మొదటిపూజకు సిద్ధమయిన ఖైరతాబాద్ వినాయకుడు

New Update
Ganesh Nimajjanam 2023: గణేశ్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజకు సిద్ధమయ్యాడు. ఉదయం 9.30కు తొలిపూజను అందుకోనున్నాడు. దీనిలో గవర్నర్ తమిళిసై దంపతులు పాల్గొంటారు. ఈసారి 63 అడుగుల దశమహా విద్యాగణపతి విగ్రహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి.. ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవకమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 11 రోజుల పాటూ గణేశుడికి ఉత్సవాలు జరగనున్నాయి.

మరోవైపు ఖైరతాబాద్ గణపతి రికార్డ్ సృష్టించాడు. 63 అడుగుల ఎత్తు గల మట్టి విగ్రహంగా వరల్డ్‌ రికార్డ్‌ నెలకొల్పాడు. ఇప్పటికే మహాగణపతి వద్ద భక్తుల సందడి నెలకొంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే వ్యక్తి స్థానిక ఆలయంలో ఒక అడుగు గణపయ్యను ప్రతిష్టించి పూజలు చేశారు. అప్పటినుంచి ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.

ఈసారి గణేశుడు విద్యాగణపతిగా దర్శనమిస్తున్నాడు. తలపై ఏడు సర్పాలు, వెనుక భాగంలో సంస్కృతి వచనం కనిపిస్తాయి. పది చేతులు ఉన్నాయి. కుడి చేతుల్లో ఆశీర్వాదం, దండ, ధాన్యం, కత్తి, బాణం ఉండగా...ఎడమచేతుల్లో లడ్డూ, పుస్తకం, తాడు, బాణం ఉన్నాయి. పాదాల దగ్గర పది అడుగుల ఎత్తులో వరాహదేవి, సరస్వతీదేవి విగ్రహాలున్నాయి. ప్రధాన మండపానికి ఇరువైపులా 15 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలున్నాయి. మొత్తం అన్ని విగ్రహాలు మట్టితోనే తయారు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. దీనిని 150 మంది కళాకారులు 100 రోజుల పాటూ పనిచేశారు. విగ్రహం తయారీకి మొత్తం 90 లక్షలు ఖర్చయ్యాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGSRTC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు.

New Update
RTC MD VC Sajjanar

RTC MD VC Sajjanar

తెలంగాణ ఆర్టీసీ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వైస్‌ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. దీనికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని తెలిపారు. వీటి భర్తీ తర్వాత కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్  జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

Also Read: తెలంగాణ రాజకీయాల్లో పదవుల పంచాయితీ..పేలుతున్న మాటల తూటాలు!

అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత ఆయన మాట్లాడారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని కూడా చెప్పారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని తెలిపారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీ ప్రకారం మరో 18వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.     

Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

గ్రూప్​1,2,3,4 పోస్టులతోపాటు పోలీసు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో14,236 అంగన్ వాడీ, హెల్త్​ డిపార్ట్​మెంట్​లో 4 వేలకు పైగా పోస్టులకు ఏప్రిల్ చివరిలోగా నోటిఫికేషన్ రిలీజ్​ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరిన్ని శాఖల ఖాళీలపై స్పష్టత రాగానే  జాబ్​క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ విడుదలకానున్నాయి. ఇక ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్  నోటిఫికేషన్‌ను షెడ్యూల్​ చేసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ కోసం వాయిదా వేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావాల్సివుంది. 

Also Read: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

 rtv-news | rtc | jobs

 

Advertisment
Advertisment
Advertisment