Breaking : లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్ కు బెయిల్!

లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్ కు బెయిల్ లభించింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో హారజరైన ఆయనకు రూ.15000 బెయిల్‌ బాండ్‌, రూ.లక్ష పూచీకత్తుతో రౌస్ రెవిన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి అనుమతితో కేజ్రివాల్‌ కోర్టు నుంచివెళ్లిపోయారు.

New Update
Breaking : లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్ కు బెయిల్!

Delhi : లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case) లో కేజ్రివాల్ కు బెయిల్ లభించింది. రూ. రూ.15000 బెయిల్‌ బాండ్‌, రూ.లక్ష పూచీకత్తుతో రెవిన్యూ కోర్ట్ బెయిల్(Bail) మంజూర్ చేసింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రివాల్‌ వెళ్లిపోయారు.

కేజ్రివాల్ స్పందించకపోవడంతో..
లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఢీల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నేడు కోర్టులో హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇటీవల దర్యాప్తునకు సహకరించాలంటూ ఈడీ అధికారులు పంపిన నోటీసులకు కేజ్రివాల్ స్పందించకపోవడంతో న్యాయస్థానంలో ఈడీ ఫిర్యాదు చేసింది. దీంతో రెండుసార్లు సమన్లను రౌస్ అవెన్యూ సీబీఐ(CBI) ప్రత్యేక కోర్టు జారీ చేయగా.. తనకు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టును అరవింద్ కేజ్రీవాల్ ఆశ్రయించారు. అయితే కేజ్రీవాల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసి పుచ్చింది. ఈ క్రమంలో కోర్టు తన విజ్ఞప్తిని అంగీకరించకపోవడంతో కోర్టు ముందు శనివారం హాజరయ్యారు ఢిల్లీ సీఎం.

ఇది కూడా చదవండి :  KTR: కవిత కేసులోకి చంద్రబాబును లాగిన కేటీఆర్.. ట్వీట్ వైరల్!

ఇదిలావుంటే.. ఇప్పటికే మనిలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే 8 సార్లు నోటీసులను జారీ చేసింది ఈడీ(ED). కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరగా అనూహ్యంగా కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కల్తీ కల్లు కలకలం.. 58 మందికి తీవ్ర అస్వస్థత

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు తాగి మతిస్థిమితం కోల్పోవడంతో పాటు వింతగా ప్రవర్తించారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

New Update
Kamareddy issues

Kamareddy issues Photograph: (Kamareddy issues)

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు. వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

కల్తీ కల్లు తాగిన వారి పరిస్థితి విషమం..

ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆ కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు వల్ల ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోవాలని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలని, ఇలాంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వకూడదని స్థానికులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

Advertisment
Advertisment
Advertisment