


రాహుల్‌ అదుర్స్‌..కానీ ప్చ్:
ఓవర్‌నైట్‌ స్కోర్‌ 8 వికెట్లకు 208తో రెండు రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 37 రన్స్ మాత్రమే చేయగలిగింది. అయితే రాహుల్‌ టెస్టుల్లో 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిన్న ఆచుతూచీ బ్యాటింగ్‌ చేసిన రాహుల్ 73స్ట్రైక్‌ రేట్‌తో సెంచరీ చేయడం విశేషం. అటు సిరాజ్‌ కాసేపు సపోర్ట్ ఇచ్చాడు. 22 బంతుల్లో 5 పరుగులు చేసిన సిరాజ్‌ జట్టు స్కోరు 238 వద్ద 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 245 రన్స్‌ వద్ద భారత్‌ ఆలౌట్ అయ్యింది.


నిరాశపరిచిన టాపార్డర్:
అంతకముందు (నిన్న) టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. పేసర్లకు అనుకూలిస్తోన్న పిచ్‌పైకి ఓపెనర్లగా రోహిత్‌ శర్మ, యశస్వీ జైస్వాల్‌ దిగారు. రోహిత్‌ మరోసారి ఫోకస్‌ తప్పాడు. 14 బంతుల్లో 5 పరుగులు చేసిన రోహిత్ అనవసర షాట్ ఆడాడు. రబాడా బౌలింగ్‌లో బర్గర్‌ క్యాచ్‌కు రోహిత్‌ పెవిలియన్‌కు చేరాడు. దీంతో 13 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత టీమ్‌ స్కోరు 23 వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. మంచి టచ్‌లో కనిపించిన యాశస్వీ బర్గర్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 37 బంతుల్లో యశస్వీ 17 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత వెంటనే శుభమన్‌ గిల్‌ ఔట్‌ అయ్యాడు. కేవలం రెండు పరుగులకే బర్గర్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత భారత్‌ బ్యాటింగ్‌ భారాన్ని కోహ్లీ, అయ్యర్‌ మోశారు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే లంచ్‌ బ్రేక్‌ తర్వాత భారత్‌కు షాక్‌ తగిలింది. 50 బంతుల్లో 31 రన్స్ చేసి రబాడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటి 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్‌ కోహ్లీ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికీ భారత్‌ 107 రన్స్‌కు 5 వికెట్లు కోల్పోయి ఉంది. ఇక టీమిండియా 150 దాటడమే కూడా కష్టమే అనుకున్నారు.

పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను కీపర్‌ రాహుల్ ఆదుకున్నాడు. అశ్విన్‌ త్వరగా వెనుతిరగగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శార్దూల్ ఠాకూర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అప్పటికీ ఆరు వికెట్లు పడిపోవడంతో రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కపెట్టే బాధ్యత తీసుకున్న ఠాకూర్‌ పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్‌ 47వ ఓవర్‌లో ఏడో వికెట్‌గా వెనుతిరిగాడు. రబాడా వేసిన ఆ ఓవర్‌లో షార్ట్‌ మిడాఫ్‌లో ఎల్గర్‌కు దొరికిపోయాడు. మరో ఎండ్‌లో రాహుల్ మాత్రం ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా హాఫ్‌ సెంచరీ మార్క్‌ను దాటాడు. ఇక కాసుపు ఓపికగా ఆడిన బుమ్రా మార్కో జెన్సన్‌ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సిరాజ్‌ బ్యాటింగ్‌కు దిగగా.. కాసేపటికి వర్షం పడి మ్యాచ్‌ ఆగిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 5 వికెట్లు తీశాడు. బర్గర్‌ మూడు వికెట్లతో రాణించాడు.

Also Read: మేం దేశద్రోహులమా? అవార్డులను వెనక్కి ఇస్తున్నా.. మోదీకి వినేశ్‌ఎమోషనల్‌ లెటర్‌!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment